ETV Bharat / bharat

'భారత్​తో శత్రుత్వాన్ని తొలగించాల్సిన బాధ్యత పాక్​దే' - భారత్​ పాక్ సంబంధాలపై సైనిక దళాధిపతి వ్యాఖ్యలు

భారత్​తో శత్రుత్వాన్ని తొలగించాల్సిన బాధ్యత పాకిస్థాన్​పైనే ఉందని కేంద్రం స్పష్టం చేసింది. పాకిస్థాన్​తో తాము సాధారణ పొరుగుదేశ సంబంధాలను కోరుకుంటున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ వెల్లడించారు.

Pak only responsibile to end hostilities with India
తొలగించాల్సిన బాధ్యత పాకిస్థాన్​‌పైనే
author img

By

Published : Feb 5, 2021, 7:07 AM IST

ఉగ్రవాదం నుంచి విముక్తి పొందిన వాతావరణాన్ని కల్పించడం సహా భారత్‌తో శత్రుత్వాన్ని తొలగించాల్సిన బాధ్యత పాకిస్థాన్​‌పైనే ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత్‌తో శాంతికి పాకిస్థాన్​ అన్ని వైపుల నుంచి మార్గాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందంటూ ఆ దేశ సైనిక దళాల ప్రధానాధికారి జనరల్‌ ఖమర్‌ జావెద్‌ బజ్వా ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో కేంద్రం ఈ ప్రకటన చేసింది.

పాకిస్థాన్​తో తాము సాధారణ పొరుగుదేశ సంబంధాలను కోరుకుంటున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ వెల్లడించారు.

భారత్‌తో పరస్పర గౌరవం, శాంతియుత సహ మనుగడకు కట్టుబడి ఉన్నట్లు కూడా జనరల్‌ బజ్వా ఇటీవల వ్యాఖ్యానించారు. కశ్మీర్​ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.

ఇదీ చదవండి: అమిత్​ షాతో అజిత్​ డోభాల్​ కీలక భేటీ

ఉగ్రవాదం నుంచి విముక్తి పొందిన వాతావరణాన్ని కల్పించడం సహా భారత్‌తో శత్రుత్వాన్ని తొలగించాల్సిన బాధ్యత పాకిస్థాన్​‌పైనే ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత్‌తో శాంతికి పాకిస్థాన్​ అన్ని వైపుల నుంచి మార్గాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందంటూ ఆ దేశ సైనిక దళాల ప్రధానాధికారి జనరల్‌ ఖమర్‌ జావెద్‌ బజ్వా ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో కేంద్రం ఈ ప్రకటన చేసింది.

పాకిస్థాన్​తో తాము సాధారణ పొరుగుదేశ సంబంధాలను కోరుకుంటున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ వెల్లడించారు.

భారత్‌తో పరస్పర గౌరవం, శాంతియుత సహ మనుగడకు కట్టుబడి ఉన్నట్లు కూడా జనరల్‌ బజ్వా ఇటీవల వ్యాఖ్యానించారు. కశ్మీర్​ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.

ఇదీ చదవండి: అమిత్​ షాతో అజిత్​ డోభాల్​ కీలక భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.