ETV Bharat / bharat

రాజ్యసభ నుంచి విపక్ష ఎంపీల వాకౌట్​

author img

By

Published : Dec 14, 2021, 10:55 AM IST

Updated : Dec 14, 2021, 2:29 PM IST

PARLIAMENT LIVE
PARLIAMENT LIVE

14:27 December 14

విపక్ష నేతల వాకౌట్​..

రాజ్యసభ తిరిగి ప్రారంభమైనప్పటికీ.. విపక్ష నేతల నిరసనలు కొనసాగాయి. ఎంపీల సస్పెన్షన్​ను రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. కానీ పరిస్థితి మారకపోవడం వల్ల తమ అసహనాన్ని వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్​ చేశారు.

13:11 December 14

రాహుల్​ ఫైర్​...

పార్లమెంట్​ ఆవరణంలో విపక్షాలు చేస్తున్న నిరసనల్లో పాల్గొన్న రాహుల్​ గాంధీ.. కేంద్రం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.

"దేశంలో ప్రజా గొంతుకను నొక్కేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని చెప్పడానికి ఎంపీల సస్పెన్షన్​ నిదర్శనం. ఎంపీల గొంతును నొక్కేస్తున్నారు. వారు ఎలాంటి తప్పు చేయలేదు. ముఖ్యమైన అంశాలను పార్లమెంట్​లో చర్చించేందుకు మాకు అనుమతినివ్వడం లేదు. పార్లమెంట్​లో చర్చలు లేకుండానే బిల్లుల మీద బిల్లులు ఆమోదం పొందుతున్నాయి. పార్లమెంట్​ను నడిపే విధానం ఇది కాదు. ప్రధాని సభకు రావడం లేదు. జాతీయస్థాయిలో ముఖ్యమైన విషయాలను ప్రస్తావించేందుకు మాకు అవకాశం లభించడం లేదు. ప్రజాస్వామ్యాన్ని హత్యచేస్తున్నారు." -- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ సీనియర్​ నేత.

13:08 December 14

ఎంపీల ఆందోళన..

12మంది ఎంపీల సస్పెన్షన్​పై విపక్షాల నిరసన పార్లమెంట్​ దాటింది. ఆందోళనలో భాగంగా.. విపక్ష ఎంపీలు.. దిల్లీలోని పార్లమెంట్​ నుంచి విజయ్​ చౌక్​ వరకు మార్చ్​ నిర్వహించారు. ఎంపీల సస్పెన్షన్​ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.

12:46 December 14

రాజ్యసభలో 12మంది విపక్ష సభ్యులపై సస్పెన్షన్​ను నిరసిస్తూ పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ప్రతిపక్ష నేతలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు.

11:57 December 14

రాజ్యసభలో నిరసనలు..

12మంది ఎంపీల సస్పెన్షన్​పై రాజ్యసభలో విపక్షాలు నిరసనలు కొనసాగుతున్నాయి. దీనిపై ఉపరాష్ట్రపతి, సభ ఛైర్మన్​ వెంకయ్య నాయుడు అసహనం వ్యక్తం చేశారు. వెల్​ ముందుకు వచ్చి నిరసనలు తెలుపుతున్న విపక్షాల తీరును తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. అయినప్పటికీ ఎంపీలు మాట వినకపోవడం వల్ల సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.

10:48 December 14

పార్లమెంట్ లైవ్

  • #WATCH | Delhi: Floor leaders of Opposition parties in both the Houses of Parliament hold a meeting at the office of LoP in Rajya Sabha, Mallikarjun Kharge to discuss strategy for further agitation to press for the demand of revoking suspension of 12 MPs pic.twitter.com/9rbYyz8DBk

    — ANI (@ANI) December 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ఛాంబర్​లో విపక్షాలు భేటీ అయ్యాయి. 12 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ వ్యవహారం సహా తదుపరి కార్యాచరణపై సభ్యులు చర్చ జరిపినట్లు తెలుస్తోంది.

సస్పెన్షన్​పై నిరసనగా పార్లమెంటులోని గాంధీ విగ్రహం నుంచి విజయ్ చౌక్ వరకు విపక్ష పార్టీల ఎంపీలు పాదయాత్ర చేయనున్నట్లు సమాచారం.

