ETV Bharat / bharat

Modi Whatsapp Channel : వాట్సాప్​ ఛానెల్​లోకి మోదీ ఎంట్రీ.. కొత్త పార్లమెంట్​లో ఫొటోతో పోస్ట్​

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 19, 2023, 6:33 PM IST

Updated : Sep 19, 2023, 6:41 PM IST

Modi Whatsapp Channel : భారత ప్రధానమంత్రికి సంబంధించిన అన్ని అప్​డేట్లను ఇకపై వాట్సాప్​ వినియోగాదారులు తెలుసుకోవచ్చు. తాజాగా మాతృ సంస్థ మెటా తీసుకువచ్చిన ఛానెల్స్​లో ప్రధాని మోదీ చేరారు. ఓ కొత్త ఫొటోను సైతం పంచుకున్నారు.

modi whatsapp channel
modi whatsapp channel

Modi Whatsapp Channel : ప్రముఖ సోషల్ మీడియా సంస్థ వాట్సాప్ తీసుకువచ్చిన 'ఛానెల్స్​'లో చేరారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దీంతో ప్రధానికి సంబంధించిన సమాచారన్నంతా వాట్సాప్ వినియోగదారులు సులభంగా తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ఈ సందర్భంగా తొలిసారి పోస్ట్ చేసిన ప్రధాని మోదీ.. వాట్సాప్ కమ్యూనిటీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. 'మీతో కలిసేందుకు మరింత దగ్గరవుతున్నా'నంటూ.. కొత్త పార్లమెంట్​లో దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేశారు మోదీ. అంతకుముందు ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ కూడా వాట్సాప్​లో జాయిన్ అయ్యారు.

Modi Whatsapp Channel
మోదీ పోస్ట్ చేసిన ఫొటో

ట్విట్టర్​లో మోదీనే టాప్​
దేశంలో అత్యధికంగా సోషల్​ మీడియా ఫాలోవర్లు ఉన్న వ్యక్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనసాగుతున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్​సైట్​ X (ట్విట్టర్​)లో అత్యధిక ఫాలోవర్స్ జాబితాలో మొదటి రెండు స్థానాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నారు. మోదీ ట్విట్టర్​ ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 91.5 మిలియన్లు(9 కోట్ల 15 లక్షలు) ఉండగా.. ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ) అధికారిక ట్విట్టర్ ఖాతాను 54 మిలియన్ల (5.4 కోట్ల) మంది ఫాలో చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్ ఖాతాకు 33.7 మిలియన్ (3.37 కోట్ల మంది) ఫాలోవర్స్ ఉన్నారు. మూడో స్థానంలో ఉన్న ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ ఫాలోవర్స్ సంఖ్య ఇటీవల 26 మిలియన్ (2.6 కోట్లు) దాటింది.

Whatsapp Channels India : వాట్సాప్‌ ఇటీవలే ఛానెల్స్‌ సదుపాయాన్ని తీసుకొచ్చింది. భారత్‌ సహా 150 దేశాల్లో ఫీచర్‌ను ప్రారంభించినట్లు మాతృ సంస్థ మెటా వెల్లడించింది. ఇప్పటికే చాలా మందికి ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. త్వరలో మిగిలిన వారికీ రానుంది.

వాట్సాప్‌ ఛానెల్‌ అంటే?
ప్రస్తుతం వాట్సాప్‌ను పరస్పర కమ్యూనికేషన్‌ కోసం మాత్రమే వాడేవాళ్లం. ఆ తర్వాత గ్రూప్స్‌ వచ్చాయి. తాజాగా ఇప్పుడు కొత్తగా ఛానెల్స్‌ ఫీచర్​ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్‌ ద్వారా మీకు నచ్చిన వ్యక్తులు, సంస్థలను ఫాలో అయ్యి వాట్సాప్‌లోనే ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ తెలుసుకునే అవకాశం ఉంటుంది. అచ్చం ట్విట్టర్‌, ఇన్‌స్టాలో ఎలాగైతే మనకు నచ్చిన వారిని ఫాలో అవుతున్నామో అలా అన్నమాట. కావాలనుకుంటే ఈ అప్‌డేట్‌ను ఇతరులతో పంచుకోవచ్చు. మీరు ఫాలో అయినంత మాత్రానా మీ ఫోన్‌ నంబర్‌ ఎవరికీ కనిపించదు.

Yogi Adityanath Twitter Followers : పవర్​ఫుల్​ 'యోగి'.. మోదీ, షా తర్వాత ప్లేస్ ఆయనదే.. ఇదిగో కొత్త లెక్క!

మోదీ సోషల్​ మీడియా ఖాతాలు దక్కేది వారికే...

Modi Whatsapp Channel : ప్రముఖ సోషల్ మీడియా సంస్థ వాట్సాప్ తీసుకువచ్చిన 'ఛానెల్స్​'లో చేరారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దీంతో ప్రధానికి సంబంధించిన సమాచారన్నంతా వాట్సాప్ వినియోగదారులు సులభంగా తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ఈ సందర్భంగా తొలిసారి పోస్ట్ చేసిన ప్రధాని మోదీ.. వాట్సాప్ కమ్యూనిటీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. 'మీతో కలిసేందుకు మరింత దగ్గరవుతున్నా'నంటూ.. కొత్త పార్లమెంట్​లో దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేశారు మోదీ. అంతకుముందు ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ కూడా వాట్సాప్​లో జాయిన్ అయ్యారు.

Modi Whatsapp Channel
మోదీ పోస్ట్ చేసిన ఫొటో

ట్విట్టర్​లో మోదీనే టాప్​
దేశంలో అత్యధికంగా సోషల్​ మీడియా ఫాలోవర్లు ఉన్న వ్యక్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనసాగుతున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్​సైట్​ X (ట్విట్టర్​)లో అత్యధిక ఫాలోవర్స్ జాబితాలో మొదటి రెండు స్థానాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నారు. మోదీ ట్విట్టర్​ ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 91.5 మిలియన్లు(9 కోట్ల 15 లక్షలు) ఉండగా.. ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ) అధికారిక ట్విట్టర్ ఖాతాను 54 మిలియన్ల (5.4 కోట్ల) మంది ఫాలో చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్ ఖాతాకు 33.7 మిలియన్ (3.37 కోట్ల మంది) ఫాలోవర్స్ ఉన్నారు. మూడో స్థానంలో ఉన్న ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ ఫాలోవర్స్ సంఖ్య ఇటీవల 26 మిలియన్ (2.6 కోట్లు) దాటింది.

Whatsapp Channels India : వాట్సాప్‌ ఇటీవలే ఛానెల్స్‌ సదుపాయాన్ని తీసుకొచ్చింది. భారత్‌ సహా 150 దేశాల్లో ఫీచర్‌ను ప్రారంభించినట్లు మాతృ సంస్థ మెటా వెల్లడించింది. ఇప్పటికే చాలా మందికి ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. త్వరలో మిగిలిన వారికీ రానుంది.

వాట్సాప్‌ ఛానెల్‌ అంటే?
ప్రస్తుతం వాట్సాప్‌ను పరస్పర కమ్యూనికేషన్‌ కోసం మాత్రమే వాడేవాళ్లం. ఆ తర్వాత గ్రూప్స్‌ వచ్చాయి. తాజాగా ఇప్పుడు కొత్తగా ఛానెల్స్‌ ఫీచర్​ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్‌ ద్వారా మీకు నచ్చిన వ్యక్తులు, సంస్థలను ఫాలో అయ్యి వాట్సాప్‌లోనే ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ తెలుసుకునే అవకాశం ఉంటుంది. అచ్చం ట్విట్టర్‌, ఇన్‌స్టాలో ఎలాగైతే మనకు నచ్చిన వారిని ఫాలో అవుతున్నామో అలా అన్నమాట. కావాలనుకుంటే ఈ అప్‌డేట్‌ను ఇతరులతో పంచుకోవచ్చు. మీరు ఫాలో అయినంత మాత్రానా మీ ఫోన్‌ నంబర్‌ ఎవరికీ కనిపించదు.

Yogi Adityanath Twitter Followers : పవర్​ఫుల్​ 'యోగి'.. మోదీ, షా తర్వాత ప్లేస్ ఆయనదే.. ఇదిగో కొత్త లెక్క!

మోదీ సోషల్​ మీడియా ఖాతాలు దక్కేది వారికే...

Last Updated : Sep 19, 2023, 6:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.