ETV Bharat / bharat

స్పీకర్ వద్దకు కలిసి వెళ్లిన మోదీ, సోనియా- కీలక చర్చలు!

author img

By

Published : Aug 11, 2021, 4:48 PM IST

Updated : Aug 11, 2021, 6:29 PM IST

లోక్​సభ సభాపతి ఓం బిర్లాతో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్​ షా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా విపక్ష నేతలు సమావేశమయ్యారు. భవిష్యత్తులో సమావేశాలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని నేతలను కోరినట్లు ఓం బిర్లా తెలిపారు.

pm modi with om birla, ఓం బిర్లాతో ప్రధాని భేటీ
లోక్​సభ స్పీకర్​తో ప్రధాని, విపక్ష నేతల భేటీ..

లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లాతో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్​ షా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సహా అఖిల పక్ష నేతలు భేటీ అయ్యారు. లోక్​సభ సమావేశాల వాయిదాపై చర్చలు జరిపినట్లు స్పీకర్​ ఓం బిర్లా వెల్లడించారు. భవిష్యత్తులో సమావేశాలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని నేతలను కోరినట్లు ట్విట్టర్​ ద్వారా తెలిపారు.

pm modi with om birla, ఓం బిర్లాతో ప్రధాని భేటీ
భేటీలో ప్రధాని మోదీ, సోనియా గాంధీ
pm modi with om birla, ఓం బిర్లాతో ప్రధాని భేటీ
విపక్ష నేతలతో ప్రధాని మోదీ, అమిత్​ షా భేటీ

బిర్లాతో భేటీలో లోక్​సభలో కాంగ్రెస్​ పక్ష నేత అధిర్​ రంజన్​ చౌదరి, తృణమూల్ కాంగ్రెస్​, శిరోమణి అకాలీ దళ్, వైకాపా, బిజూ జనతాదళ్​ పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు.

pm modi with om birla, ఓం బిర్లాతో ప్రధాని భేటీ
సమావేశంలో ప్రధాని మోదీ, సోనియా గాంధీ, స్పీకర్​, అమిత్​ షా
pm modi with om birla, ఓం బిర్లాతో ప్రధాని భేటీ
హోంమంత్రి అమిత్​ షా, స్పీకర్​ ఓం బిర్లా

పెగసస్‌ హ్యాకింగ్‌ వ్యవహారం సహా పలు అంశాలపై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్న గందరగోళ పరిస్థితుల్లో లోక్​సభ నిరవధికంగా వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 13 వరకు సభ కొనసాగాల్సి ఉన్నా.. ఆందోళనల మధ్య చర్చలకు అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు.

ఇదీ చదవండి : వెంకయ్య తీవ్ర భావోద్వేగం- ఎంపీల తీరుపై ఆవేదన

లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లాతో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్​ షా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సహా అఖిల పక్ష నేతలు భేటీ అయ్యారు. లోక్​సభ సమావేశాల వాయిదాపై చర్చలు జరిపినట్లు స్పీకర్​ ఓం బిర్లా వెల్లడించారు. భవిష్యత్తులో సమావేశాలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని నేతలను కోరినట్లు ట్విట్టర్​ ద్వారా తెలిపారు.

pm modi with om birla, ఓం బిర్లాతో ప్రధాని భేటీ
భేటీలో ప్రధాని మోదీ, సోనియా గాంధీ
pm modi with om birla, ఓం బిర్లాతో ప్రధాని భేటీ
విపక్ష నేతలతో ప్రధాని మోదీ, అమిత్​ షా భేటీ

బిర్లాతో భేటీలో లోక్​సభలో కాంగ్రెస్​ పక్ష నేత అధిర్​ రంజన్​ చౌదరి, తృణమూల్ కాంగ్రెస్​, శిరోమణి అకాలీ దళ్, వైకాపా, బిజూ జనతాదళ్​ పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు.

pm modi with om birla, ఓం బిర్లాతో ప్రధాని భేటీ
సమావేశంలో ప్రధాని మోదీ, సోనియా గాంధీ, స్పీకర్​, అమిత్​ షా
pm modi with om birla, ఓం బిర్లాతో ప్రధాని భేటీ
హోంమంత్రి అమిత్​ షా, స్పీకర్​ ఓం బిర్లా

పెగసస్‌ హ్యాకింగ్‌ వ్యవహారం సహా పలు అంశాలపై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్న గందరగోళ పరిస్థితుల్లో లోక్​సభ నిరవధికంగా వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 13 వరకు సభ కొనసాగాల్సి ఉన్నా.. ఆందోళనల మధ్య చర్చలకు అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు.

ఇదీ చదవండి : వెంకయ్య తీవ్ర భావోద్వేగం- ఎంపీల తీరుపై ఆవేదన

Last Updated : Aug 11, 2021, 6:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.