ETV Bharat / bharat

ఎన్టీపీసీ పవర్​ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ.. రూ.8 వేల కోట్ల పనులు ప్రారంభం

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 3, 2023, 4:59 PM IST

PM Modi Dedicated NTPC Power Project to Nation in Nizamabad : పెద్దపల్లి జిల్లాలోని సూపర్​ థర్మల్​ పవర్​ ప్లాంటును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. నిజామాబాద్​లో నిర్వహించిన బీజేపీ ఇందూరు ప్రజాగర్జన బహిరంగ సభ వేదిక నుంచి ఈ పవర్​ ప్రాజెక్టు తొలి యూనిట్​ను ప్రారంభించారు. అనంతరం సభావేదిక పైనుంచే పలు అభివృద్ధి పనులను ప్రధాని ప్రారంభించారు. రూ.8 వేల కోట్ల విలువైన పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. అలాగే మనోహరాబాద్​-సిద్దిపేట రైల్వే లైన్​ను సైతం లాంఛనంగా ప్రారంభించారు.

PM Modi Dedicated NTPC Power Project
PM Modi Dedicated NTPC Power Project to Nation

PM Modi Dedicated NTPC Power Project to Nation in Nizamabad : పెద్దపల్లి జిల్లాలోని సూపర్​ థర్మల్​ పవర్​ ప్లాంటు(NTPC Power Plant)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. నిజామాబాద్​లో నిర్వహించిన బీజేపీ ఇందూరు ప్రజాగర్జన బహిరంగ సభ(BJP Public Meeting in Nizamabad) వేదిక నుంచి ఈ పవర్​ ప్రాజెక్టు తొలి యూనిట్​ను ప్రారంభించారు. అనంతరం సభావేదిక పైనుంచే పలు అభివృద్ధి పనులను ప్రధాని ప్రారంభించారు. రూ.8 వేల కోట్ల విలువైన పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. అలాగే మనోహరాబాద్​-సిద్దిపేట రైల్వే లైన్​ను సైతం లాంఛనంగా ప్రారంభించారు. ఆ తర్వాత పీఎం మోదీ సభను ఉద్దేశించి ప్రసంగించారు.

నా కుటుంబ సభ్యులారా అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ప్రారంభించారు. పెద్దపల్లిలో అత్యాధునిక సూపర్​ పవర్​ థర్మల్​ విద్యుత్​ కేంద్రం అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. ఈ థర్మల్​ పవర్​ ప్రాజెక్టు తొలి యూనిట్​ను ప్రారంభించుకున్నామని తెలిపారు. 2016లో శంకుస్థాపన చేసి.. ఇప్పుడు ఇంత త్వరగా ప్రారంభించుకున్నామని.. ఇదీ తమ ప్రభుత్వ పని సంస్కృతి అని వ్యాఖ్యానించారు. అలాగే త్వరలోనే రెండో యూనిట్​ను సైతం అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వివరించారు.

'రాష్ట్రానికి గిరిజన విశ్వవిద్యాలయం, పసుపు బోర్డు' ప్రకటించిన ప్రధాని

PM Modi Public Meeting in Nizamabad : ఎన్టీపీసీతో రాష్ట్ర ప్రజలకు 4 వేల మెగావాట్లు విద్యుత్​ అందుబాటులోకి వస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ధర్మాబాద్​-మనోహరాబాద్​-మహబూబ్​నగర్​-కర్నూలు లైను విద్యుద్దీకరణ పూర్తి చేసుకున్నామని వెల్లడించారు. తెలంగాణ ప్రజల కోసమే బీబీనగర్​లో ఎయిమ్స్​ నిర్మిస్తున్నామని వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన వైద్య పథకం ఆయుష్మాన్​ భారత్​ అమలు చేస్తున్నామన్నారు. ఈ ప్రారంభోత్సవానికి గవర్నర్​ తమిళిసై, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్​ రెడ్డి, నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి, డీకే అరుణ, అర్వింద్​, బండి సంజయ్​, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

PM Modi Tour in Nizamabad Today : బీజేపీ నిజామాబాద్​లో నిర్వహిస్తున్న ఇందూరు ప్రజాగర్జన బహిరంగ సభకు భారీగా ప్రజలు, పసుపు రైతులు తరలివచ్చారు. సభావేదిక వద్ద రైతుల కోసం ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. మోదీకి 600 మంది మహిళలు స్వాగతం పలకనున్నారు. అంతకు ముందు డీకే అరుణ, కిషన్​ రెడ్డి, ధర్మపురి అర్వింద్​ మాట్లాడారు. కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ పార్టీలపై విమర్శలు చేశారు.

