ETV Bharat / bharat

'ఉజ్వల 2.0' పథకం ప్రారంభించనున్న ప్రధాని

author img

By

Published : Aug 10, 2021, 5:31 AM IST

Updated : Aug 10, 2021, 6:23 AM IST

ఉజ్వల 2.0 పథకాన్ని ఉత్తర్​ప్రదేశ్​లో మంగళవారం ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ కార్యక్రమంలో నిరుపేదలకు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు అందించనున్నారు.

Narendra Modi
ఉజ్వల

ఉజ్వల 2.0 (ప్రధానమంత్రి ఉజ్వల యోజన) పథకాన్ని ఉత్తర్​ప్రదేశ్​లోని మహోబా జిల్లాలో నేడు (మంగళవారం) ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ పథకం ప్రారంభించనున్నారు మోదీ. ఈ కార్యక్రమానికి మహోబా జిల్లా నుంచి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరవుతారని ఓ అధికారి తెలిపారు.

అల్పాదాయ వర్గాలకు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు అందించడం కోసం తీసుకొచ్చిందే ఉజ్వల. ఈ కార్యక్రమంలో ఉజ్వల లబ్ధిదారులతో మాట్లాడనున్న ప్రధాని, అనంతరం దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ఉజ్వల తొలి దశలో 1,47,43,862 ఎల్​పీజీ కనెక్షన్లను పేద కుటుంబాలకు అందించినట్లు అధికారులు వెల్లడించారు. ఆ సమయంలో అందని వారికి రెండో దశలో కనెక్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: గ్యాస్​ కనెక్షన్​ కావాలా? ఒక్క మిస్డ్​కాల్​ ఇవ్వండి

ఉజ్వల 2.0 (ప్రధానమంత్రి ఉజ్వల యోజన) పథకాన్ని ఉత్తర్​ప్రదేశ్​లోని మహోబా జిల్లాలో నేడు (మంగళవారం) ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ పథకం ప్రారంభించనున్నారు మోదీ. ఈ కార్యక్రమానికి మహోబా జిల్లా నుంచి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరవుతారని ఓ అధికారి తెలిపారు.

అల్పాదాయ వర్గాలకు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు అందించడం కోసం తీసుకొచ్చిందే ఉజ్వల. ఈ కార్యక్రమంలో ఉజ్వల లబ్ధిదారులతో మాట్లాడనున్న ప్రధాని, అనంతరం దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ఉజ్వల తొలి దశలో 1,47,43,862 ఎల్​పీజీ కనెక్షన్లను పేద కుటుంబాలకు అందించినట్లు అధికారులు వెల్లడించారు. ఆ సమయంలో అందని వారికి రెండో దశలో కనెక్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: గ్యాస్​ కనెక్షన్​ కావాలా? ఒక్క మిస్డ్​కాల్​ ఇవ్వండి

Last Updated : Aug 10, 2021, 6:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.