ETV Bharat / bharat

నీట్‌ పీజీ పరీక్ష 4 నెలల పాటు వాయిదా

author img

By

Published : May 3, 2021, 3:16 PM IST

Updated : May 3, 2021, 4:33 PM IST

medical students
వైద్య విద్యార్థులు

15:14 May 03

నీట్‌ పీజీ పరీక్ష 4 నెలల పాటు వాయిదా

కరోనా రెండో దఫా విజృంభణతో దేశంలోని కొన్ని చొట్ల వైద్య, ఆరోగ్య సిబ్బంది కొరత సహా.. అందుబాటులో ఉన్నవారిపై పనిభారం, ఒత్తిడి తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో.. మానవ వనరుల కొరతపై ఆదివారం సమీక్ష నిర్వహించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పెద్ద సంఖ్యలో అర్హత కలిగిన వైద్యులను అందుబాటులోకి తెచ్చేందుకు నీట్​-పీజీ పరీక్షను నాలుగు నెలల పాటు వాయిదా వేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.

కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయాలు..

  • పెద్ద సంఖ్యలో వైద్యులను అందుబాటులోకి తెచ్చేందుకు నీట్​-పీజీ పరీక్ష కనీసం నాలుగు నెలల పాటు వాయిదా. ఆగస్టు 31 వరకు పరీక్ష నిర్వహించకూడదని నిర్ణయం.
  • ఎంబీబీఎస్​ తుది సంవత్సరం చదువుతున్న విద్యార్థులను.. అధ్యాపకుల పర్యవేక్షణలో  టెలీకన్సల్టేషన్​, స్వల్ప లక్షణాలు కలిగిన కొవిడ్​ కేసుల చికిత్స వంటి సేవల్లో వినియోగించుకునేందుకు అంగీకారం.
  • మెడికల్​ ఇంటర్న్​లు వారి అధ్యాపకుల పర్యవేక్షణలో పని చేసేందుకు అనుమతి.
  • బీఎస్సీ, జీఎన్​ఎం ఉత్తీర్ణత సాధించిన నర్సులను సీనియర్​ వైద్యులు, నర్సుల పర్యవేక్షణలో.. ఫుల్​టైం కొవిడ్​ నర్సింగ్​ విధుల్లోకి తీసుకోవటం.
  • 100 రోజులు కొవిడ్​ విధుల్లో సేవలందించిన పీజీ వైద్య విద్యార్థులకు.. ప్రభుత్వ నియామకాల్లో ప్రాధాన్యం.
  • కొవిడ్​ సంబంధిత విధుల్లో సేవలందించే వైద్య విద్యార్థులు, నిపుణులకు వ్యాక్సిన్​ అందించటం.
  • 100 రోజులు కొవిడ్​ విధులను పూర్తి చేసిన వైద్య సిబ్బందికి ప్రధానమంత్రి విశిష్ట కొవిడ్​ నేషనల్​ సర్వీస్​ సమ్మాన్​ పురస్కారంతో సత్కారం.
  • కొవిడ్​ సేవల్లో పాల్గొన్న వైద్య విద్యార్థులు, నిపుణులందరికీ ప్రభుత్వ బీమా పథకం వర్తింపజేయటం.

15:14 May 03

నీట్‌ పీజీ పరీక్ష 4 నెలల పాటు వాయిదా

కరోనా రెండో దఫా విజృంభణతో దేశంలోని కొన్ని చొట్ల వైద్య, ఆరోగ్య సిబ్బంది కొరత సహా.. అందుబాటులో ఉన్నవారిపై పనిభారం, ఒత్తిడి తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో.. మానవ వనరుల కొరతపై ఆదివారం సమీక్ష నిర్వహించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పెద్ద సంఖ్యలో అర్హత కలిగిన వైద్యులను అందుబాటులోకి తెచ్చేందుకు నీట్​-పీజీ పరీక్షను నాలుగు నెలల పాటు వాయిదా వేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.

కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయాలు..

  • పెద్ద సంఖ్యలో వైద్యులను అందుబాటులోకి తెచ్చేందుకు నీట్​-పీజీ పరీక్ష కనీసం నాలుగు నెలల పాటు వాయిదా. ఆగస్టు 31 వరకు పరీక్ష నిర్వహించకూడదని నిర్ణయం.
  • ఎంబీబీఎస్​ తుది సంవత్సరం చదువుతున్న విద్యార్థులను.. అధ్యాపకుల పర్యవేక్షణలో  టెలీకన్సల్టేషన్​, స్వల్ప లక్షణాలు కలిగిన కొవిడ్​ కేసుల చికిత్స వంటి సేవల్లో వినియోగించుకునేందుకు అంగీకారం.
  • మెడికల్​ ఇంటర్న్​లు వారి అధ్యాపకుల పర్యవేక్షణలో పని చేసేందుకు అనుమతి.
  • బీఎస్సీ, జీఎన్​ఎం ఉత్తీర్ణత సాధించిన నర్సులను సీనియర్​ వైద్యులు, నర్సుల పర్యవేక్షణలో.. ఫుల్​టైం కొవిడ్​ నర్సింగ్​ విధుల్లోకి తీసుకోవటం.
  • 100 రోజులు కొవిడ్​ విధుల్లో సేవలందించిన పీజీ వైద్య విద్యార్థులకు.. ప్రభుత్వ నియామకాల్లో ప్రాధాన్యం.
  • కొవిడ్​ సంబంధిత విధుల్లో సేవలందించే వైద్య విద్యార్థులు, నిపుణులకు వ్యాక్సిన్​ అందించటం.
  • 100 రోజులు కొవిడ్​ విధులను పూర్తి చేసిన వైద్య సిబ్బందికి ప్రధానమంత్రి విశిష్ట కొవిడ్​ నేషనల్​ సర్వీస్​ సమ్మాన్​ పురస్కారంతో సత్కారం.
  • కొవిడ్​ సేవల్లో పాల్గొన్న వైద్య విద్యార్థులు, నిపుణులందరికీ ప్రభుత్వ బీమా పథకం వర్తింపజేయటం.
Last Updated : May 3, 2021, 4:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.