14:27 December 14

విపక్ష నేతల వాకౌట్​..

రాజ్యసభ తిరిగి ప్రారంభమైనప్పటికీ.. విపక్ష నేతల నిరసనలు కొనసాగాయి. ఎంపీల సస్పెన్షన్​ను రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. కానీ పరిస్థితి మారకపోవడం వల్ల తమ అసహనాన్ని వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్​ చేశారు.

13:11 December 14

రాహుల్​ ఫైర్​...

పార్లమెంట్​ ఆవరణంలో విపక్షాలు చేస్తున్న నిరసనల్లో పాల్గొన్న రాహుల్​ గాంధీ.. కేంద్రం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.

"దేశంలో ప్రజా గొంతుకను నొక్కేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని చెప్పడానికి ఎంపీల సస్పెన్షన్​ నిదర్శనం. ఎంపీల గొంతును నొక్కేస్తున్నారు. వారు ఎలాంటి తప్పు చేయలేదు. ముఖ్యమైన అంశాలను పార్లమెంట్​లో చర్చించేందుకు మాకు అనుమతినివ్వడం లేదు. పార్లమెంట్​లో చర్చలు లేకుండానే బిల్లుల మీద బిల్లులు ఆమోదం పొందుతున్నాయి. పార్లమెంట్​ను నడిపే విధానం ఇది కాదు. ప్రధాని సభకు రావడం లేదు. జాతీయస్థాయిలో ముఖ్యమైన విషయాలను ప్రస్తావించేందుకు మాకు అవకాశం లభించడం లేదు. ప్రజాస్వామ్యాన్ని హత్యచేస్తున్నారు." -- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ సీనియర్​ నేత.

13:08 December 14

ఎంపీల ఆందోళన..

12మంది ఎంపీల సస్పెన్షన్​పై విపక్షాల నిరసన పార్లమెంట్​ దాటింది. ఆందోళనలో భాగంగా.. విపక్ష ఎంపీలు.. దిల్లీలోని పార్లమెంట్​ నుంచి విజయ్​ చౌక్​ వరకు మార్చ్​ నిర్వహించారు. ఎంపీల సస్పెన్షన్​ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.

12:46 December 14

రాజ్యసభలో 12మంది విపక్ష సభ్యులపై సస్పెన్షన్​ను నిరసిస్తూ పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ప్రతిపక్ష నేతలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు.

11:57 December 14

రాజ్యసభలో నిరసనలు..

12మంది ఎంపీల సస్పెన్షన్​పై రాజ్యసభలో విపక్షాలు నిరసనలు కొనసాగుతున్నాయి. దీనిపై ఉపరాష్ట్రపతి, సభ ఛైర్మన్​ వెంకయ్య నాయుడు అసహనం వ్యక్తం చేశారు. వెల్​ ముందుకు వచ్చి నిరసనలు తెలుపుతున్న విపక్షాల తీరును తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. అయినప్పటికీ ఎంపీలు మాట వినకపోవడం వల్ల సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.

10:48 December 14

పార్లమెంట్ లైవ్

  • #WATCH | Delhi: Floor leaders of Opposition parties in both the Houses of Parliament hold a meeting at the office of LoP in Rajya Sabha, Mallikarjun Kharge to discuss strategy for further agitation to press for the demand of revoking suspension of 12 MPs pic.twitter.com/9rbYyz8DBk

    — ANI (@ANI) December 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ఛాంబర్​లో విపక్షాలు భేటీ అయ్యాయి. 12 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ వ్యవహారం సహా తదుపరి కార్యాచరణపై సభ్యులు చర్చ జరిపినట్లు తెలుస్తోంది.

సస్పెన్షన్​పై నిరసనగా పార్లమెంటులోని గాంధీ విగ్రహం నుంచి విజయ్ చౌక్ వరకు విపక్ష పార్టీల ఎంపీలు పాదయాత్ర చేయనున్నట్లు సమాచారం.

Last Updated : Dec 14, 2021, 2:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.