ETV Bharat / bharat

'నేతాజీ ధైర్యసాహసాలకు ప్రతీకగా పరాక్రమ దివస్​'

author img

By

Published : Jan 23, 2021, 10:46 AM IST

నేతాజీ సుభాష్​ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్​నాథ్​​ కోవింద్​లు నివాళులు అర్పించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో నేతాజీ ఎనలేని కృషి చేశారని రాష్ట్రపతి కొనియాడారు. బోస్​ త్యాగాలను దేశం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందని మోదీ తెలిపారు.

president-pm-modi-pay-tributes-to-netaji-subhas-chandra-bose-on-his-125th-birth-anniversary
'నేతాజీ త్యాగం, దేశభక్తి చిరస్మరణీయం'

నేతాజీ సుభాష్​ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్​నాథ్​​ కోవింద్​లు ట్విట్టర్​ వేదికగా నివాళులర్పించారు.

president-pm-modi-pay-tributes-to-netaji-subhas-chandra-bose-on-his-125th-birth-anniversary
'నేతాజీ త్యాగం, దేశభక్తి చిరస్మరణీయం'

" జనవరి23ను 'పరాక్రమ దివస్​'గా జరుపుకోవటమే నేతాజీకి నిజమైన నివాళి. ఆయన ధైర్యసాహసాలకు ప్రతీకగా పరాక్రమ దివస్​ నిలుస్తుంది. నేతాజీ భారత ప్రజల్లో జాతీయతాభావాన్ని పెంపొందించేందుకు కృషి చేశారు. నేతాజీ త్యాగం, దేశభక్తి చిరస్మరణీయం. "

--రామ్​నాథ్​ కోవింద్, భారత రాష్ట్రపతి

స్వాతంత్య్రం కోసం నేతాజీ చేసిన త్యాగం దేశ ప్రజలు ఎన్నటికీ మరువరని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

president-pm-modi-pay-tributes-to-netaji-subhas-chandra-bose-on-his-125th-birth-anniversary
'నేతాజీ త్యాగం, దేశభక్తి చిరస్మరణీయం'

"నేతాజీ సుభాష్ చంద్రబోస్​కు నివాళులు. భరతమాతకు నిజమైన ముద్దు బిడ్డ నేతాజీ."

--నరేంద్ర మోదీ, భారత ప్రధాని

'షా' నివాళి

కేంద్ర హోం మంత్రి అమిత్​షా సైతం నేతాజీ సుభాష్​ చంద్రబోస్​కు అసోం గువాహటిలో నివాళులు అర్పించారు. నేతాజీ జీవితాన్ని విద్యార్థులకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు బోస్​ను స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలన్నారు.

నేతాజీ స్ఫూర్తి, ఆయన నిస్వార్థ సేవకు గౌరవ సూచకంగా ఆయన జయంతి(జనవరి 23)ను 'పరాక్రమ దివస్​'గా జరుపుకోవాలని కేంద్రం ఇటీవల నిర్ణయించింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినం సందర్భంగా శనివారం కోల్​కతాలో జరిగే 'పరాక్రమ దివస్'వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు.

ఇదీ చదవండి : 'నేతాజీ.. భారతావని పరాక్రమ పతాక'

నేడు కోల్​కతాకు మోదీ- 'పరాక్రమ్​ దివస్'​కు హాజరు

నేతాజీ సుభాష్​ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్​నాథ్​​ కోవింద్​లు ట్విట్టర్​ వేదికగా నివాళులర్పించారు.

president-pm-modi-pay-tributes-to-netaji-subhas-chandra-bose-on-his-125th-birth-anniversary
'నేతాజీ త్యాగం, దేశభక్తి చిరస్మరణీయం'

" జనవరి23ను 'పరాక్రమ దివస్​'గా జరుపుకోవటమే నేతాజీకి నిజమైన నివాళి. ఆయన ధైర్యసాహసాలకు ప్రతీకగా పరాక్రమ దివస్​ నిలుస్తుంది. నేతాజీ భారత ప్రజల్లో జాతీయతాభావాన్ని పెంపొందించేందుకు కృషి చేశారు. నేతాజీ త్యాగం, దేశభక్తి చిరస్మరణీయం. "

--రామ్​నాథ్​ కోవింద్, భారత రాష్ట్రపతి

స్వాతంత్య్రం కోసం నేతాజీ చేసిన త్యాగం దేశ ప్రజలు ఎన్నటికీ మరువరని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

president-pm-modi-pay-tributes-to-netaji-subhas-chandra-bose-on-his-125th-birth-anniversary
'నేతాజీ త్యాగం, దేశభక్తి చిరస్మరణీయం'

"నేతాజీ సుభాష్ చంద్రబోస్​కు నివాళులు. భరతమాతకు నిజమైన ముద్దు బిడ్డ నేతాజీ."

--నరేంద్ర మోదీ, భారత ప్రధాని

'షా' నివాళి

కేంద్ర హోం మంత్రి అమిత్​షా సైతం నేతాజీ సుభాష్​ చంద్రబోస్​కు అసోం గువాహటిలో నివాళులు అర్పించారు. నేతాజీ జీవితాన్ని విద్యార్థులకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు బోస్​ను స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలన్నారు.

నేతాజీ స్ఫూర్తి, ఆయన నిస్వార్థ సేవకు గౌరవ సూచకంగా ఆయన జయంతి(జనవరి 23)ను 'పరాక్రమ దివస్​'గా జరుపుకోవాలని కేంద్రం ఇటీవల నిర్ణయించింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినం సందర్భంగా శనివారం కోల్​కతాలో జరిగే 'పరాక్రమ దివస్'వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు.

ఇదీ చదవండి : 'నేతాజీ.. భారతావని పరాక్రమ పతాక'

నేడు కోల్​కతాకు మోదీ- 'పరాక్రమ్​ దివస్'​కు హాజరు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.