PM Modi Palamuru Praja Garjana Public Meeting : 'తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. రాబోయేది చెప్పింది చేసే ప్రభుత్వం'

PM Modi Mahabubnagar District Tour : మహబూబ్‌నగర్‌లో ప్రధాని మోదీ పర్యటన.. రూ.13,500 కోట్ల విలువైన పనులకు శ్రీకారం

PM Modi Dedicated NTPC Power Project to Nation in Nizamabad : పెద్దపల్లి జిల్లాలోని సూపర్​ థర్మల్​ పవర్​ ప్లాంటు(NTPC Power Plant)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. నిజామాబాద్​లో నిర్వహించిన బీజేపీ ఇందూరు ప్రజాగర్జన బహిరంగ సభ(BJP Public Meeting in Nizamabad) వేదిక నుంచి ఈ పవర్​ ప్రాజెక్టు తొలి యూనిట్​ను ప్రారంభించారు. అనంతరం సభావేదిక పైనుంచే పలు అభివృద్ధి పనులను ప్రధాని ప్రారంభించారు. రూ.8 వేల కోట్ల విలువైన పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. అలాగే మనోహరాబాద్​-సిద్దిపేట రైల్వే లైన్​ను సైతం లాంఛనంగా ప్రారంభించారు. ఆ తర్వాత పీఎం మోదీ సభను ఉద్దేశించి ప్రసంగించారు.

నా కుటుంబ సభ్యులారా అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ప్రారంభించారు. పెద్దపల్లిలో అత్యాధునిక సూపర్​ పవర్​ థర్మల్​ విద్యుత్​ కేంద్రం అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. ఈ థర్మల్​ పవర్​ ప్రాజెక్టు తొలి యూనిట్​ను ప్రారంభించుకున్నామని తెలిపారు. 2016లో శంకుస్థాపన చేసి.. ఇప్పుడు ఇంత త్వరగా ప్రారంభించుకున్నామని.. ఇదీ తమ ప్రభుత్వ పని సంస్కృతి అని వ్యాఖ్యానించారు. అలాగే త్వరలోనే రెండో యూనిట్​ను సైతం అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వివరించారు.

'రాష్ట్రానికి గిరిజన విశ్వవిద్యాలయం, పసుపు బోర్డు' ప్రకటించిన ప్రధాని

PM Modi Public Meeting in Nizamabad : ఎన్టీపీసీతో రాష్ట్ర ప్రజలకు 4 వేల మెగావాట్లు విద్యుత్​ అందుబాటులోకి వస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ధర్మాబాద్​-మనోహరాబాద్​-మహబూబ్​నగర్​-కర్నూలు లైను విద్యుద్దీకరణ పూర్తి చేసుకున్నామని వెల్లడించారు. తెలంగాణ ప్రజల కోసమే బీబీనగర్​లో ఎయిమ్స్​ నిర్మిస్తున్నామని వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన వైద్య పథకం ఆయుష్మాన్​ భారత్​ అమలు చేస్తున్నామన్నారు. ఈ ప్రారంభోత్సవానికి గవర్నర్​ తమిళిసై, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్​ రెడ్డి, నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి, డీకే అరుణ, అర్వింద్​, బండి సంజయ్​, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

PM Modi Tour in Nizamabad Today : బీజేపీ నిజామాబాద్​లో నిర్వహిస్తున్న ఇందూరు ప్రజాగర్జన బహిరంగ సభకు భారీగా ప్రజలు, పసుపు రైతులు తరలివచ్చారు. సభావేదిక వద్ద రైతుల కోసం ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. మోదీకి 600 మంది మహిళలు స్వాగతం పలకనున్నారు. అంతకు ముందు డీకే అరుణ, కిషన్​ రెడ్డి, ధర్మపురి అర్వింద్​ మాట్లాడారు. కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ పార్టీలపై విమర్శలు చేశారు.

PM Modi Palamuru Praja Garjana Public Meeting : 'తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. రాబోయేది చెప్పింది చేసే ప్రభుత్వం'

PM Modi Mahabubnagar District Tour : మహబూబ్‌నగర్‌లో ప్రధాని మోదీ పర్యటన.. రూ.13,500 కోట్ల విలువైన పనులకు శ్రీకారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.