ETV Bharat / bharat

'భారత ప్రగతికి ఆటంకం.. వలసవాద మనస్తత్వం'

author img

By

Published : Nov 26, 2021, 7:52 PM IST

వలసవాద మనస్తత్వం అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రగతికి ఆటంకంగా నిలుస్తోందని ప్రధాని మోదీ అన్నారు. పారిస్​ ఒప్పందంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను నెరవేర్చిన ఏకైక దేశం భారతేనని స్పష్టం చేశారు.

modi on  Constitution Day
ప్రధాని మోదీ

భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో పాటు వలసవాద మనస్తత్వం కారణంగా భారత అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం వేదిక ఈ వ్యాఖ్యలు చేశారు.

"వలసవాద మనస్తత్వం ఇంకా ఉంది. ఈ వలసవాదాన్ని ప్రోత్సహించే శక్తులు.. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రగతికి ఆటంకం కలిగిస్తున్నాయి. పారిస్​ ఒప్పందంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను నెరవేర్చిన ఏకైక దేశం మనది. అయినప్పటికీ.. పర్యావరణం పేరుతో భారత్​పై అనేక రకాలుగా ఒత్తిడికి గురిచేస్తున్నారు. దీనికంతటికీ వలసవాద మనస్తత్వమే కారణం."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

'దురదృష్టవశాత్తు మన దేశంలోనూ.. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో కొన్నిసార్లు దేశ ప్రగతికి ఈ వలసవాదం ఆటంకంగా నిలుస్తోంది' అని మోదీ చెప్పారు.

"సబ్​ కా సాత్​​, సబ్​కా వికాస్​, సబ్​కా విశ్వాస్​, సబ్​కా​ ప్రయాస్​" అనే సూత్రం.. రాజ్యాంగం స్ఫూర్తికి చిహ్నం అని మోదీ పేర్కొన్నారు. రాజ్యంగానికి కట్టుబడి తమ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. అభివృద్ధి ఫలాలను ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ సమానంగా అందిస్తున్నామని అన్నారు.

భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో పాటు వలసవాద మనస్తత్వం కారణంగా భారత అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం వేదిక ఈ వ్యాఖ్యలు చేశారు.

"వలసవాద మనస్తత్వం ఇంకా ఉంది. ఈ వలసవాదాన్ని ప్రోత్సహించే శక్తులు.. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రగతికి ఆటంకం కలిగిస్తున్నాయి. పారిస్​ ఒప్పందంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను నెరవేర్చిన ఏకైక దేశం మనది. అయినప్పటికీ.. పర్యావరణం పేరుతో భారత్​పై అనేక రకాలుగా ఒత్తిడికి గురిచేస్తున్నారు. దీనికంతటికీ వలసవాద మనస్తత్వమే కారణం."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

'దురదృష్టవశాత్తు మన దేశంలోనూ.. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో కొన్నిసార్లు దేశ ప్రగతికి ఈ వలసవాదం ఆటంకంగా నిలుస్తోంది' అని మోదీ చెప్పారు.

"సబ్​ కా సాత్​​, సబ్​కా వికాస్​, సబ్​కా విశ్వాస్​, సబ్​కా​ ప్రయాస్​" అనే సూత్రం.. రాజ్యాంగం స్ఫూర్తికి చిహ్నం అని మోదీ పేర్కొన్నారు. రాజ్యంగానికి కట్టుబడి తమ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. అభివృద్ధి ఫలాలను ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ సమానంగా అందిస్తున్నామని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.