ETV Bharat / bharat

'పెగాసస్​తో రాజద్రోహానికి పాల్పడ్డ ప్రభుత్వం'

author img

By

Published : Jul 23, 2021, 11:39 AM IST

Updated : Jul 23, 2021, 1:42 PM IST

భారత్​కు వ్యతిరేకంగా కుట్రకు పాల్పడేందుకు ప్రభుత్వం .. పెగాసస్​ స్పైవేర్​ను ఆయుధంగా ఉపయోగించిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. సుప్రీంకోర్టు సహా అన్ని సంస్థలకు వ్యతిరేకంగా పెగాసస్​ను వినియోగించిందని విమర్శించారు. మరోవైపు.. రాహుల్​ వ్యాఖ్యలను భాజపా ఖండించింది. మోదీ ప్రభుత్వం ఏ ఒక్కరి ఫోన్లను కూడా అక్రమంగా ట్యాప్ చేయలేదని స్పష్టం చేసింది.

rahul gandhi
రాహుల్ గాంధీ

పెగాసస్​ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ శుక్రవారం తీవ్ర విమర్శలు చేశారు. దేశానికి, ఇక్కడి సంస్థలకు వ్యతిరేకంగా కుట్రలకు పాల్పడేందుకు పెగాసస్​ను ఆయుధంగా ప్రభుత్వం వినియోగించిందని ఆరోపించారు. దీనిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని డిమాండ్​ చేశారు. దీనికి బాధ్యత వహిస్తూ.. కేంద్ర హోం మంత్రి రాజీనామా చేయాలన్నారు. దిల్లీలో విజయ్​ చౌక్​ వద్ద విలేకరులతో రాహుల్​ మాట్లాడారు.

"ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పెగాసస్​ను ఇజ్రాయెల్​ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్​ షా దాన్ని.. భారత్​కు, ఇక్కడి సంస్థలకు వ్యతిరేక ఆయుధంగా వాడుకున్నారు. రాజకీయాల కోసం దీన్ని వారు ఉపయోగించారు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూలదోశారు. సుప్రీంకోర్టు సహా అన్ని సంస్థలకు వ్యతిరేకంగా వారు దీన్ని ఉపయోగించారు.

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అగ్రనేత

తన ఫోన్లు అన్నింటీని ప్రభుత్వం ట్యాప్​​ చేసిందని రాహుల్​ ఆరోపించారు. పెగాసస్​పై ప్రభుత్వ చర్యలను రాజద్రోహం కంటే మరో పదంతో పోల్చలేమని​ విమర్శించారు.

'అదే నిజమైతే.. ఫోన్లు అప్పగించాలి'

తన ఫోన్లను ప్రభుత్వం ట్యాప్​ చేసిందని రాహుల్​ చేసిన వ్యాఖ్యలపై భాజపా ఘాటుగా స్పందించింది. తన ఫోన్లు ట్యాప్​ చేశారని రాహుల్​ నమ్మతే.. వాటిని దర్యాప్తు కోసం సమర్పించాలని సవాలు విసిరింది. మోదీ ప్రభుత్వం ఎవరి ఫోన్లనూ అక్రమంగా ట్యాప్​ చేయలేదని స్పష్టం చేసింది భాజపా.

"2014, 2019 లోక్​సభ ఎన్నికల్లో ప్రజలు రెండు సార్లు కాంగ్రెస్​ను తిరస్కరించారు. దాంతో ఆ పార్టీ ఏదో రకంగా పార్లమెంటును స్తంభింపజేయాలని చూస్తోంది. అందుకు ఈ పెగాసస్​ను సాకుగా ఎంచుకుంది. రాహుల్ గాంధీ తన ఫోన్లను విచారణ నిమిత్తం అప్పగిస్తే.. ఐపీసీ ప్రకారం దర్యాప్తు జరుగుతుంది."

-రాజ్యవర్థన్​ రాథోడ్​, భాజపా అధికార ప్రతినిధి

దేశ అభివృద్ధిని కాంగ్రెస్​ ఎంత మాత్రం సహించలేకపోతోందని రాజ్యవర్థన్ విమర్శించారు. అందుకే.. పార్లమెంటు కార్యకలాపాలకు తరచూ ఆటంకం కలిగించాలని చూస్తోందని ఆరోపించారు.

