ఒడిశాలోని మయూర్భంజ్లో భర్త కోసం పోలీసు స్టేషన్ వరకు 3 కిలోమీటర్లు నడిచింది ఓ గిరిజన గర్భిణీ. హెల్మెట్ ధరించని కారణంగా తన భర్త బిక్రమ్ను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఎన్ని గంటలు గడిచినా అతడు తిరిగిరాక పోవడం వల్ల ఠాణాకు నడవక తప్పలేదు.

ఇదీ జరిగింది..
నోటా గ్రామ పంచాయతీకి చెందిన బిక్రమ్ బరోలీ అనే వ్యక్తి 8 నెలల గర్భవతి అయిన తన భార్యను చెకప్ కోసం బైక్పై ఉడాలాలోని ఆస్పత్రికి తీసుకెళ్తున్నాడు. అయితే హెల్మెట్ ధరించలేదని నూతన మోటారు వాహన చట్టం కింద జరిమానా కట్టమని ఆఫీసర్ ఇన్ఛార్జ్ రీనా బక్సల్ ఆదేశించారు.
వారి వద్ద తగినన్ని డబ్బులు లేకపోవడం వల్ల ఆన్లైన్లో చెల్లిస్తామని చెప్పారు. అందుకు నిరాకరించిన బక్సల్.. గర్భిణిని రోడ్డుపైనే వదిలేసి, బిక్రమ్ను పోలీసు స్టేషన్కు తరలించారు. గంటలు గడుస్తున్నా భర్త తిరిగి రాకపోవడం వల్ల మరో దారిలేక 3 కిలోమీటర్లు నడిచి ఠాణాకు చేరుకుంది అభాగ్య మహిళ.

సస్పెండ్..
బిక్రమ్ ఫిర్యాదుతో ఈ ఘటనపై ఎస్డీపీఓ దర్యాప్తు చేశారు. రీనా బక్సల్ను తాత్కాలికంగా విధుల నుంచి తప్పించారు.
ఇదీ చూడండి: 73 ఏళ్ల బామ్మకు వరుడు కావాలట- షరతులు ఇవే!