ETV Bharat / bharat

బ్రిటన్ ప్రధానితో మోదీ నేడు వర్చువల్ భేటీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మధ్య కీలక సమావేశం జరగనుంది. వర్చువల్​గా నిర్వహించే ఈ సమావేశంలో.. ఇరుదేశాల సంబంధాలను బలోపేతం చేసేందుకు పదేళ్ల రోడ్​మ్యాప్​ను విడుదల చేయనున్నారు దేశాధినేతలు.

author img

By

Published : May 4, 2021, 5:27 AM IST

PM Modi to hold virtual summit with Boris Johnson today
బ్రిటన్ ప్రధానితో మోదీ నేడు వర్చువల్ భేటీ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్​తో నేడు సమావేశం కానున్నారు. వర్చువల్​గా జరిగే సదస్సులో వీరిరువురు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. ఇరుదేశాల సంబంధాల బలోపేతం కోసం పదేళ్ల రోడ్​మ్యాప్​ను విడుదల చేయనున్నారు.

బహుముఖ వ్యూహాత్మక సంబంధాలను పెంచేందుకు ఈ సదస్సు ఓ ముఖ్యమైన అవకాశంగా నిలుస్తుందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. పరస్పర అవగాహన ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై సహకారం కోసం ఈ భేటీ ఉపయోగపడుతుందని వెల్లడించింది.

5 అంశాలపై దృష్టి

ఈ భేటీలో దేశాధినేతలు విడుదల చేసే 'రోడ్​మ్యాప్ 2030'తో ఐదు కీలక అంశాల్లో ఇరుదేశాల సహకారం మరింత బలపడుతుందని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ ఐదు రంగాలను.. వాణిజ్యం, రక్షణ-భద్రత, వాతావరణ సమస్యలు, వైద్యం, ప్రజా సంబంధాలుగా వివరించింది.

భారత్, బ్రిటన్ మధ్య 2004 నుంచి వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని విదేశాంగ శాఖ గుర్తు చేసింది. ఈ సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తాజా సదస్సు ఓ ముఖ్యమైన అవకాశమని తెలిపింది. కరోనా కట్టడిలో సహకారంపైనా ఇరువురు దేశాధినేతలు చర్చిస్తారని వెల్లడించింది.

ఇదీ చదవండి: పుదుచ్చేరిలో సీఎం సీటుపై భాజపా కన్ను!

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్​తో నేడు సమావేశం కానున్నారు. వర్చువల్​గా జరిగే సదస్సులో వీరిరువురు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. ఇరుదేశాల సంబంధాల బలోపేతం కోసం పదేళ్ల రోడ్​మ్యాప్​ను విడుదల చేయనున్నారు.

బహుముఖ వ్యూహాత్మక సంబంధాలను పెంచేందుకు ఈ సదస్సు ఓ ముఖ్యమైన అవకాశంగా నిలుస్తుందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. పరస్పర అవగాహన ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై సహకారం కోసం ఈ భేటీ ఉపయోగపడుతుందని వెల్లడించింది.

5 అంశాలపై దృష్టి

ఈ భేటీలో దేశాధినేతలు విడుదల చేసే 'రోడ్​మ్యాప్ 2030'తో ఐదు కీలక అంశాల్లో ఇరుదేశాల సహకారం మరింత బలపడుతుందని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ ఐదు రంగాలను.. వాణిజ్యం, రక్షణ-భద్రత, వాతావరణ సమస్యలు, వైద్యం, ప్రజా సంబంధాలుగా వివరించింది.

భారత్, బ్రిటన్ మధ్య 2004 నుంచి వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని విదేశాంగ శాఖ గుర్తు చేసింది. ఈ సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తాజా సదస్సు ఓ ముఖ్యమైన అవకాశమని తెలిపింది. కరోనా కట్టడిలో సహకారంపైనా ఇరువురు దేశాధినేతలు చర్చిస్తారని వెల్లడించింది.

ఇదీ చదవండి: పుదుచ్చేరిలో సీఎం సీటుపై భాజపా కన్ను!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.