ETV Bharat / bharat

స్ట్రెచర్ లేక భుజాలపై తీసుకెళ్లినా దక్కని ప్రాణం

author img

By

Published : May 11, 2021, 9:14 PM IST

Updated : May 11, 2021, 11:03 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ గోరఖ్​పుర్​లోని ఓ ఆస్పత్రిలో విషాద ఘటన జరిగింది. కరోనా సోకిన అన్నను స్ట్రెచర్​ లేక భుజాలపైనే ఆస్పత్రిలోకి తీసుకెళ్లాడు తమ్ముడు. అయినా ఆలస్యం కావడం వల్ల అతడు మరణించాడు. సీఎం యోగి ఆదిత్యనాథ్ అదే ఆస్పత్రిలో సమావేశం నిర్వహిస్తుండగానే జరిగిన ఈ ఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యాయి.

స్ట్రెచర్ లేక భుజాలపైనే

స్ట్రెచర్ లేక భుజాలపై తీసుకెళ్లినా దక్కని ప్రాణం

ఉత్తర్​ప్రదేశ్ గోరఖ్​పుర్ బీఆర్​డీ వైద్యకళాశాల ఆస్పత్రిలో ఓ కొవిడ్​ రోగి ప్రాణాలు కోల్పోయిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. కరోనా సోకి ఆరోగ్యం విషమించిన ఓ వ్యక్తిని అతని సోదరుడు భుజాలపైనే ఆస్పత్రిలోకి తీసుకెళ్లాడు. అయినా అతడ్ని అడ్మిట్ చేసుకోలేదు సిబ్బంది. ఫలితంగా కరోనా రోగి ప్రాణాలు కోల్పోయాడు.

patient-died-due-to-failure-to-get-stretcher-in-brd-medical-college-in-gorakhpur
స్ట్రెచర్ లేక భుజాలపై తీసుకెళ్లినా దక్కని ప్రాణం
patient-died-due-to-failure-to-get-stretcher-in-brd-medical-college-in-gorakhpur
స్ట్రెచర్ లేక భుజాలపై తీసుకెళ్లినా దక్కని ప్రాణం

సీఎం యోగి ఆదిత్యనాథ్​ ఇదే ఆస్పత్రిలో కరోనా పరిస్థితిపై సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. సీఎం ప్రోటోకాల్​ అమల్లో ఉన్నందున రోగి కుటుంట సభ్యులను కూడా ఆస్పత్రిలోకి అనుమతించలేదు. అంబులెన్స్​ను కొవిడ్ వార్డు వరకు తీసుకెళ్లమని వారు కోరినా.. డ్రైవర్ అందుకు నిరాకరించాడు. స్ట్రెచర్​ కోసం ప్రయత్నించినా అందుబాటులో లేదు. దీంతో భుజాలపైనే రోగిన తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఆలస్యం కావడం వల్ల అతడు తమ్ముడి చేతుల్లోనే తుది శ్వాస విడిచాడు.

అయితే ఆస్పత్రి సిబ్బంది మాత్రం ఇందులో తమ తప్పు లేదని చెప్పారు. స్ట్రెచర్​ ఆస్పత్రి లోపల అందుబాటులో ఉంటుంది గానీ రోడ్డుపై ఉండదని నిర్లక్షంగా సమాధానం చెప్పారు.

మరణించిన వ్యక్తి పేరు రాంబదన్​ కాగా.. అతడి సోదరుడి పేరు విష్ణు. ముంబయిలో పెయింటర్​గా పనిచేసే రాంబదన్ మూడు రోజుల క్రితమే సొంతూరుకి వచ్చాడు. కరోనా సోకి ఊపిరాడక పోవడం వల్ల కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించే క్రమంలో ఇలా జరిగింది.

స్ట్రెచర్ లేక భుజాలపై తీసుకెళ్లినా దక్కని ప్రాణం

ఉత్తర్​ప్రదేశ్ గోరఖ్​పుర్ బీఆర్​డీ వైద్యకళాశాల ఆస్పత్రిలో ఓ కొవిడ్​ రోగి ప్రాణాలు కోల్పోయిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. కరోనా సోకి ఆరోగ్యం విషమించిన ఓ వ్యక్తిని అతని సోదరుడు భుజాలపైనే ఆస్పత్రిలోకి తీసుకెళ్లాడు. అయినా అతడ్ని అడ్మిట్ చేసుకోలేదు సిబ్బంది. ఫలితంగా కరోనా రోగి ప్రాణాలు కోల్పోయాడు.

patient-died-due-to-failure-to-get-stretcher-in-brd-medical-college-in-gorakhpur
స్ట్రెచర్ లేక భుజాలపై తీసుకెళ్లినా దక్కని ప్రాణం
patient-died-due-to-failure-to-get-stretcher-in-brd-medical-college-in-gorakhpur
స్ట్రెచర్ లేక భుజాలపై తీసుకెళ్లినా దక్కని ప్రాణం

సీఎం యోగి ఆదిత్యనాథ్​ ఇదే ఆస్పత్రిలో కరోనా పరిస్థితిపై సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. సీఎం ప్రోటోకాల్​ అమల్లో ఉన్నందున రోగి కుటుంట సభ్యులను కూడా ఆస్పత్రిలోకి అనుమతించలేదు. అంబులెన్స్​ను కొవిడ్ వార్డు వరకు తీసుకెళ్లమని వారు కోరినా.. డ్రైవర్ అందుకు నిరాకరించాడు. స్ట్రెచర్​ కోసం ప్రయత్నించినా అందుబాటులో లేదు. దీంతో భుజాలపైనే రోగిన తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఆలస్యం కావడం వల్ల అతడు తమ్ముడి చేతుల్లోనే తుది శ్వాస విడిచాడు.

అయితే ఆస్పత్రి సిబ్బంది మాత్రం ఇందులో తమ తప్పు లేదని చెప్పారు. స్ట్రెచర్​ ఆస్పత్రి లోపల అందుబాటులో ఉంటుంది గానీ రోడ్డుపై ఉండదని నిర్లక్షంగా సమాధానం చెప్పారు.

మరణించిన వ్యక్తి పేరు రాంబదన్​ కాగా.. అతడి సోదరుడి పేరు విష్ణు. ముంబయిలో పెయింటర్​గా పనిచేసే రాంబదన్ మూడు రోజుల క్రితమే సొంతూరుకి వచ్చాడు. కరోనా సోకి ఊపిరాడక పోవడం వల్ల కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించే క్రమంలో ఇలా జరిగింది.

Last Updated : May 11, 2021, 11:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.