ETV Bharat / bharat

స్మార్ట్ కేటుగాళ్లు-  ఏటీఎంలలో రూ. లక్షలు చోరీ

author img

By

Published : Jun 24, 2021, 5:05 PM IST

చెన్నైలోని ఎస్​బీఐ క్యాష్​ డిపాజిట్​ మెషిన్​ (సీడీఎమ్​)ల నుంచి రూ.48 లక్షలను చోరీ చేశాయి హరియాణాకు చెందిన ముఠాలు. అందులో ఓ వ్యక్తిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. మెషిన్​లో ఉన్న ఒకే ఒక్క లొసుగును వాడుకుని ఈ మోసానికి పాల్పడ్డారు. అయితే.. నిందితులు సీడీఎమ్​ మెషిన్​లనే మోసం చేసిన తీరు అవాక్కయ్యేలా చేస్తుంది.

Novel ATM Robbery
ఏటీఎం చోరి

ఏటీఎం దొంగతనం అంటే.. మెషిన్​ను పగులగొట్టడమో.. లేదంటే మెషిన్​నే ఎత్తుకెళ్లిన ఘటనలు మనం చూశాం. కానీ ఈ సారి మాయగాళ్లు మరీ స్మార్ట్​గా ఆలోచించారు. క్యాష్​ డిపాజిట్​​ మెషిన్​లను లక్ష్యంగా చేసుకున్నారు. ఏటీఎం మెషిన్​లోని చిన్న లూప్​ హోల్​ను ఆసరాగా చేసుకుని రూ. లక్షలు దండుకున్నారు. సుమారు రూ.48 లక్షలు చోరీ చేశారు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నై నగరంలో జరిగింది.

స్మార్ట్​గా లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

20 సెకన్లే కీలకం..

క్యాష్​ డిపాజిట్​ మెషిన్లలో డిపాజిట్​తో పాటు విత్​డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఎస్​బీఐ మెషిన్​లను జపాన్ ఓకేఐ​ కంపెనీ తయారు చేసింది. దీనిలో విత్​డ్రా చేసుకున్నప్పుడు ​20 సెకన్లు కీలకమైన సమయంగా పరిగణిస్తారు. డబ్బులు బయటకు రాగానే 20 సెకన్లలోగా తీసుకోవాలి. లేదంటే ఆ నోట్లను మెషిన్.. లోపలికి తీసుకుంటుంది. వెంటనే మూత పడిపోతుంది. డబ్బులు తీసుకోలేదని అక్కడ ఉన్న సెన్సార్లు గ్రహించి సమాచారం పంపిస్తాయి. అకౌంట్​లో బ్యాలెన్స్​ అలాగే ఉంటుంది. డబ్బులు డ్రా చేసుకునేప్పుడు.. ఏటీఎం మూతపడిపోకుండా చేతితో ఆపితే డబ్బులు తీసుకోలేదని సెన్సార్లు గ్రహిస్తాయి. దీన్నే తమ ఆయుధంగా వాడుకున్నారు కేటుగాళ్లు.

ఆ చిన్న లొసుగుతో..

ఎస్​బీఐ ఏటీఎం మెషిన్​లోని చిన్న లొసుగును ఆసరాగా చేసుకుని హరిణాయాకు చెందిన మూఠాలు దొంగతనాలకు పాల్పడ్డాయి. ఏటీఎం నుంచి డబ్బులు తీసుకుని మూతపడిపోకుండా చేతితో ఆపే టెక్నిక్​ను గ్రహించారు కేటుగాళ్లు. దీంతో ఏటీఎం నుంచి డబ్బులు తీసుకున్నా తీసుకోలేదని సెన్సార్లు గ్రహించాయి. అకౌంట్లలో బ్యాలెన్స్​ తప్పుగా చూపించగా.. బ్యాంకు అధికారులు సీసీ టీవీలను గమనించారు. దీంతో మోసం బయటపడింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నైలో జూన్​ 15 నుంచి 18 మధ్య తమ ఎస్​బీఐ ఏటీఎంల్లో రూ.48 లక్షలు డబ్బును మాయం చేశారని.. దీనికి సంబంధించి 14 కేసులు వచ్చాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ టీవీ ఆధారంగా నిందితులు హరియాణాకు చెందిన ముఠాలుగా గుర్తించారు. ప్రత్యేక బృందాలుగా హరియాణాలో గాలింపు చర్యలు చేపట్టగా.. ఒక నిందితుడు పట్టుబడ్డాడు. అతని నుంచి రూ.4.5 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి: రోడ్​ రోలర్‌ను కొట్టేసి.. కిలోల లెక్కన అమ్మేసి..

