జమ్ముకశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ముష్కరుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పుల్వామాలోని కాకపొరాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతా సిబ్బంది.. నిర్బంధ తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. సైన్యం జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో మరో ఇద్దరు పౌరులు గాయపడ్డారు.