ETV Bharat / bharat

అయోధ్య రామయ్యకు అత్తారింటి కానుకలు- విల్లు, పట్టు బట్టలు సైతం!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 8, 2024, 7:26 PM IST

Updated : Jan 8, 2024, 9:01 PM IST

Nepalese Gifts To Ayodhya Sri Ram : అయోధ్య రాములోరికి అత్తగారింటి నుంచి అందమైన కానుకలు అందాయి. సీతాదేవి జన్మించిన నేపాల్‌ నుంచి వందలాది మంది అయోధ్యకు తరలివచ్చారు. ఈ సందర్భంగా శ్రీరాముడికి కోసం ఎన్నో కానుకలను వెంట తీసుకొచ్చారు. ఇందులో బంగారు, వెండి ఆభరణాలు కూడా ఉన్నాయి.

Nepalese Gifts To Ayodhya Sri Ram
Nepalese Gifts To Ayodhya Sri Ram
అయోధ్య రామయ్యకు అత్తారింటి కానుకలు- విల్లు, పట్టు బట్టలు సైతం!

Nepal People Gifts To Ayodhya Sri Ram : అయోధ్యలో అడుగుపెట్టనున్న రామయ్యకు దేశవ్యాప్తంగా భక్తులు లెక్కలేనన్ని కానుకలు సమర్పించుకుంటున్నారు. అయితే తన అత్తగారి రాజ్యం నుంచీ రామచంద్రునికి అందమైన కానుకలు అందాయి. సీతాదేవి జన్మించిన నేపాల్‌లోని సుమారు 800 మంది భక్తులు అయోధ్యకు 500 కానుక డబ్బాలతో తరలివచ్చారు. వారితోపాటు జానకిమాత జన్మించిన జనక్‌పుర్‌ ఆలయ పూజారి కూడా తరలివచ్చారు.

Nepalese Gifts To Ayodhya Sri Ram
నృత్యం చేస్తున్న నేపాల్ భక్తులు

"500 ఏళ్ల నాటి ఈ వివాదం చాలా కాలం తర్వాత సద్దుమణిగింది. జనవరి 22న ప్రాణ ప్రతిష్ట జరగుతున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఈ బంధం త్రేతాయుగానికి చెందినది. అప్పుడు రాముడికి, సీతమ్మకు స్వయంవర వివాహం జరిగింది. ఆ బంధం ఉంది కాబట్టే మేము ఇప్పుడు రాముడు ఇంటి ఏర్పాటుకు అవసరమైన వస్తువులను తీసుకొచ్చాం"
--రోషన్‌దాస్‌, జానక్‌పుర్‌ ఆలయ పూజారి

భక్తులు తీసుకొచ్చిన వాటిలో బంగారు, వెండి ఆభరణాలతో పాటు మిఠాయిలు, పండ్లు, డ్రైఫ్రూట్స్‌ కూడా ఉన్నాయి. అంతేకాక శ్రీరాముడి కోసం వెండి పాదరక్షలు, విల్లు, బాణం, కంఠహారాలు, గృహోపకరణాలు, పట్టు వస్త్రాల వంటి వస్తువులను భక్తులు బహుమతులుగా సమర్పించుకున్నారు.

Nepalese Gifts To Ayodhya Sri Ram
అయోధ్య రాముడికి కానుకగా విల్లు, ఆభరణాలు

త్రేతాయుగంలో సీతారాముల కల్యాణం సందర్భంగా జనకుడు నూతన వధూవరులకు ఎన్నో కానుకలు ఇచ్చాడని నేపాలీలు తెలిపారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తాము ఇప్పుడు ఈ కానుకలను తీసుకొచ్చామన్నారు. వీటితో రాముడు కొత్త ఇంటిని అలంకరించుకుంటారని చెప్పారు. కాగా నేపాల్‌ భక్తులు తీసుకొచ్చిన కానుకలను రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు అప్పగించారు.

Nepalese Gifts To Ayodhya Sri Ram
నేపాల్ భక్తులు తెచ్చిన కానుకలు

"అతను మా బావ. అతను మా ఆడబిడ్డకు భర్త. మేము చాలా సంతోషంగా ఉన్నాము. మేము మిథిలా నివాసులం. ఈరోజు మేం వారి దర్బార్‌కు వచ్చాము. వారి ఇల్లు నేడు రాజభవనంగా మారింది"
--జానకీ దేవి, భక్తురాలు

Ram Mandir Invitation : అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం సమీపిస్తున్న తరుణంలో సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి 22న జరగనున్న ప్రాణప్రతిష్ఠకు హాజరయ్యే అతిథులకు ఆహ్వాన పత్రికల పంపిణీ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ట్రస్ట్​కు సంబంధించిన ప్రతినిధులు అతిథుల వద్దకు స్వయగా వెళ్లి ఆహ్వాన పత్రికలు అందజేస్తున్నారు.