ఐసీయూలో ఎలుక కరచిన రోగి మృతి

ఏటీఎం దొంగతనం అంటే.. మెషిన్​ను పగులగొట్టడమో.. లేదంటే మెషిన్​నే ఎత్తుకెళ్లిన ఘటనలు మనం చూశాం. కానీ ఈ సారి మాయగాళ్లు మరీ స్మార్ట్​గా ఆలోచించారు. క్యాష్​ డిపాజిట్​​ మెషిన్​లను లక్ష్యంగా చేసుకున్నారు. ఏటీఎం మెషిన్​లోని చిన్న లూప్​ హోల్​ను ఆసరాగా చేసుకుని రూ. లక్షలు దండుకున్నారు. సుమారు రూ.48 లక్షలు చోరీ చేశారు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నై నగరంలో జరిగింది.

స్మార్ట్​గా లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

20 సెకన్లే కీలకం..

క్యాష్​ డిపాజిట్​ మెషిన్లలో డిపాజిట్​తో పాటు విత్​డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఎస్​బీఐ మెషిన్​లను జపాన్ ఓకేఐ​ కంపెనీ తయారు చేసింది. దీనిలో విత్​డ్రా చేసుకున్నప్పుడు ​20 సెకన్లు కీలకమైన సమయంగా పరిగణిస్తారు. డబ్బులు బయటకు రాగానే 20 సెకన్లలోగా తీసుకోవాలి. లేదంటే ఆ నోట్లను మెషిన్.. లోపలికి తీసుకుంటుంది. వెంటనే మూత పడిపోతుంది. డబ్బులు తీసుకోలేదని అక్కడ ఉన్న సెన్సార్లు గ్రహించి సమాచారం పంపిస్తాయి. అకౌంట్​లో బ్యాలెన్స్​ అలాగే ఉంటుంది. డబ్బులు డ్రా చేసుకునేప్పుడు.. ఏటీఎం మూతపడిపోకుండా చేతితో ఆపితే డబ్బులు తీసుకోలేదని సెన్సార్లు గ్రహిస్తాయి. దీన్నే తమ ఆయుధంగా వాడుకున్నారు కేటుగాళ్లు.

ఆ చిన్న లొసుగుతో..

ఎస్​బీఐ ఏటీఎం మెషిన్​లోని చిన్న లొసుగును ఆసరాగా చేసుకుని హరిణాయాకు చెందిన మూఠాలు దొంగతనాలకు పాల్పడ్డాయి. ఏటీఎం నుంచి డబ్బులు తీసుకుని మూతపడిపోకుండా చేతితో ఆపే టెక్నిక్​ను గ్రహించారు కేటుగాళ్లు. దీంతో ఏటీఎం నుంచి డబ్బులు తీసుకున్నా తీసుకోలేదని సెన్సార్లు గ్రహించాయి. అకౌంట్లలో బ్యాలెన్స్​ తప్పుగా చూపించగా.. బ్యాంకు అధికారులు సీసీ టీవీలను గమనించారు. దీంతో మోసం బయటపడింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నైలో జూన్​ 15 నుంచి 18 మధ్య తమ ఎస్​బీఐ ఏటీఎంల్లో రూ.48 లక్షలు డబ్బును మాయం చేశారని.. దీనికి సంబంధించి 14 కేసులు వచ్చాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ టీవీ ఆధారంగా నిందితులు హరియాణాకు చెందిన ముఠాలుగా గుర్తించారు. ప్రత్యేక బృందాలుగా హరియాణాలో గాలింపు చర్యలు చేపట్టగా.. ఒక నిందితుడు పట్టుబడ్డాడు. అతని నుంచి రూ.4.5 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి: రోడ్​ రోలర్‌ను కొట్టేసి.. కిలోల లెక్కన అమ్మేసి..

ఐసీయూలో ఎలుక కరచిన రోగి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.