ETV Bharat / bharat

ద్విచక్ర వాహనదారుడికి రూ.1.13 లక్షల జరిమానా - మధ్యప్రదేశ్​ ద్విచక్రవాహనదారుడికి ఒడిశాలో 1.13 లక్షల జరిమానా

ట్రాఫిక్​ రూల్స్​ పాటించకపోతే ఎవరైనా ఎంత జరిమానా చెల్లిస్తారు?. మహా అయితే వెయ్యో..రెండు వేలో కదా!. మధ్యప్రదేశ్​కు చెందిన ఈ వ్యాపారి ఏకంగా రూ.1.13లక్షల జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ఇంతకు అతడు చేసిన తప్పేంటో తెలుసుకుందాం పదండి.

Odisha police impose Rs 1.13 lakh fine to madyapradhesh motorist
ద్విచక్ర వాహనదారుడికి రూ.1.13 లక్షల జరిమాన
author img

By

Published : Jan 14, 2021, 7:24 AM IST

రిజిస్ట్రేషన్‌ చేయించుకోకుండా.. కనీసం హెల్మెట్​ కూడా ధరించకుండా బైక్​ నడిపిన ఓ వ్యాపారికి అధికారులు రూ. 1.13 లక్షల జరిమానా విధించారు. ఒడిశాలోని రాయగడ డీవీఐ కూడలి వద్ద బుధవారం పోలీసులు, ఆర్టీవో సిబ్బంది తనిఖీల్లో భాగంగా.. ప్లాస్టిక్‌ డ్రమ్ముల వ్యాపారం చేసే, మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రకాశ్‌ బంజారను ఆపారు. అతడు తన వాహనానికి 8 డ్రమ్ములు కట్టుకుని వెళ్తున్నాడు. దీంతో పత్రాలు అడగ్గా ప్రకాశ్‌ ఏమీ చూపించలేకపోయాడు.

తనిఖీ చేయగా వాహనానికి రిజిస్ట్రేషన్‌ చేయించలేదని, ఏ విధమైన పత్రాలూ లేవని గుర్తించారు. దీంతో భారీ మొత్తంలో జరిమానా విధించారు. ప్రకాశ్‌ అప్పటికప్పుడు తన సన్నిహితుల వద్ద నుంచి డబ్బు తీసుకుని జరిమానా మొత్తాన్ని చెల్లించాడు.

రిజిస్ట్రేషన్‌ చేయించుకోకుండా.. కనీసం హెల్మెట్​ కూడా ధరించకుండా బైక్​ నడిపిన ఓ వ్యాపారికి అధికారులు రూ. 1.13 లక్షల జరిమానా విధించారు. ఒడిశాలోని రాయగడ డీవీఐ కూడలి వద్ద బుధవారం పోలీసులు, ఆర్టీవో సిబ్బంది తనిఖీల్లో భాగంగా.. ప్లాస్టిక్‌ డ్రమ్ముల వ్యాపారం చేసే, మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రకాశ్‌ బంజారను ఆపారు. అతడు తన వాహనానికి 8 డ్రమ్ములు కట్టుకుని వెళ్తున్నాడు. దీంతో పత్రాలు అడగ్గా ప్రకాశ్‌ ఏమీ చూపించలేకపోయాడు.

తనిఖీ చేయగా వాహనానికి రిజిస్ట్రేషన్‌ చేయించలేదని, ఏ విధమైన పత్రాలూ లేవని గుర్తించారు. దీంతో భారీ మొత్తంలో జరిమానా విధించారు. ప్రకాశ్‌ అప్పటికప్పుడు తన సన్నిహితుల వద్ద నుంచి డబ్బు తీసుకుని జరిమానా మొత్తాన్ని చెల్లించాడు.

ఇదీ చదవండి:రంగు తెచ్చిన తంట- వీరంగం సృష్టించిన ఆవు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.