ఉత్తర్ప్రదేశ్లోని వారణాసి పట్టణం ఎంతో పురాతనమైనది, విశిష్టమైనది. అక్కడ వందల సంవత్సరాలకు చెందిన పురాతన కట్టడాలు ఉన్నాయి. అక్కడ కొన్ని పురాతన భవనాలు కూలిపోకుండా వెదురు కర్రల ఆధారంతో జాగ్రత్తగా కాపాడుతున్నారు. అసలే వర్షాకాలం కాబట్టి పాతవైన ఆ భవనాలు ఏ క్షణమైనా కూలొచ్చు.
![old-buildings-stand-on-bamboo-poles](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/up-var-1-ajab-banaras-makan-7200982_16062021152943_1606f_1623837583_700.jpg)
![old-buildings-stand-on-bamboo-poles](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/up-var-1-ajab-banaras-makan-7200982_16062021152943_1606f_1623837583_836.jpg)
![old-buildings-stand-on-bamboo-poles](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/up-var-1-ajab-banaras-makan-7200982_16062021152943_1606f_1623837583_3.jpg)
దాంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. ఇది గమనించిన ప్రభుత్వం శిథిలావస్థకు చేరిన 335 భవనాల్ని గుర్తించి వాటిని ముందస్తుగా కూల్చడానికి సిద్ధమైంది. ఆయా భవన యజమానులకు నోటీసులు కూడా పంపింది. అందులో 110 భవనాల్ని ఇప్పటికే కూల్చింది. మరికొన్ని కోర్టు కేసులలో ఉన్నందువల్ల కూల్చడానికి కొంచెం సమయం పడుతుందని మున్సిపల్ కమిషనర్ గౌరంగ్ రాతీ తెలిపారు.
ఇదీ చదవండి: వారణాసి.. పరమేశ్వరుని సృష్టి..