ETV Bharat / bharat

ఓసీఐ కార్డుదారులకు కేంద్రం కొత్త రూల్స్ - OCI card holders latest rules

ఓవర్​సీస్ సిటిజెన్​ ఆఫ్​ ఇండియా(ఓసీఐ) కార్డుదారులు ఇకపై భారత్​లో తబ్లిగీ​ కార్యక్రమాలు, మీడియా సమావేశాలు నిర్వహించాలంటే ప్రత్యేక అనుమతి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గతేడాది మార్చిలో లాక్​డౌన్ సమయంలో దాదాపు 2,500 మంది తబ్లిగీ జమాత్​ సభ్యులు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ప్రార్థనల్లో పాల్గొన్న క్రమంలో ఈ సారి పటిష్ఠమైన చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది.

OCI cardholders require special permit if they want to undertake 'Tabligh', media activities: Govt
'ఓసీఐ' కార్డు దారులకు కేంద్రం నూతన మార్గదర్శకాలు..
author img

By

Published : Mar 5, 2021, 4:33 PM IST

ఓవర్​సీస్ సిటిజెన్​ ఆఫ్​ ఇండియా(ఓసీఐ) కార్డుదారులు ఇకపై భారత్​లో తబ్లిగీ​ కార్యక్రమాలు, మీడియా సమావేశాల్లో పాల్గొనాలంటే ప్రత్యేక అనుమతి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గతేడాది మార్చిలో లాక్​డౌన్ సమయంలో దాదాపు 2,500 మంది తబ్లిగీ జమాత్​ సభ్యులు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ప్రార్థనల్లో పాల్గొన్న నేపథ్యంలో ఈమేరకు నిబంధనలు సవరించింది.

కేంద్రం నూతన మార్గదర్శకాల ప్రకారం..

  • స్వదేశీ విమాన ప్రయాణ ధరలు, జాతీయ పార్కుల సందర్శన, జాతీయ మ్యూజియంల సందర్శనల్లో.. భారత పౌరులకు వర్తించే ధరలే ఓసీఐ కార్డుదారులకు ఉంటాయి.
  • ఓసీఐ కార్డుదారులు.. ఏ పనిమీదనైనా భారత్​కు ఎన్నిసార్లు అయినా రావొచ్చు. కానీ తబ్లిగీ, మీడియా, పరిశోధన, మిషనరీ, పర్వతారోహణం వంటి కార్యకలాపాలు భారత్​లో నిర్వహించాలంటే మాత్రం విదేశీ​ రీజినల్​ రిజిస్ట్రేషన్​ కార్యాలయం(ఎఫ్​ఆర్​ఆర్​ఓ) నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాలి.
  • భారత్​లో ఉన్న విదేశీ విద్యాసంస్థల్లో ఇంటర్న్​షిప్ చేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా కేంద్రం ప్రత్యేక అనుమతి ఉండాలి.
  • భారత్​లోని నిషేధిత, వివాదాస్పద ప్రాంతాల్లో పర్యటించాలన్నా కచ్చితంగా కేంద్రం అనుమతి తీసుకోవాలి.
  • ఓసీఐ కార్డుదారులు ఎంత కాలమైనా భారత్​లో ఉండొచ్చు. కానీ ఒకవేళ శాశ్వత చిరునామా మార్చినా, ఉద్యోగం మార్చినా విదేశీ​ రీజినల్​ రిజిస్ట్రేషన్​ కార్యాలయం(ఎఫ్​ఆర్​ఆర్​ఓ)కు సమాచారం ఇవ్వాలి.
  • వ్యవసాయేత భూముల క్రయవిక్రయాల్లోనూ భారత పౌరులకు ఉన్న హక్కులే ఓసీఐ కార్డుదారులకు ఉంటాయి.

ఓసీఐ కార్డుదారులు అంటే.. విదేశీ పాస్​పోర్టు కలిగిన భారత సంతతి వ్యక్తి. ఓసీఐ కార్డుదారులు భారత పౌరులు కాదు.

ఇదీ చదవండి : 'కరోనా కాలంలో 150 దేశాలకు భారత ఔషధాలు'

ఓవర్​సీస్ సిటిజెన్​ ఆఫ్​ ఇండియా(ఓసీఐ) కార్డుదారులు ఇకపై భారత్​లో తబ్లిగీ​ కార్యక్రమాలు, మీడియా సమావేశాల్లో పాల్గొనాలంటే ప్రత్యేక అనుమతి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గతేడాది మార్చిలో లాక్​డౌన్ సమయంలో దాదాపు 2,500 మంది తబ్లిగీ జమాత్​ సభ్యులు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ప్రార్థనల్లో పాల్గొన్న నేపథ్యంలో ఈమేరకు నిబంధనలు సవరించింది.

కేంద్రం నూతన మార్గదర్శకాల ప్రకారం..

  • స్వదేశీ విమాన ప్రయాణ ధరలు, జాతీయ పార్కుల సందర్శన, జాతీయ మ్యూజియంల సందర్శనల్లో.. భారత పౌరులకు వర్తించే ధరలే ఓసీఐ కార్డుదారులకు ఉంటాయి.
  • ఓసీఐ కార్డుదారులు.. ఏ పనిమీదనైనా భారత్​కు ఎన్నిసార్లు అయినా రావొచ్చు. కానీ తబ్లిగీ, మీడియా, పరిశోధన, మిషనరీ, పర్వతారోహణం వంటి కార్యకలాపాలు భారత్​లో నిర్వహించాలంటే మాత్రం విదేశీ​ రీజినల్​ రిజిస్ట్రేషన్​ కార్యాలయం(ఎఫ్​ఆర్​ఆర్​ఓ) నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాలి.
  • భారత్​లో ఉన్న విదేశీ విద్యాసంస్థల్లో ఇంటర్న్​షిప్ చేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా కేంద్రం ప్రత్యేక అనుమతి ఉండాలి.
  • భారత్​లోని నిషేధిత, వివాదాస్పద ప్రాంతాల్లో పర్యటించాలన్నా కచ్చితంగా కేంద్రం అనుమతి తీసుకోవాలి.
  • ఓసీఐ కార్డుదారులు ఎంత కాలమైనా భారత్​లో ఉండొచ్చు. కానీ ఒకవేళ శాశ్వత చిరునామా మార్చినా, ఉద్యోగం మార్చినా విదేశీ​ రీజినల్​ రిజిస్ట్రేషన్​ కార్యాలయం(ఎఫ్​ఆర్​ఆర్​ఓ)కు సమాచారం ఇవ్వాలి.
  • వ్యవసాయేత భూముల క్రయవిక్రయాల్లోనూ భారత పౌరులకు ఉన్న హక్కులే ఓసీఐ కార్డుదారులకు ఉంటాయి.

ఓసీఐ కార్డుదారులు అంటే.. విదేశీ పాస్​పోర్టు కలిగిన భారత సంతతి వ్యక్తి. ఓసీఐ కార్డుదారులు భారత పౌరులు కాదు.

ఇదీ చదవండి : 'కరోనా కాలంలో 150 దేశాలకు భారత ఔషధాలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.