కాంగ్రెస్ మాజీ నాయకుడు పీసీ చాకో.. నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. గతవారం హస్తం పార్టీని వీడిన ఆయన.. ఎన్సీసీ చీఫ్ శరద్ పవార్ సమక్షంలో.. దిల్లీలో మంగళవారం అధికారికంగా ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
"నేను ఈ రోజు అధికారికంగా ఎన్సీపీలో చేరాను. ప్రతిపక్షాలు ఐక్యంగా పోరాడి భాజపాకు ప్రత్యామ్నాయంగా నిలవాలి. గతంలో నేను సభ్యుడిగా ఉన్న పార్టీలో ఈ చొరవ నాకు కనిపించలేదు."
- పీసీ చాకో, ఎన్సీపీ నేత
కేరళలో ఏప్రిల్ 6న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో.. సీపీఐ నేతృత్వంలోని వామపక్షాల భాగస్వామి అయిన ఎన్సీపీ విజయానికి కృషి చేస్తానని.. ఈ సందర్భంగా చాకో అన్నారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్లో ఉన్న ఆయన.. విభేదాల కారణంగా వారం క్రితం ఆ పార్టీ నుంచి వైదొలిగారు.
ఇదీ చదవండి: 'రికార్డు స్థాయి'లో ఎన్నికల్లో ఓడి కేరళ సీఎంకు పోటీగా..