ఇదీ చూడండి: 'వాటర్​గేట్​ కుంభకోణం కంటే పెగాసస్​ దారుణం'

ఇదీ చూడండి: పెగాసస్​పై ఆగని రగడ- టీఎంసీ ఎంపీ తీరుపై దుమారం

పెగాసస్​ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ శుక్రవారం తీవ్ర విమర్శలు చేశారు. దేశానికి, ఇక్కడి సంస్థలకు వ్యతిరేకంగా కుట్రలకు పాల్పడేందుకు పెగాసస్​ను ఆయుధంగా ప్రభుత్వం వినియోగించిందని ఆరోపించారు. దీనిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని డిమాండ్​ చేశారు. దీనికి బాధ్యత వహిస్తూ.. కేంద్ర హోం మంత్రి రాజీనామా చేయాలన్నారు. దిల్లీలో విజయ్​ చౌక్​ వద్ద విలేకరులతో రాహుల్​ మాట్లాడారు.

"ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పెగాసస్​ను ఇజ్రాయెల్​ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్​ షా దాన్ని.. భారత్​కు, ఇక్కడి సంస్థలకు వ్యతిరేక ఆయుధంగా వాడుకున్నారు. రాజకీయాల కోసం దీన్ని వారు ఉపయోగించారు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూలదోశారు. సుప్రీంకోర్టు సహా అన్ని సంస్థలకు వ్యతిరేకంగా వారు దీన్ని ఉపయోగించారు.

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అగ్రనేత

తన ఫోన్లు అన్నింటీని ప్రభుత్వం ట్యాప్​​ చేసిందని రాహుల్​ ఆరోపించారు. పెగాసస్​పై ప్రభుత్వ చర్యలను రాజద్రోహం కంటే మరో పదంతో పోల్చలేమని​ విమర్శించారు.

'అదే నిజమైతే.. ఫోన్లు అప్పగించాలి'

తన ఫోన్లను ప్రభుత్వం ట్యాప్​ చేసిందని రాహుల్​ చేసిన వ్యాఖ్యలపై భాజపా ఘాటుగా స్పందించింది. తన ఫోన్లు ట్యాప్​ చేశారని రాహుల్​ నమ్మతే.. వాటిని దర్యాప్తు కోసం సమర్పించాలని సవాలు విసిరింది. మోదీ ప్రభుత్వం ఎవరి ఫోన్లనూ అక్రమంగా ట్యాప్​ చేయలేదని స్పష్టం చేసింది భాజపా.

"2014, 2019 లోక్​సభ ఎన్నికల్లో ప్రజలు రెండు సార్లు కాంగ్రెస్​ను తిరస్కరించారు. దాంతో ఆ పార్టీ ఏదో రకంగా పార్లమెంటును స్తంభింపజేయాలని చూస్తోంది. అందుకు ఈ పెగాసస్​ను సాకుగా ఎంచుకుంది. రాహుల్ గాంధీ తన ఫోన్లను విచారణ నిమిత్తం అప్పగిస్తే.. ఐపీసీ ప్రకారం దర్యాప్తు జరుగుతుంది."

-రాజ్యవర్థన్​ రాథోడ్​, భాజపా అధికార ప్రతినిధి

దేశ అభివృద్ధిని కాంగ్రెస్​ ఎంత మాత్రం సహించలేకపోతోందని రాజ్యవర్థన్ విమర్శించారు. అందుకే.. పార్లమెంటు కార్యకలాపాలకు తరచూ ఆటంకం కలిగించాలని చూస్తోందని ఆరోపించారు.

ఇదీ చూడండి: 'వాటర్​గేట్​ కుంభకోణం కంటే పెగాసస్​ దారుణం'

ఇదీ చూడండి: పెగాసస్​పై ఆగని రగడ- టీఎంసీ ఎంపీ తీరుపై దుమారం

Last Updated : Jul 23, 2021, 1:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.