ETV Bharat / bharat

'మొతేరా స్టేడియం' పేరు మార్పుపై కేంద్రం వివరణ

author img

By

Published : Feb 24, 2021, 8:53 PM IST

Updated : Feb 24, 2021, 10:41 PM IST

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్​ స్టేడియమైన మొతేరాకు ప్రధాని నరేంద్ర మోదీ పేరు పెట్టడంపై కేంద్రం వివరణ ఇచ్చింది. స్టేడియంకు మాత్రమే ప్రధాని పేరు పెట్టినట్లు తెలిపింది. అక్కడ ఉండే క్రీడా ప్రాంగణానికి మాత్రం సర్దార్ పటేల్ పేరే ఉంటుందని స్పష్టం చేసింది.

Only Motera stadium renamed after PM, complex continues to have Sardar Patel name: Govt
'మైదానానికి మాత్రమే మోదీ పేరు..'

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానంగా రికార్డుకెక్కిన గుజరాత్​లోని మొతేరా స్డేడియానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేరు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే దీనిపై ప్రభుత్వం స్పందించింది. తాము మైదానానికి మాత్రమే మోదీ పేరు పెట్టామని స్పష్టం చేసింది. ఇదే క్రీడా సముదాయానికి ( స్పోర్ట్స్​ కాంప్లెక్స్​) సర్దార్ వల్లభ్​భాయ్ పటేల్​ పేరు కొనసాగుతోందని పేర్కొంది.

రాష్ట్రపతి రామ్​నాధ్ ​కోవింద్​ మొతేరా స్టేడియాన్ని ప్రారంభించి.. మోదీ పేరు పెట్టడంపై సోషల్​ మీడియాలో కాంగ్రెస్​ నాయకులే కాకుండా నెటిజన్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇది కచ్చితంగా పటేల్​కు జరిగిన అవమానం అని మండిపడ్డారు. దీనిపై కేంద్ర మంత్రులు ప్రకాశ్​ జావడేకర్, రవిశంకర్ ప్రసాద్​లు వివరణ ఇచ్చారు. స్టేడియంకు మాత్రమే పేరు మార్చినట్లు తెలిపారు.

పటేల్​ సేవలకు.. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహాన్ని నిర్మించినా ఏనాడు మెచ్చుకోని కాంగ్రెస్​ నాయకులు ఇప్పుడే ఎందుకు విమర్శలు చేస్తున్నారని రవిశంకర్ ప్రశ్నించారు. సోనియా గాంధీ, రాహుల్​ గాంధీ.. ఇప్పటివరకు కనీసం అక్కడ పర్యటించింది లేదని తెలిపారు.

స్టేడియం పేరు మార్పుపై.. కాంగ్రెస్​ నాయకులు శశిథరూర్​, రాజీవ్​ సటావ్​, ప్రియాంకా గాంధీలు ట్విట్టర్​ వేదికగా కేంద్రంపై విమర్శల వర్షం కురిపించారు.

ఇదీచూడండి: 'మొతేరా విషయంలో​ పటేల్​కు అవమానం'

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానంగా రికార్డుకెక్కిన గుజరాత్​లోని మొతేరా స్డేడియానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేరు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే దీనిపై ప్రభుత్వం స్పందించింది. తాము మైదానానికి మాత్రమే మోదీ పేరు పెట్టామని స్పష్టం చేసింది. ఇదే క్రీడా సముదాయానికి ( స్పోర్ట్స్​ కాంప్లెక్స్​) సర్దార్ వల్లభ్​భాయ్ పటేల్​ పేరు కొనసాగుతోందని పేర్కొంది.

రాష్ట్రపతి రామ్​నాధ్ ​కోవింద్​ మొతేరా స్టేడియాన్ని ప్రారంభించి.. మోదీ పేరు పెట్టడంపై సోషల్​ మీడియాలో కాంగ్రెస్​ నాయకులే కాకుండా నెటిజన్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇది కచ్చితంగా పటేల్​కు జరిగిన అవమానం అని మండిపడ్డారు. దీనిపై కేంద్ర మంత్రులు ప్రకాశ్​ జావడేకర్, రవిశంకర్ ప్రసాద్​లు వివరణ ఇచ్చారు. స్టేడియంకు మాత్రమే పేరు మార్చినట్లు తెలిపారు.

పటేల్​ సేవలకు.. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహాన్ని నిర్మించినా ఏనాడు మెచ్చుకోని కాంగ్రెస్​ నాయకులు ఇప్పుడే ఎందుకు విమర్శలు చేస్తున్నారని రవిశంకర్ ప్రశ్నించారు. సోనియా గాంధీ, రాహుల్​ గాంధీ.. ఇప్పటివరకు కనీసం అక్కడ పర్యటించింది లేదని తెలిపారు.

స్టేడియం పేరు మార్పుపై.. కాంగ్రెస్​ నాయకులు శశిథరూర్​, రాజీవ్​ సటావ్​, ప్రియాంకా గాంధీలు ట్విట్టర్​ వేదికగా కేంద్రంపై విమర్శల వర్షం కురిపించారు.

ఇదీచూడండి: 'మొతేరా విషయంలో​ పటేల్​కు అవమానం'

Last Updated : Feb 24, 2021, 10:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.