ETV Bharat / bharat

'రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థిని కాను'

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పలుమార్లు భేటీ అయిన నేపథ్యంలో.. పవార్​ రాష్ట్రపతి రేసులో ఉన్నారనే ఊహాగానాలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఎన్సీపీ నేత.. ముమ్మాటికీ తాను రాష్ట్రపతి అభ్యర్థి కాదని స్పష్టం చేశారు.

author img

By

Published : Jul 14, 2021, 9:38 PM IST

pawar
శరద్ పవార్, ఎన్సీపీ నేత

రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థిని తాను కాదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు. పోటీ చేసినా ఫలితం ఎలా ఉంటుందనేది ముందే తెలుసని చెప్పారు.

"రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే. 300కు పైగా ఎంపీ స్థానాలున్న పార్టీకే ఆ పదవి దక్కుతుందని నాకు తెలుసు."

--శరద్ పవార్, ఎన్సీపీ ఛీఫ్.

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్​, పవార్​ పలుమార్లు భేటీ అయిన నేపథ్యంలో.. పవార్​ రాష్ట్రపతి పదవికి పోటీచేయనున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన పవార్.. 2024 ఎన్నికలు, రాష్ట్రపతి పదవికి సంబంధించిన అంశంపై తాము అస్సలు చర్చించలేదని అన్నారు. పీకే వ్యూహకర్తగా తప్పుకున్నట్లు తెలిపారని అన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థిని తాను కాదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు. పోటీ చేసినా ఫలితం ఎలా ఉంటుందనేది ముందే తెలుసని చెప్పారు.

"రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే. 300కు పైగా ఎంపీ స్థానాలున్న పార్టీకే ఆ పదవి దక్కుతుందని నాకు తెలుసు."

--శరద్ పవార్, ఎన్సీపీ ఛీఫ్.

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్​, పవార్​ పలుమార్లు భేటీ అయిన నేపథ్యంలో.. పవార్​ రాష్ట్రపతి పదవికి పోటీచేయనున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన పవార్.. 2024 ఎన్నికలు, రాష్ట్రపతి పదవికి సంబంధించిన అంశంపై తాము అస్సలు చర్చించలేదని అన్నారు. పీకే వ్యూహకర్తగా తప్పుకున్నట్లు తెలిపారని అన్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.