ETV Bharat / bharat

భర్త విలేజ్ సెక్రటరీ.. 'సర్పంచ్'గిరీ కోసం ముగ్గురు భార్యల రాజకీయం.. చివరకు..

author img

By

Published : Jun 20, 2022, 1:23 PM IST

ఆ ప్రభుత్వ ఉద్యోగికి ముగ్గురు భార్యలు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వారంతా నామినేషన్లు దాఖలు చేశారు. అయితే అతడు మాత్రం అధికారులకు ఇద్దరు భార్యల వివరాలే ఇచ్చాడు. దీంతో ఎన్నికల అధికారులు.. అది గుర్తించి అతడిని సస్పెండ్​ చేసే దిశగా చర్యలు ప్రారంభించారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

panchayat-polls
panchayat-polls

ముగ్గురు భార్యల 'రాజకీయం'.. వారి ముద్దుల మొగుడి ఉద్యోగానికే ఎసరు తెచ్చింది. మధ్యప్రదేశ్​లోని సింగ్​రౌలి జిల్లాకు చెందిన ఓ గ్రామ పంచాయతీ కార్యదర్శిపై ఎన్నికల అధికారులు చర్యలు మొదలుపెట్టారు. అతడి ముగ్గురు భార్యలు.. ఎన్నికల్లో పోటీ చేయడమే అందుకు కారణం. నిబంధనల ప్రకారం.. అధికారులకు ముగ్గురు భార్యల వివరాలు ఇవ్వాల్సి ఉండగా.. అతడు ఇద్దరి సమాచారం మాత్రమే ఇచ్చాడు. మూడో భార్య గురించి మాత్రం బయటపెట్టలేదు. దీంతో ఎన్నికల అధికారి అది గుర్తించి చర్యలు ప్రారంభించారు.

అసలేం జరిగిందంటే.. మధ్యప్రదేశ్​లో అతి త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే అందులో పోటీ చేయనున్న ప్రభుత్వ ఉద్యోగుల జీవిత భాగస్వాముల వివరాలను అధికారులు అందించమన్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శి సుఖ్​రామ్​ సింగ్​ ముగ్గురు భార్యలు నామినేషన్లను దాఖలు చేశారు. ముగ్గురూ.. భర్త పేరు దగ్గర సుఖ్​రామ్​సింగ్​ అనే రాశారు. అయితే అతడు మాత్రం అధికారులకు కుసుకలి సింగ్​, గీతా సింగ్​ వివరాలు మాత్రమే అందించాడు. తన మూడో భార్య అయిన ఊర్మిళా సింగ్​ గురించి ఎటువంటి వివరాలు ఇవ్వలేదు. దీంతో అది గుర్తించిన అధికారులు.. అతడిపై క్రమశిక్షణ రాహిత్య చర్యలు చేపట్టారు. సస్పెండ్​ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.

పిపర్​ఖండ్ గ్రామ సర్పంచ్​ పదవికి సుఖరామ్​సింగ్​ ఇద్దరు భార్యలు(కుసుకలి, గీత) ఒకరిపై ఒకరు పోటీ పడుతుండగా.. మరో భార్య ఊర్మిళ వార్డ్ మెంబర్ పదవి కోసం బరిలోకి దిగింది. అయితే సుఖ్​రామ్​ సింగ్​కు ఇదివరకే షోకాజ్​ నోటీసులు జారీ చేశామని అధికారులు తెలిపారు. అతడు వాటిపై ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడం వల్లే చర్యలు ప్రారంభించామని చెప్పారు.

ముగ్గురు భార్యల 'రాజకీయం'.. వారి ముద్దుల మొగుడి ఉద్యోగానికే ఎసరు తెచ్చింది. మధ్యప్రదేశ్​లోని సింగ్​రౌలి జిల్లాకు చెందిన ఓ గ్రామ పంచాయతీ కార్యదర్శిపై ఎన్నికల అధికారులు చర్యలు మొదలుపెట్టారు. అతడి ముగ్గురు భార్యలు.. ఎన్నికల్లో పోటీ చేయడమే అందుకు కారణం. నిబంధనల ప్రకారం.. అధికారులకు ముగ్గురు భార్యల వివరాలు ఇవ్వాల్సి ఉండగా.. అతడు ఇద్దరి సమాచారం మాత్రమే ఇచ్చాడు. మూడో భార్య గురించి మాత్రం బయటపెట్టలేదు. దీంతో ఎన్నికల అధికారి అది గుర్తించి చర్యలు ప్రారంభించారు.

అసలేం జరిగిందంటే.. మధ్యప్రదేశ్​లో అతి త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే అందులో పోటీ చేయనున్న ప్రభుత్వ ఉద్యోగుల జీవిత భాగస్వాముల వివరాలను అధికారులు అందించమన్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శి సుఖ్​రామ్​ సింగ్​ ముగ్గురు భార్యలు నామినేషన్లను దాఖలు చేశారు. ముగ్గురూ.. భర్త పేరు దగ్గర సుఖ్​రామ్​సింగ్​ అనే రాశారు. అయితే అతడు మాత్రం అధికారులకు కుసుకలి సింగ్​, గీతా సింగ్​ వివరాలు మాత్రమే అందించాడు. తన మూడో భార్య అయిన ఊర్మిళా సింగ్​ గురించి ఎటువంటి వివరాలు ఇవ్వలేదు. దీంతో అది గుర్తించిన అధికారులు.. అతడిపై క్రమశిక్షణ రాహిత్య చర్యలు చేపట్టారు. సస్పెండ్​ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.

పిపర్​ఖండ్ గ్రామ సర్పంచ్​ పదవికి సుఖరామ్​సింగ్​ ఇద్దరు భార్యలు(కుసుకలి, గీత) ఒకరిపై ఒకరు పోటీ పడుతుండగా.. మరో భార్య ఊర్మిళ వార్డ్ మెంబర్ పదవి కోసం బరిలోకి దిగింది. అయితే సుఖ్​రామ్​ సింగ్​కు ఇదివరకే షోకాజ్​ నోటీసులు జారీ చేశామని అధికారులు తెలిపారు. అతడు వాటిపై ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడం వల్లే చర్యలు ప్రారంభించామని చెప్పారు.

ఇవీ చదవండి: భర్తతో నిద్రిస్తున్న మైనర్​పై గ్యాంగ్​రేప్.. కత్తితో బెదిరించి..!

కత్తితో దుండగుడి దాడి.. ఎస్సై వీరోచిత పోరు.. వీడియో వైరల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.