ETV Bharat / bharat

భారత్​కు కోట్ల రూపాయలు పంపిన నీరవ్ సోదరి

author img

By

Published : Jul 1, 2021, 9:40 PM IST

పీఎన్​బీలో వేల కోట్ల మోసానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన నీరవ్​ మోదీ ఆస్తులు భారత్​కు బదిలీ అయ్యాయి. నీరవ్​ సోదరి పూర్వి మోదీ రూ.17 కోట్లను ప్రభుత్వ ఖాతాలో జమచేశారు.

Nirav Modi's sister sends money to india
నీరవ్​ మోదీ

పీఎన్​బీ కుంభకోణం ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్​ మోదీ(nirav modi) సోదరి పూర్వి మోదీ బ్యాంకు ఖాతా నుంచి భారత ప్రభుత్వానికి రూ.17.25 కోట్లు బదిలీ అయ్యాయని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ (ED) వెల్లడించింది. ఈ కేసులో పూర్వి సహా ఆమె భర్త అప్రూవర్లుగా మారారు. దీంతో వారికి క్రిమినల్ దర్యాప్తు నుంచి మినహాయింపు లభించింది.

నీరవ్​ తరఫున లండన్​లో తన పేరు మీద ఉన్న ఓ బ్యాంకు ఖాతా గురించి తన దృష్టికి వచ్చినట్లు పూర్వి.. ఈడీకి జూన్ 24న తెలిపారు. అందులో నిధులు తనవి కాదని, వాటిని భారత్​ స్వాధీనం చేసుకునేందుకు సహకరిస్తానని ఆమె వారికి వివరించారు. ఈ క్రమంలోనే అవి ప్రభుత్వ ఖాతాకు బదిలీ అయ్యాయి.

న్యూయార్క్​, లండన్​లలోని రూ.579 కోట్ల విలువైన ఫ్లాట్లు సహా స్విస్ బ్యాంకు డిపాజిట్లను స్వాధీనం చేసుకోవడంలోనూ సహకరిస్తామని పూర్వి హామీ ఇచ్చినట్లు ఈడీ తెలిపింది.

పీఎన్​బీ కుంభకోణం ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్​ మోదీ(nirav modi) సోదరి పూర్వి మోదీ బ్యాంకు ఖాతా నుంచి భారత ప్రభుత్వానికి రూ.17.25 కోట్లు బదిలీ అయ్యాయని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ (ED) వెల్లడించింది. ఈ కేసులో పూర్వి సహా ఆమె భర్త అప్రూవర్లుగా మారారు. దీంతో వారికి క్రిమినల్ దర్యాప్తు నుంచి మినహాయింపు లభించింది.

నీరవ్​ తరఫున లండన్​లో తన పేరు మీద ఉన్న ఓ బ్యాంకు ఖాతా గురించి తన దృష్టికి వచ్చినట్లు పూర్వి.. ఈడీకి జూన్ 24న తెలిపారు. అందులో నిధులు తనవి కాదని, వాటిని భారత్​ స్వాధీనం చేసుకునేందుకు సహకరిస్తానని ఆమె వారికి వివరించారు. ఈ క్రమంలోనే అవి ప్రభుత్వ ఖాతాకు బదిలీ అయ్యాయి.

న్యూయార్క్​, లండన్​లలోని రూ.579 కోట్ల విలువైన ఫ్లాట్లు సహా స్విస్ బ్యాంకు డిపాజిట్లను స్వాధీనం చేసుకోవడంలోనూ సహకరిస్తామని పూర్వి హామీ ఇచ్చినట్లు ఈడీ తెలిపింది.

ఇవీ చూడండి:

Nirav Modi: నీరవ్‌కు షాక్‌.. భారత్‌కు వెళ్లాల్సిందే!

బొక్కేస్తున్నారు.. చెక్కేస్తున్నారు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.