ETV Bharat / bharat

'బంగాల్​​లో భాజపా సెంచరీ.. మమత క్లీన్ బౌల్డ్'

author img

By

Published : Apr 12, 2021, 12:50 PM IST

Updated : Apr 12, 2021, 1:11 PM IST

బంగాల్​ ఎన్నికల సంగ్రామంలో భాజపా ఇప్పటికే సెంచరీ కొట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బంగాల్​ ప్రజలు.. ఓట్ల రూపంలో తమకు ఫోర్లు, సిక్సులు ఇచ్చారన్నారు. నందిగ్రామ్​లో మమత క్లీన్​ బౌల్డ్​ అయ్యారని ఎద్దేవా చేశారు.

People of Bengal hit so many fours and sixes that BJP   has completed century in 4 phases of assembly polls
'బంగాల్​ దంగల్​లో భాజపా సెంచరీ.. మమత క్లీన్ బౌల్డ్'

బంగాల్ ఎన్నికల్లో ఇప్పటికే భాజపా సెంచరీ సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజలు ఓట్ల రూపంలో.. తమకు ఫోర్లు, సిక్సులు ఇచ్చారని తెలిపారు. నందిగ్రామ్​లో మమత క్లీన్ బౌల్డ్​ అయ్యారని ఎద్దేవా చేశారు.

బంగాల్​లోని బర్ధమాన్​లో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. గ్రౌండ్​ నుంచి నిష్క్రమించాలని బంగాల్​ ప్రజలు.. మమతకు సూచించారని, బంగాల్​లో లెఫ్ట్​ కూటమికి పట్టిన గతే.. తృణమూల్ కాంగ్రెస్ పడుతుందని ఆరోపించారు.

'దీదీ నినాదానికి అదే అర్థం'

మమతకు సన్నిహితంగా ఉండే ఓ నేత.. ఎస్సీ వర్గాన్ని భిక్షమెత్తేవారుగా అభివర్ణించటంపై మోదీ మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలతో అంబేడ్కర్​ను అవమానించినట్లేనన్నారు. దళితులను అవమానించి.. మమత అతి పెద్ద తప్పు చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా మమత నినాదం.. మా, మాటీ, మనుష్​ కు అర్థం చెప్పే ప్రయత్నం చేశారు మోదీ. వేధించే దీదీ (మా), (మాటీ) బంగాల్​ను దోచుకోవటం, ప్రజల్ని హింసించటం (మనుష్) గా అభివర్ణించారు.

ఇదీ చదవండి : 'సాగు చట్టాలపై చర్చలకు సిద్ధమే.. కానీ'

బంగాల్ ఎన్నికల్లో ఇప్పటికే భాజపా సెంచరీ సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజలు ఓట్ల రూపంలో.. తమకు ఫోర్లు, సిక్సులు ఇచ్చారని తెలిపారు. నందిగ్రామ్​లో మమత క్లీన్ బౌల్డ్​ అయ్యారని ఎద్దేవా చేశారు.

బంగాల్​లోని బర్ధమాన్​లో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. గ్రౌండ్​ నుంచి నిష్క్రమించాలని బంగాల్​ ప్రజలు.. మమతకు సూచించారని, బంగాల్​లో లెఫ్ట్​ కూటమికి పట్టిన గతే.. తృణమూల్ కాంగ్రెస్ పడుతుందని ఆరోపించారు.

'దీదీ నినాదానికి అదే అర్థం'

మమతకు సన్నిహితంగా ఉండే ఓ నేత.. ఎస్సీ వర్గాన్ని భిక్షమెత్తేవారుగా అభివర్ణించటంపై మోదీ మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలతో అంబేడ్కర్​ను అవమానించినట్లేనన్నారు. దళితులను అవమానించి.. మమత అతి పెద్ద తప్పు చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా మమత నినాదం.. మా, మాటీ, మనుష్​ కు అర్థం చెప్పే ప్రయత్నం చేశారు మోదీ. వేధించే దీదీ (మా), (మాటీ) బంగాల్​ను దోచుకోవటం, ప్రజల్ని హింసించటం (మనుష్) గా అభివర్ణించారు.

ఇదీ చదవండి : 'సాగు చట్టాలపై చర్చలకు సిద్ధమే.. కానీ'

Last Updated : Apr 12, 2021, 1:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.