ETV Bharat / bharat

పర్యావరణ హితానికి ప్రధాని మోదీ 'ఆర్​ఆర్​ఆర్'​ మంత్రం

modi news: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా చేపట్టిన 'లైఫ్​స్టైల్​ ఫర్​ ఎన్విరాన్​మెంట్​ మూవ్​మెంట్' కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలని మోదీ పిలుపునిచ్చారు. పర్యావరణ హితం కోసం ఆర్​ఆర్​ఆర్​ మంత్రాన్ని సూచించారు మోదీ.

author img

By

Published : Jun 5, 2022, 7:40 PM IST

Updated : Jun 5, 2022, 8:31 PM IST

modi news
modi news

modi news: భూమికి హాని కలిగించకుండా దానికి అనుగుణంగా మన జీవనశైలిని మార్చుకోవాలన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పర్యావరణ హితం కోసం భారత్​ ఎంతో కృషి చేస్తుందని చెప్పారు. అడవుల విస్తీర్ణాన్ని పెంచడం వల్ల సింహాలు, పులులు, ఏనుగుల సంఖ్య పెరుగుతుందన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 'లైఫ్​స్టైల్​ ఫర్​ ఎన్విరాన్​మెంట్​(లైఫ్​) మూవ్​మెంట్' కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్​గా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలని మోదీ పిలుపునిచ్చారు.

" రెడ్యూస్​, రీయూజ్​, రీసైకిల్​ విధానాలను మన జీవితంలో భాగం చేసుకోవాలి. జీరో కార్బన్​ జీవన విధానాన్ని అలవర్చుకోవాలని మహాత్మ గాంధీ పిలుపునిచ్చారు. మనకు భూమి ఒకటే ఉంది. కానీ మనం చేయడానికి అనేక ప్రయత్నాలు ఉన్నాయి"

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మైక్రోసాఫ్ట్​ అధినేత బిల్​గేట్స్​ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందించారు. ప్రపంచం వాతావరణ లక్ష్యాలను సాధించడానికి భారత్​ నాయకత్వం వహిస్తుందన్నారు. గ్రీన్​హౌజ్​ గ్యాసెస్​ను నిర్మూలించడానికి ప్రభుత్వ, ప్రైవేట్​ రంగాలు పరస్పరం సహకరించుకోవాలని తెలిపారు. శిలాజేతర ఇంధన వనరుల నుంచి 40 శాతం విద్యుత్​ సామర్థాన్ని స్థాపించాలనేది తమ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పెట్రోల్​లో ఇథనాల్​ కలపడాన్ని పది శాతానికి పెంచామని చెప్పారు. 2013-14లో 1.5 శాతం ఉండగా.. 2019-20లో 5 శాతానికి చేరుకుందని వెల్లడించారు.

ఇదీ చదవండి: 'భాజపావి నీచ రాజకీయాలు.. కశ్మీరీ పండిట్లకు రక్షణేదీ?'

modi news: భూమికి హాని కలిగించకుండా దానికి అనుగుణంగా మన జీవనశైలిని మార్చుకోవాలన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పర్యావరణ హితం కోసం భారత్​ ఎంతో కృషి చేస్తుందని చెప్పారు. అడవుల విస్తీర్ణాన్ని పెంచడం వల్ల సింహాలు, పులులు, ఏనుగుల సంఖ్య పెరుగుతుందన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 'లైఫ్​స్టైల్​ ఫర్​ ఎన్విరాన్​మెంట్​(లైఫ్​) మూవ్​మెంట్' కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్​గా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలని మోదీ పిలుపునిచ్చారు.

" రెడ్యూస్​, రీయూజ్​, రీసైకిల్​ విధానాలను మన జీవితంలో భాగం చేసుకోవాలి. జీరో కార్బన్​ జీవన విధానాన్ని అలవర్చుకోవాలని మహాత్మ గాంధీ పిలుపునిచ్చారు. మనకు భూమి ఒకటే ఉంది. కానీ మనం చేయడానికి అనేక ప్రయత్నాలు ఉన్నాయి"

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మైక్రోసాఫ్ట్​ అధినేత బిల్​గేట్స్​ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందించారు. ప్రపంచం వాతావరణ లక్ష్యాలను సాధించడానికి భారత్​ నాయకత్వం వహిస్తుందన్నారు. గ్రీన్​హౌజ్​ గ్యాసెస్​ను నిర్మూలించడానికి ప్రభుత్వ, ప్రైవేట్​ రంగాలు పరస్పరం సహకరించుకోవాలని తెలిపారు. శిలాజేతర ఇంధన వనరుల నుంచి 40 శాతం విద్యుత్​ సామర్థాన్ని స్థాపించాలనేది తమ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పెట్రోల్​లో ఇథనాల్​ కలపడాన్ని పది శాతానికి పెంచామని చెప్పారు. 2013-14లో 1.5 శాతం ఉండగా.. 2019-20లో 5 శాతానికి చేరుకుందని వెల్లడించారు.

ఇదీ చదవండి: 'భాజపావి నీచ రాజకీయాలు.. కశ్మీరీ పండిట్లకు రక్షణేదీ?'

Last Updated : Jun 5, 2022, 8:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.