ఒడిశా కటక్లోని నవోన్మేష్ ప్రసార్ స్టూడెంట్ ఆస్ట్రానమీ టీమ్(నాప్సాట్) సరికొత్త రోవర్ను రూపొందించింది. 10 మంది పాఠశాల విద్యార్థులు కలిసి ఆవిష్కరించిన ఈ రోవర్ను.. అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం(నాసా) హ్యూమన్ రోవర్ ఎక్స్ప్లొరేషన్ ఛాలెంజ్-2021లో ప్రదర్శనకు ఉంచనున్నారు.
![Cuttack-based astronomy team designs rover to exhibit at NASA challenge](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11370499_03.jpg)
'ఆర్టెమిస్ మిషన్' కోసం..
ఇతర గ్రహాలపై ఉండే విభిన్న భూభాగాల్లోనూ పనిచేసే విధంగా ఈ రోవర్ను రూపొందించినట్లు తెలిపారు విద్యార్థులు. నాసా ఆర్టెమిస్ మిషన్ రోవర్ రూపొకల్పనకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
"2024లో నాసా చేపట్టబోయే 'ఆర్టెమిస్ మిషన్' కోసం ఈ రోవర్ను రూపొందించాం. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా.. ఎలాంటి భూభాగంలోనైనా ప్రయాణించే సామర్థ్యం ఈ రోవర్ సొంతం."
- నాప్సాట్ సభ్యుడు
ఇదీ చదవండి: చంద్రుడికి కూడా తుప్పు పడుతుందా..?
నాసా ప్రదర్శనకు తమ బృందం ఎంపికైనట్లు గతేడాది నవంబర్ 6న తమకు ఓ లేఖ అందినట్లు నవోన్మేష్ ప్రసార్ ఫౌండేషన్ తెలిపింది. వివిధ ప్రాంతాలకు చెందిన 10 మంది విద్యార్థులు బృందంగా ఏర్పడి.. కరోనా పరిస్థితుల్లోనూ 8 నెలలు కష్టపడి ఈ రోవర్ను ఆవిష్కరించినట్లు వెల్లడించింది. నాసా నుంచి నాప్సాట్ 1.0 తరఫున భారత్కు ఓ అవార్డును తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నామంది.
![Cuttack-based astronomy team designs rover to exhibit at NASA challenge](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11370499_01.jpg)
ఈ నెల 15-17 వరకు అలబామాలో నాసా హ్యూమన్ రోవర్ ఎక్స్ప్లొరేషన్ పోటీలు జరగనున్నాయి. అయితే.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నాప్సాట్ బృందం అలబామా వెళ్లలేకపోయింది.
ఇవీ చదవండి: