ETV Bharat / bharat

మంకీపాక్స్ కలవరం.. ఈ జాగ్రత్తలు పాటిస్తే 99శాతం సేఫ్!

Monkeypox treatment: దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటం కలవరపెడుతోంది. అనుమానిత కేసులు సైతం వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. మరి మంకీపాక్స్​ను అడ్డుకోవడం ఎలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?

author img

By

Published : Jul 24, 2022, 10:02 PM IST

MONKEYPOX PRECAUTIONs
MONKEYPOX PRECAUTIONs

MONKEYPOX PRECAUTIONS: దేశంలో మంకీపాక్స్‌ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే నలుగురిలో ఈ వైరస్‌ను గుర్తించారు. ఆదివారం దిల్లీలో బయటపడిన కేసులో.. బాధితుడు ఎలాంటి విదేశీ ప్రయాణాలు చేయలేదని తేలడం ఆందోళన కలిగించే అంశం. ఈ నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మంకీపాక్స్‌ కట్టడికి కరోనా తరహాలోనే జాగ్రత్తలు పాటించాలని వెల్లడిస్తున్నారు. దిల్లీలోని ప్రముఖ లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ ఆసుపత్రి వైద్యుడు డా.సురేశ్‌ కుమార్‌ ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. మంకీపాక్స్‌ను అడ్డుకోవాలంటే కరోనా తరహాలోనే మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని తెలిపారు.

మంకీపాక్స్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని డా.సురేశ్‌ సూచించారు. విదేశీ ప్రయాణాలు చేసినవారికి ఈ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కవ అని, వారు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అన్ని జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. అన్ని జాగ్రత్తలు పాటిస్తే 99శాతం ఈ వైరస్‌ను నివారించవచ్చని తెలిపారు.

పశ్చిమ ఆఫ్రికాలో మొదలైన ఈ మంకీపాక్స్‌ ఇప్పటివరకు 75 దేశాలకు విస్తరించింది. 16వేల మంది ఈ వైరస్ బారినపడ్డారు. కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌ను గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది. సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనోమ్‌కు నిపుణుల కమిటీ సూచించిన నేపథ్యంలో శనివారం ఈ ప్రకటన వెలువడింది.

ఇదీ చదవండి:

MONKEYPOX PRECAUTIONS: దేశంలో మంకీపాక్స్‌ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే నలుగురిలో ఈ వైరస్‌ను గుర్తించారు. ఆదివారం దిల్లీలో బయటపడిన కేసులో.. బాధితుడు ఎలాంటి విదేశీ ప్రయాణాలు చేయలేదని తేలడం ఆందోళన కలిగించే అంశం. ఈ నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మంకీపాక్స్‌ కట్టడికి కరోనా తరహాలోనే జాగ్రత్తలు పాటించాలని వెల్లడిస్తున్నారు. దిల్లీలోని ప్రముఖ లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ ఆసుపత్రి వైద్యుడు డా.సురేశ్‌ కుమార్‌ ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. మంకీపాక్స్‌ను అడ్డుకోవాలంటే కరోనా తరహాలోనే మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని తెలిపారు.

మంకీపాక్స్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని డా.సురేశ్‌ సూచించారు. విదేశీ ప్రయాణాలు చేసినవారికి ఈ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కవ అని, వారు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అన్ని జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. అన్ని జాగ్రత్తలు పాటిస్తే 99శాతం ఈ వైరస్‌ను నివారించవచ్చని తెలిపారు.

పశ్చిమ ఆఫ్రికాలో మొదలైన ఈ మంకీపాక్స్‌ ఇప్పటివరకు 75 దేశాలకు విస్తరించింది. 16వేల మంది ఈ వైరస్ బారినపడ్డారు. కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌ను గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది. సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనోమ్‌కు నిపుణుల కమిటీ సూచించిన నేపథ్యంలో శనివారం ఈ ప్రకటన వెలువడింది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.