ETV Bharat / bharat

'ఓట్లు చీల్చేందుకు 'కొత్త పార్టీ'తో భాజపా కుట్ర!'

author img

By

Published : Mar 25, 2021, 1:02 PM IST

మైనారిటీ ఓట్లను చీల్చడానికి ఓ కొత్త రాజకీయ పార్టీ అవతరించిందని.. ఆ పార్టీకి భాజపా అండగా ఉందని ఆరోపించారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఆ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయొద్దని ప్రజలకు సూచించారు.

New political party backed by BJP to eat into minority votes: Mamata
'మైనారిటీ ఓట్లు చీల్చడానికే ఆ పార్టీకి అండగా భాజపా'

మైనార్టీల ఓట్లు చీల్చడమే లక్ష్యంగా ఓ కొత్త రాజకీయ పార్టీకి భాజపా రహస్యంగా మద్దతిస్తోందని ఆరోపించారు బంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్​ అధినేత్రి మమతా బెనర్జీ. ఆ పార్టీ వ్యవస్థాపకుడు భాజపా నుంచి డబ్బులు తీసుకుంటున్నారని దక్షిణ 24 పరగణాల జిల్లా పత్తర్​ప్రతిమలో నిర్వహించిన బహిరంగ సభలో దుయ్యబట్టారు.

శాసనసభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మత గురువు పీర్జాదా అబ్బాస్ సిద్దిఖీ ప్రారంభించిన ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్​ను ఉద్దేశించి పరోక్షంగా ఈ విమర్శలు చేశారు మమత.

"భాజపా ఆదేశాల మేరకు రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ పుట్టుకొచ్చింది. మైనారిటీ ఓట్లను చీల్చి భాజపాకు సాయం చేయాలని చూస్తోంది. దయచేసి ఆ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయవద్దు."

- మమతా బెనర్జీ, బంగాల్​ సీఎం

కాంగ్రెస్​, సీపీఎం.. భాజపాతో ఒప్పంద కుదుర్చుకున్నాయని ఆరోపించారు మమత. పౌర చట్టం, ఎన్​పీఆర్​ బంగాల్​లో అమలు కాకుండా చూడడం, వివిధ వర్గాల మధ్య స్నేహ భావాన్ని పెంపొందించడం టీఎంసీకి మాత్రమే సాధ్యమని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'కేరళలో అధికారం లేదా 'కింగ్​మేకర్'​గా భాజపా'

మైనార్టీల ఓట్లు చీల్చడమే లక్ష్యంగా ఓ కొత్త రాజకీయ పార్టీకి భాజపా రహస్యంగా మద్దతిస్తోందని ఆరోపించారు బంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్​ అధినేత్రి మమతా బెనర్జీ. ఆ పార్టీ వ్యవస్థాపకుడు భాజపా నుంచి డబ్బులు తీసుకుంటున్నారని దక్షిణ 24 పరగణాల జిల్లా పత్తర్​ప్రతిమలో నిర్వహించిన బహిరంగ సభలో దుయ్యబట్టారు.

శాసనసభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మత గురువు పీర్జాదా అబ్బాస్ సిద్దిఖీ ప్రారంభించిన ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్​ను ఉద్దేశించి పరోక్షంగా ఈ విమర్శలు చేశారు మమత.

"భాజపా ఆదేశాల మేరకు రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ పుట్టుకొచ్చింది. మైనారిటీ ఓట్లను చీల్చి భాజపాకు సాయం చేయాలని చూస్తోంది. దయచేసి ఆ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయవద్దు."

- మమతా బెనర్జీ, బంగాల్​ సీఎం

కాంగ్రెస్​, సీపీఎం.. భాజపాతో ఒప్పంద కుదుర్చుకున్నాయని ఆరోపించారు మమత. పౌర చట్టం, ఎన్​పీఆర్​ బంగాల్​లో అమలు కాకుండా చూడడం, వివిధ వర్గాల మధ్య స్నేహ భావాన్ని పెంపొందించడం టీఎంసీకి మాత్రమే సాధ్యమని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'కేరళలో అధికారం లేదా 'కింగ్​మేకర్'​గా భాజపా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.