ETV Bharat / bharat

భద్రత ప్రమాణాలు లేకుండా మైనింగ్​.. పొక్లైన్​లో మంటలొచ్చి ఆపరేటర్ మృతి

author img

By

Published : Jun 25, 2022, 4:43 PM IST

Poclain operator burn alive: బొగ్గుగనిలో పనిచేస్తున్న పొక్లైన్​లో మంటలు వ్యాపించడం వల్ల ఆపరేటర్​ సజీవ దహనమయ్యాడు. సరైన భద్రత ప్రమాణాలు పాటించకుండా మైనింగ్​ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కార్మిక నాయకులు చెప్పారు. ఈ ఘటన ఝార్ఖండ్​లోని బొకారోలో జరిగింది.

Poclain operator burn alive
Poclain operator burn alive

Poclain operator burn alive: ఝార్ఖండ్​ బొకారోలోని బొగ్గుగనిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పొక్లైన్​లో మంటలు చెలరేగడం వల్ల ఆపరేటర్​ సజీవ దహనమయ్యాడు. సరైన భద్రత ప్రమాణాలు పాటించకుండా మైనింగ్​ చేపట్టడం వల్లే.. ఈ ప్రమాదం జరిగిందని కార్మిక నాయకులు తెలిపారు. ధోరి ప్రాంతంలోని కల్యాణి ఎస్​డీఓసీఎమ్​ ప్రాజెక్ట్​ పరిధిలోని కోల్​ఇండియా బొగ్గుగనిలో మహేంద్ర అనే వ్యక్తి పొక్లైన్​ నడుపుతున్నాడు. ఈ క్రమంలోనే సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా మైనింగ్​ చేపట్టడం వల్ల వాహనంలో మంటలు చెలరేగాయి. సహాయక సిబ్బంది చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. మంటలు అధికమవడం వల్ల మహేంద్ర సజీవ దహనమయ్యాడు. అనంతరం నీటితో మంటలను ఆర్పి మృతదేహాన్ని వెలికితీశారు. ఘటనా స్థలానికి కార్మికులు పెద్దఎత్తున చేరుకున్నారు.

Poclain operator burn alive
మంటలను ఆర్పుతున్న సిబ్బంది
Poclain operator burn alive
సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది

"సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా పనులు చేపట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. అప్పటికే మంటలు ఉన్నాయి. ముందుగా హైవాల్​ నుంచి తొలగిస్తూ ఓవర్​బర్డెన్​ వైపు రావాలి. కానీ అలా చేయకుండా ఓవర్​వర్డెన్​ను తొలగించారు. అందుకే మంటలు వ్యాపించి వాహనం సహా ఆపరేటర్​ మరణించారు."

- నారాయణ్​ మహతో, కార్మిక నాయకుడు

మరోవైపు ఈ ఘటనకు కోల్​ ఇండియా యాజమాన్యం, ఔట్​సోర్సింగ్​ కంపెనీల వైఫల్యమే కారణమని కార్మిక నాయకుడు వికాస్ సింగ్ ఆరోపించారు. గనుల సెక్యూరిటీ సిబ్బందిని మైనింగ్​ సహా ఇతర పనులు చేయించుకుంటున్నారని.. అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ ఘటన జరగడం చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Poclain operator burn alive
గుమికూడిన కార్మికులు

ఇదీ చదవండి: 7వ అంతస్తు పిట్టగోడపై కూర్చోని రోగి హల్​చల్​.. చివరకు కిందపడి మృతి

Poclain operator burn alive: ఝార్ఖండ్​ బొకారోలోని బొగ్గుగనిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పొక్లైన్​లో మంటలు చెలరేగడం వల్ల ఆపరేటర్​ సజీవ దహనమయ్యాడు. సరైన భద్రత ప్రమాణాలు పాటించకుండా మైనింగ్​ చేపట్టడం వల్లే.. ఈ ప్రమాదం జరిగిందని కార్మిక నాయకులు తెలిపారు. ధోరి ప్రాంతంలోని కల్యాణి ఎస్​డీఓసీఎమ్​ ప్రాజెక్ట్​ పరిధిలోని కోల్​ఇండియా బొగ్గుగనిలో మహేంద్ర అనే వ్యక్తి పొక్లైన్​ నడుపుతున్నాడు. ఈ క్రమంలోనే సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా మైనింగ్​ చేపట్టడం వల్ల వాహనంలో మంటలు చెలరేగాయి. సహాయక సిబ్బంది చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. మంటలు అధికమవడం వల్ల మహేంద్ర సజీవ దహనమయ్యాడు. అనంతరం నీటితో మంటలను ఆర్పి మృతదేహాన్ని వెలికితీశారు. ఘటనా స్థలానికి కార్మికులు పెద్దఎత్తున చేరుకున్నారు.

Poclain operator burn alive
మంటలను ఆర్పుతున్న సిబ్బంది
Poclain operator burn alive
సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది

"సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా పనులు చేపట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. అప్పటికే మంటలు ఉన్నాయి. ముందుగా హైవాల్​ నుంచి తొలగిస్తూ ఓవర్​బర్డెన్​ వైపు రావాలి. కానీ అలా చేయకుండా ఓవర్​వర్డెన్​ను తొలగించారు. అందుకే మంటలు వ్యాపించి వాహనం సహా ఆపరేటర్​ మరణించారు."

- నారాయణ్​ మహతో, కార్మిక నాయకుడు

మరోవైపు ఈ ఘటనకు కోల్​ ఇండియా యాజమాన్యం, ఔట్​సోర్సింగ్​ కంపెనీల వైఫల్యమే కారణమని కార్మిక నాయకుడు వికాస్ సింగ్ ఆరోపించారు. గనుల సెక్యూరిటీ సిబ్బందిని మైనింగ్​ సహా ఇతర పనులు చేయించుకుంటున్నారని.. అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ ఘటన జరగడం చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Poclain operator burn alive
గుమికూడిన కార్మికులు

ఇదీ చదవండి: 7వ అంతస్తు పిట్టగోడపై కూర్చోని రోగి హల్​చల్​.. చివరకు కిందపడి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.