ETV Bharat / bharat

పెళ్లి భోజనం తిని 150 మందికి అస్వస్థత

కర్ణాటకలో ఓ వివాహ వేడుకలో భోజనం చేసిన 150 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారందరినీ సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు.

author img

By

Published : Nov 13, 2021, 1:49 PM IST

Updated : Nov 13, 2021, 2:47 PM IST

More than 150 people fell ill after having wedding meal in Davanagere
పెళ్లి భోజనం తిని 150 మందికి అస్వస్థత

కర్ణాటక దావణగెరె జిల్లాలో ఓ వివాహ వేడుకకు హాజరై భోజనం చేసిన 150 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. హోన్నాలి తాలుకా హలెదేవరహోన్నలి గ్రామంలో ఈ ఘటన జరిగింది. పెళ్లి భోజనం చేసిన అనంతరం వీరంతా వాంతులు, విరేచనాలతో నీరసపడిపోయారు. అయితే ఆస్పత్రిలో చికిత్స అనంతరం చాలా మంది కోలుకున్నారు. మరికొంత మందికి వైద్యం అందిస్తున్నారు. 10 మందిని మెరుగైన చికిత్స కోసం శిమోగాలోని మెక్​ గాన్ ఆస్పత్రికి తరలించారు.

హోన్నాలి పోలీసులు వివాహం జరిగిన గ్రామాన్ని, ఆస్పత్రులను సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే 150 మంది అస్వస్థతకు గల అసలు కారణాలు తెలియాల్సి ఉంది.

కర్ణాటక దావణగెరె జిల్లాలో ఓ వివాహ వేడుకకు హాజరై భోజనం చేసిన 150 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. హోన్నాలి తాలుకా హలెదేవరహోన్నలి గ్రామంలో ఈ ఘటన జరిగింది. పెళ్లి భోజనం చేసిన అనంతరం వీరంతా వాంతులు, విరేచనాలతో నీరసపడిపోయారు. అయితే ఆస్పత్రిలో చికిత్స అనంతరం చాలా మంది కోలుకున్నారు. మరికొంత మందికి వైద్యం అందిస్తున్నారు. 10 మందిని మెరుగైన చికిత్స కోసం శిమోగాలోని మెక్​ గాన్ ఆస్పత్రికి తరలించారు.

హోన్నాలి పోలీసులు వివాహం జరిగిన గ్రామాన్ని, ఆస్పత్రులను సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే 150 మంది అస్వస్థతకు గల అసలు కారణాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: 'నాన్-వెజ్ ఫుడ్​ను బయటకు కనిపించేలా ఉంచొద్దు!'

Last Updated : Nov 13, 2021, 2:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.