ప్రధాని నరేంద్ర మోదీ దైవ స్వరూపమని వ్యాఖ్యానించారు అరుణచల్ ప్రదేశ్ ఎంపీ తాపిర్ గావో. దేశాన్ని సరైన మార్గంలో నడిపిస్తున్న భగవంతుడి అవతారమని పేర్కొన్నారు. బంగాల్, అసోం రాష్ట్రాల్లోని తేయా కార్మికుల కోసం అహర్నిశలు పని చేస్తున్న మోదీ.. 'భగవాన్, అల్లా'తో సమానమని అభివర్ణించారు తాపిర్. జమ్ముకశ్మీర్కు నిధుల కోసం అనుబంధ డిమాండ్లపై లోక్సభలో జరిగిన చర్చలో ఈ వ్యాఖ్యలు చేశారు..
"ఆయన (ప్రధాని) మానవుడు కాదు. ప్రధానిగా మారి దేశాన్ని సరైన దిశలో నిడిపిస్తున్న భగవంతుడి అవతారం. భారతీయులుగా మనం గర్వపడాలి. అసోం, బంగాల్లోని తేయాకు తోటల కార్మికుల సమస్యలను తరిమికొట్టే పని మోదీజీ చేశారు. ఇది భగవంతుని (భగవాన్, అల్లా) అవతారం ద్వారా చేసిన పనే."
- తాపిర్ గావో, అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ
అరుణాచల్ సహా ఈశాన్య రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలను కొనియాడారు తాపిర్. అసోం, బంగాల్ తేయాకు తోటల కార్మికుల సంక్షేమం కోసం 2021-22 బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించడాన్ని ప్రస్తావించిన గావో.. వారి జీవితాల్లో ప్రధాని ఆశలు రేకెత్తించారని పేర్కొన్నారు.
మోదీ.. యుగ పురుషుడు
భాజపా సిద్ధాంతకర్త శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కలలని సాకారం చేశారని ప్రధానిని ప్రశసించారు ఆ పార్టీ నేత జమ్యాంగ్ త్సేరింగ్ నాంగ్యాల్. మోదీని యుగపురుషుడిగా అభివర్ణించారు. కొవిడ్-19 వేళ మోదీ సర్కారు పలు చర్యలు తీసుకుందన్నారు. భారత్ నేడు 100 దేశాలకు కరోనా టీకాలు సరఫరా చేస్తోందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'రాముడితో సమానంగా మోదీని చూస్తారు'