ETV Bharat / bharat

బాధలో ఉన్న దివ్యాంగుడికి సీఎం సైకిల్ గిఫ్ట్

author img

By

Published : Jan 31, 2021, 10:00 PM IST

Updated : Jan 31, 2021, 10:34 PM IST

తన కుమారుడికి ఎంతో ప్రేమతో కొనిచ్చిన సైకిల్​ను ఎవరో దొంగతనం చేశారని బాధపడుతున్న ఆ తండ్రిని సీఎం ఆశ్చర్యానికి గురిచేశారు. పోయిన సైకిల్​ను పోలిన మరో సైకిల్​ను పంపించారు. దీంతో ఆ తండ్రీకొడుకులు సంబర పడిపోతున్నారు.

Kerala CM surprises man distressed by stolen bicycle
బాధలో ఉన్న దివ్యాంగుడికి సీఎం సైకిల్ గిఫ్ట్

మన సైకిల్​ పోతే ఎవరన్నా తెచ్చిస్తారా? మాములుగా అయితే ఎవరూ తీసుకురారు. ఇక దాని గురించి దాదాపు మర్చిపోవాల్సిందే. పోలీసులకు ఫిర్యాదు చేస్తే వెతికి తెచ్చిచ్చే ఛాన్స్ కొంతవరకు​ ఉంది. కానీ ఓ రాష్ట్ర సీఎం.. ప్రత్యేక చొరవచూపి సైకిల్​ను పంపిస్తే ఎలా ఉంటుంది? ఆశ్చర్యకరంగా ఉంటుంది కదూ? అలాంటి సంఘటనే కేరళలో జరిగింది.

కొట్టాయం జిల్లాకు చెందిన సునీశ్​ తన కుమారుడు జస్టిన్​కు సైకిల్​ను కొనిచ్చాడు. కానీ కొద్దిరోజుల్లోనే దాన్ని ఎవరో దొంగిలించారు. పోయిన సైకిల్​ కోసం చాలా వెతికారు. ఎక్కడైనా తన సైకిల్​ కనపడితే సమాచారం ఇవ్వాల్సిందిగా ఫేస్​బుక్​లో.. దివ్యాంగుడైన ఆ తండ్రి పోస్టు చేశాడు. అది కాస్తా వైరల్​ అయింది.

అయితే మరిసటిరోజే సైకిల్​ ప్రత్యక్షమైంది. కానీ అది తన సైకిల్​ కాదు. తన సైకిల్​ రంగును పోలిన మరో సైకిల్​.

ఆ సైకిల్​ను పంపించింది మామూలు వ్యక్తి కాదు.. సాక్షాత్తు సీఎం పినరయి విజయన్​. ముఖ్యమంత్రి ఆదేశాలతో సునీశ్​కు జిల్లా కలెక్టర్​ ఎం. అంజనా సైకిల్​ను అందజేశారు. దీంతో ఆ తండ్రి ఆశ్చర్యానికి గురైయ్యాడు. అతని కుమారుడైతే సీఎం పంపిన కొత్త సైకిల్​ను చూసి మురిసిపోతున్నాడు.

ఇదీ చూడండి: కోరిక తీర్చలేదని శిశువును మంటల్లో వేసి...

మన సైకిల్​ పోతే ఎవరన్నా తెచ్చిస్తారా? మాములుగా అయితే ఎవరూ తీసుకురారు. ఇక దాని గురించి దాదాపు మర్చిపోవాల్సిందే. పోలీసులకు ఫిర్యాదు చేస్తే వెతికి తెచ్చిచ్చే ఛాన్స్ కొంతవరకు​ ఉంది. కానీ ఓ రాష్ట్ర సీఎం.. ప్రత్యేక చొరవచూపి సైకిల్​ను పంపిస్తే ఎలా ఉంటుంది? ఆశ్చర్యకరంగా ఉంటుంది కదూ? అలాంటి సంఘటనే కేరళలో జరిగింది.

కొట్టాయం జిల్లాకు చెందిన సునీశ్​ తన కుమారుడు జస్టిన్​కు సైకిల్​ను కొనిచ్చాడు. కానీ కొద్దిరోజుల్లోనే దాన్ని ఎవరో దొంగిలించారు. పోయిన సైకిల్​ కోసం చాలా వెతికారు. ఎక్కడైనా తన సైకిల్​ కనపడితే సమాచారం ఇవ్వాల్సిందిగా ఫేస్​బుక్​లో.. దివ్యాంగుడైన ఆ తండ్రి పోస్టు చేశాడు. అది కాస్తా వైరల్​ అయింది.

అయితే మరిసటిరోజే సైకిల్​ ప్రత్యక్షమైంది. కానీ అది తన సైకిల్​ కాదు. తన సైకిల్​ రంగును పోలిన మరో సైకిల్​.

ఆ సైకిల్​ను పంపించింది మామూలు వ్యక్తి కాదు.. సాక్షాత్తు సీఎం పినరయి విజయన్​. ముఖ్యమంత్రి ఆదేశాలతో సునీశ్​కు జిల్లా కలెక్టర్​ ఎం. అంజనా సైకిల్​ను అందజేశారు. దీంతో ఆ తండ్రి ఆశ్చర్యానికి గురైయ్యాడు. అతని కుమారుడైతే సీఎం పంపిన కొత్త సైకిల్​ను చూసి మురిసిపోతున్నాడు.

ఇదీ చూడండి: కోరిక తీర్చలేదని శిశువును మంటల్లో వేసి...

Last Updated : Jan 31, 2021, 10:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.