ETV Bharat / bharat

2025 నాటికి 25 నగరాల్లో మెట్రో సేవలు: మోదీ

author img

By

Published : Dec 28, 2020, 11:40 AM IST

Updated : Dec 28, 2020, 12:14 PM IST

భారత్​లోనే తొలి ​డ్రైవర్​ రహిత రైలు​ను.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో పాటు నేషనల్​ కామన్​ మొబిలిటీ కార్డు(ఎన్​సీఎంసీ)కు శ్రీకారం చుట్టారు.

PM Narendra Modi
దేశంలోనే తొలి డ్రైవర్ రహిత మెట్రో రైలు ప్రారంభం

దేశంలోనే మొట్టమొదటి డ్రైవర్‌ లేని రైలును ప్రధాని నరేంద్ర మోదీ.. ఇవాళ దిల్లీ మెట్రోలో ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్​ కూడా హాజరయ్యారు.

"తొలి డ్రైవర్​ రహిత మెట్రో రైలు ప్రారంభం కావడం చూస్తే ఆధునికత వినియోగంలో భారత్​ ఎంత వేగం కనబరుస్తోందో తెలుస్తోంది. దేశంలో తొలి మెట్రో రైలు.. వాజ్​పేయీ కృషి వల్ల ప్రారంభమైంది. 2014లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి కేవలం 5 నగరాల్లోనే మెట్రో సేవలు ఉన్నాయి. ఇప్పుడు 18 నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. 2025 నాటికి 25 నగరాల్లో మెట్రో సేవలను విస్తరిస్తాం."

- నరేంద్ర మోదీ, ప్రధాని

ఈ చోదకరహిత రైలును.. మాజెంటా లైన్‌లో జనక్‌పురి నుంచి బొటానికల్ గార్డెన్‌ వరకు 37 కిలోమీటర్ల మేర నడపనున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో మజ్లిస్‌ పార్క్‌ నుంచి శివ్‌ విహార్‌ మధ్య 57 కిలోమీటర్లు పొడవునా డ్రైవర్‌ లేని మెట్రో సేవలు మొదలవుతాయని దిల్లీ మెట్రో వెల‌్లడించింది.

ఎన్​సీఎంసీ కూడా..

దీంతో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం పూర్తి స్థాయిలో పనిచేసే నేషనల్​ కామన్​ మొబిలిటీ కార్డు(ఎన్​సీఎంసీ)ను ప్రారంభించారు మోదీ. ఎయిర్​పోర్ట్​ ఎక్స్​ప్రెస్​ లైన్​లో భాగంగా న్యూ దిల్లీ నుంచి ద్వారకా సెక్టార్ ​21 వరకు ఉన్న 23 కి.మీ పరిధిలో ఇది పనిచేస్తుంది.

దిల్లీ మెట్రోలోని పది కారిడార్లలో ఎన్​సీఎంసీ మొదటిసారిగా వినియోగంలోకి రానుంది. 'వన్​ నేషన్​-వన్​ కార్డ్' నినాదంలో భాగంగా దీనిని 2019 మార్చిలో మోదీ ప్రారంభించారు.

కొత్త శకం ఆరంభం..

కొత్త తరం రైళ్లను ప్రారంభించటం ద్వారా దిల్లీ మెట్రో.. 7 శాతం ప్రపంచ మెట్రో నెట్‌వర్క్‌లో చేరనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నూతన ఆవిష్కరణల ద్వారా.. దిల్లీ ప్రజలకు, దేశ రాజధాని ప్రాంతంలోని ఇతర నగర వాసులకు ప్రయాణ సదుపాయాలు, విస్తరణకు సంబంధించి కొత్త శకం ఆరంభం కానుందని దిల్లీ మెట్రో ప్రకటించింది.

దేశంలోనే మొట్టమొదటి డ్రైవర్‌ లేని రైలును ప్రధాని నరేంద్ర మోదీ.. ఇవాళ దిల్లీ మెట్రోలో ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్​ కూడా హాజరయ్యారు.

"తొలి డ్రైవర్​ రహిత మెట్రో రైలు ప్రారంభం కావడం చూస్తే ఆధునికత వినియోగంలో భారత్​ ఎంత వేగం కనబరుస్తోందో తెలుస్తోంది. దేశంలో తొలి మెట్రో రైలు.. వాజ్​పేయీ కృషి వల్ల ప్రారంభమైంది. 2014లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి కేవలం 5 నగరాల్లోనే మెట్రో సేవలు ఉన్నాయి. ఇప్పుడు 18 నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. 2025 నాటికి 25 నగరాల్లో మెట్రో సేవలను విస్తరిస్తాం."

- నరేంద్ర మోదీ, ప్రధాని

ఈ చోదకరహిత రైలును.. మాజెంటా లైన్‌లో జనక్‌పురి నుంచి బొటానికల్ గార్డెన్‌ వరకు 37 కిలోమీటర్ల మేర నడపనున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో మజ్లిస్‌ పార్క్‌ నుంచి శివ్‌ విహార్‌ మధ్య 57 కిలోమీటర్లు పొడవునా డ్రైవర్‌ లేని మెట్రో సేవలు మొదలవుతాయని దిల్లీ మెట్రో వెల‌్లడించింది.

ఎన్​సీఎంసీ కూడా..

దీంతో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం పూర్తి స్థాయిలో పనిచేసే నేషనల్​ కామన్​ మొబిలిటీ కార్డు(ఎన్​సీఎంసీ)ను ప్రారంభించారు మోదీ. ఎయిర్​పోర్ట్​ ఎక్స్​ప్రెస్​ లైన్​లో భాగంగా న్యూ దిల్లీ నుంచి ద్వారకా సెక్టార్ ​21 వరకు ఉన్న 23 కి.మీ పరిధిలో ఇది పనిచేస్తుంది.

దిల్లీ మెట్రోలోని పది కారిడార్లలో ఎన్​సీఎంసీ మొదటిసారిగా వినియోగంలోకి రానుంది. 'వన్​ నేషన్​-వన్​ కార్డ్' నినాదంలో భాగంగా దీనిని 2019 మార్చిలో మోదీ ప్రారంభించారు.

కొత్త శకం ఆరంభం..

కొత్త తరం రైళ్లను ప్రారంభించటం ద్వారా దిల్లీ మెట్రో.. 7 శాతం ప్రపంచ మెట్రో నెట్‌వర్క్‌లో చేరనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నూతన ఆవిష్కరణల ద్వారా.. దిల్లీ ప్రజలకు, దేశ రాజధాని ప్రాంతంలోని ఇతర నగర వాసులకు ప్రయాణ సదుపాయాలు, విస్తరణకు సంబంధించి కొత్త శకం ఆరంభం కానుందని దిల్లీ మెట్రో ప్రకటించింది.

Last Updated : Dec 28, 2020, 12:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.