అల్లుడిగా రామయ్యకు అన్ని మర్యాదలు!- ఎక్కడో తెలుసా?

ఒకటిన్నర టన్నుల బరువుతో అయోధ్య రాముడి విగ్రహం- ఆ శిల్పిదే ఫైనల్​!

అయోధ్య రామయ్యకు అత్తారింటి కానుకలు- విల్లు, పట్టు బట్టలు సైతం!

Nepal People Gifts To Ayodhya Sri Ram : అయోధ్యలో అడుగుపెట్టనున్న రామయ్యకు దేశవ్యాప్తంగా భక్తులు లెక్కలేనన్ని కానుకలు సమర్పించుకుంటున్నారు. అయితే తన అత్తగారి రాజ్యం నుంచీ రామచంద్రునికి అందమైన కానుకలు అందాయి. సీతాదేవి జన్మించిన నేపాల్‌లోని సుమారు 800 మంది భక్తులు అయోధ్యకు 500 కానుక డబ్బాలతో తరలివచ్చారు. వారితోపాటు జానకిమాత జన్మించిన జనక్‌పుర్‌ ఆలయ పూజారి కూడా తరలివచ్చారు.

Nepalese Gifts To Ayodhya Sri Ram
నృత్యం చేస్తున్న నేపాల్ భక్తులు

"500 ఏళ్ల నాటి ఈ వివాదం చాలా కాలం తర్వాత సద్దుమణిగింది. జనవరి 22న ప్రాణ ప్రతిష్ట జరగుతున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఈ బంధం త్రేతాయుగానికి చెందినది. అప్పుడు రాముడికి, సీతమ్మకు స్వయంవర వివాహం జరిగింది. ఆ బంధం ఉంది కాబట్టే మేము ఇప్పుడు రాముడు ఇంటి ఏర్పాటుకు అవసరమైన వస్తువులను తీసుకొచ్చాం"
--రోషన్‌దాస్‌, జానక్‌పుర్‌ ఆలయ పూజారి

భక్తులు తీసుకొచ్చిన వాటిలో బంగారు, వెండి ఆభరణాలతో పాటు మిఠాయిలు, పండ్లు, డ్రైఫ్రూట్స్‌ కూడా ఉన్నాయి. అంతేకాక శ్రీరాముడి కోసం వెండి పాదరక్షలు, విల్లు, బాణం, కంఠహారాలు, గృహోపకరణాలు, పట్టు వస్త్రాల వంటి వస్తువులను భక్తులు బహుమతులుగా సమర్పించుకున్నారు.

Nepalese Gifts To Ayodhya Sri Ram
అయోధ్య రాముడికి కానుకగా విల్లు, ఆభరణాలు

త్రేతాయుగంలో సీతారాముల కల్యాణం సందర్భంగా జనకుడు నూతన వధూవరులకు ఎన్నో కానుకలు ఇచ్చాడని నేపాలీలు తెలిపారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తాము ఇప్పుడు ఈ కానుకలను తీసుకొచ్చామన్నారు. వీటితో రాముడు కొత్త ఇంటిని అలంకరించుకుంటారని చెప్పారు. కాగా నేపాల్‌ భక్తులు తీసుకొచ్చిన కానుకలను రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు అప్పగించారు.

Nepalese Gifts To Ayodhya Sri Ram
నేపాల్ భక్తులు తెచ్చిన కానుకలు

"అతను మా బావ. అతను మా ఆడబిడ్డకు భర్త. మేము చాలా సంతోషంగా ఉన్నాము. మేము మిథిలా నివాసులం. ఈరోజు మేం వారి దర్బార్‌కు వచ్చాము. వారి ఇల్లు నేడు రాజభవనంగా మారింది"
--జానకీ దేవి, భక్తురాలు

Ram Mandir Invitation : అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం సమీపిస్తున్న తరుణంలో సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి 22న జరగనున్న ప్రాణప్రతిష్ఠకు హాజరయ్యే అతిథులకు ఆహ్వాన పత్రికల పంపిణీ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ట్రస్ట్​కు సంబంధించిన ప్రతినిధులు అతిథుల వద్దకు స్వయగా వెళ్లి ఆహ్వాన పత్రికలు అందజేస్తున్నారు.

అల్లుడిగా రామయ్యకు అన్ని మర్యాదలు!- ఎక్కడో తెలుసా?

ఒకటిన్నర టన్నుల బరువుతో అయోధ్య రాముడి విగ్రహం- ఆ శిల్పిదే ఫైనల్​!

Last Updated : Jan 8, 2024, 9:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.