ETV Bharat / bharat

అత్యాచార బాధితురాలి నుంచి లంచం- కానిస్టేబుల్​ అరెస్ట్

author img

By

Published : Mar 28, 2021, 7:46 AM IST

అత్యాచార బాధితురాలి నుంచి లంచం డిమాండ్​ చేసిన కానిస్టేబుల్​ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేసిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందేలా చూస్తాననే నెపంతో మహిళ నుంచి నిందితుడు రూ. 20వేలు డిమాండ్​ చేశాడని పోలీసులు తెలిపారు.

conistable arrested in ghorakhpur for accepted bribe from rape victim
రేప్​ బాధితురాలి నుంచి లంచం డిమాండ్​ చేసిన కానిస్టేబుల్​ను అరెస్టు చేసిన యూపీ పోలీసులు

ఉత్తర్​ప్రదేశ్​ గోరఖ్​పుర్​లో ఓ అత్యాచార​ బాధితురాలి నుంచి లంచం డిమాండ్​ చేసిన కానిస్టేబుల్​ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. రూ.20 వేలు ఇస్తే.. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం వచ్చేలా చేస్తానని బాధిత మహిళను నిందితుడు ప్రలోభపెట్టాడని పోలీసులు తెలిపారు.

అంతేకాకుండా లంచం ఇవ్వడానికి అంగీకరించకపోతే చర్యలు తీసుకుంటానని మహిళను భయపెట్టాడని స్థానిక ఇన్​స్పెక్టర్ రామ్​ధారి మిశ్రా తెలిపారు. బాధిత మహిళ సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ కానిస్టేబుల్​ను అరెస్టు చేశారు.

ఉత్తర్​ప్రదేశ్​ గోరఖ్​పుర్​లో ఓ అత్యాచార​ బాధితురాలి నుంచి లంచం డిమాండ్​ చేసిన కానిస్టేబుల్​ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. రూ.20 వేలు ఇస్తే.. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం వచ్చేలా చేస్తానని బాధిత మహిళను నిందితుడు ప్రలోభపెట్టాడని పోలీసులు తెలిపారు.

అంతేకాకుండా లంచం ఇవ్వడానికి అంగీకరించకపోతే చర్యలు తీసుకుంటానని మహిళను భయపెట్టాడని స్థానిక ఇన్​స్పెక్టర్ రామ్​ధారి మిశ్రా తెలిపారు. బాధిత మహిళ సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ కానిస్టేబుల్​ను అరెస్టు చేశారు.

ఇదీ చదవండి: లేడీ సింగమ్​ ఆత్మహత్య కేసులో అధికారి అరెస్టు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.