ETV Bharat / bharat

పంజాబ్ టూర్​లో మోదీకి మరో చేదు అనుభవం!

author img

By

Published : Feb 14, 2022, 7:39 PM IST

Modi Punjab tour: పంజాబ్​లో పర్యటించిన మోదీ.. అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఓ మందిరాన్ని దర్శించుకోలేకపోయారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ బహిరంగ సభలో వెల్లడించారు.

modi punjab tour
మోదీ పంజాబ్ టూర్

Modi Punjab tour: పంజాబ్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. గత నెలలో ఫిరోజ్​పుర్ పర్యటనలో భద్రతా లోపం తీవ్ర దుమారం రేపగా.. తాజాగా అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ప్రార్థనాస్థలాన్ని దర్శించుకోకుండానే వెనుదిరిగారు.

PM Modi in Jalandhar:

పంజాబ్ పర్యటనకు వచ్చిన మోదీ.. జలంధర్​లోని దేవీ తలాబ్ మందిరాన్ని దర్శించుకునేందుకు వెళ్లారు. అయితే అధికారులు తగిన ఏర్పాట్లు చేయలేదని, ఫలితంగా మందిరాన్ని దర్శించుకోలేకపోయానని మోదీ చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ పరిస్థితి ఈ రకంగా ఉందని ధ్వజమెత్తారు. జలంధర్​కు మరోసారి వస్తానని, దేవిని తప్పక దర్శించుకుంటానని బహిరంగ సభలో మోదీ స్పష్టం చేశారు.

"దేవి తలాబ్ మందిరాన్ని దర్శించుకోవాలనేది నా కోరిక. కానీ, ఇక్కడి పోలీసులు, యంత్రాంగం అందుకు తగిన ఏర్పాట్లు చేయలేమని చెప్పాయి. హెలికాప్టర్​లో వెళ్లిపోవాలని సూచించాయి. ఇలా ఉంది ఇక్కడి ప్రభుత్వ పరిస్థితి. కానీ, నేను మళ్లీ వచ్చి మందిరాన్ని దర్శించుకుంటాను."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

అంతకుముందు, జనవరి 5న మోదీ పంజాబ్​లో పర్యటించారు. ఫిరోజ్​పుర్​లో నిరసనకారులు అడ్డగించడం వల్ల కాన్వాయ్​లో చిక్కుకుపోయిన మోదీ.. ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండానే దిల్లీకి తిరుగుపయనమయ్యారు.

Modi Punjab Campaign

రాష్ట్రంలో భాజపా నేతృత్వంలోని కూటమి విజయం సాధిస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఆ తర్వాత పంజాబ్​లో అభివృద్ధి నూతన శకం మొదలవుతుందని చెప్పారు. నవభారత్ ప్రతిజ్ఞతో దేశం ముందుకెళ్తోందని, నవ బంజాబ్ సాకారమైనప్పుడే దేశ ప్రజల ప్రతిజ్ఞ నెరవేరుతుందని అన్నారు. నూతన పంజాబ్​లో ప్రతి దళితుడికీ గౌరవం లభిస్తుందని, అందరికీ సమాన అవకాశాలు ఉంటాయని వివరించారు. అవినీతికి ఆస్కారం లేదని అన్నారు.

ఈ సందర్భంగా విపక్షాలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు ఉందని, అలాంటి వారు రాష్ట్రానికేం చేస్తారని అన్నారు. పంజాబ్​కు వచ్చి కొందరు పచ్చి అబద్దాలు చెబుతున్నారని దిల్లీ సీఎం కేజ్రీవాల్ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. పంజాబ్​ను మాదకద్రవ్యాలు లేని రాష్ట్రంగా మార్చుతామని చెబుతున్న వారు.. సొంత రాష్ట్రంలో మాత్రం భారీగా మద్యం దుకాణాలను తెరుస్తున్నారని ఆక్షేపించారు.

'నన్ను అడ్డుకున్నారు!'

మరోవైపు, మోదీ పర్యటన వల్ల తాను రాహుల్ గాంధీ సభకు హాజరు కాలేకపోయానని పంజాబ్ సీఎం చరణ్​జిత్ సింగ్ చన్నీ ఆరోపించారు. 'ఉదయం 11 గంటలకు నేను ఉనాకు చేరుకున్నా. హోషియార్​పుర్​ వెళ్లేందుకు నా హెలికాప్టర్​కు అనుమతి నిరాకరించారు. మోదీ వెళ్తున్నారని ఆ ప్రాంతాన్ని నో ఫ్లై జోన్​గా ప్రకటించారు. అందుకే రాహుల్ గాంధీ సభకు హాజరుకాలేకపోయాను' అని చన్నీ వివరించారు.

యూపీ సభలో మోదీ..

Modi UP news: అటు, ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్ దేహత్​లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోదీ.. ముమ్మారు తలాక్​కు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టం ద్వారా ముస్లిం మహిళలకు ప్రయోజనం కలిగిందని అన్నారు. ఈ చట్టం వేలాది కుటుంబాలను కాపాడిందని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులను మెరుగుపర్చడం ద్వారా ముస్లిం బాలికలు.. ప్రశాంతంగా స్కూల్​కు వెళ్లగలుగుతున్నారని తెలిపారు. హిందూ ఓట్లను చీల్చేందుకే గోవాలో పోటీ చేస్తున్నామన్న టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా వ్యాఖ్యలపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం అంటే ఇదేనా అంటూ నిలదీశారు. ప్రతి ఎన్నికలకు కొత్త కూటమిని ఏర్పాటు చేస్తున్నారని సమాజ్​వాదీ లక్ష్యంగా ధ్వజమెత్తారు మోదీ. ఫలితాలు వెలువడిన తర్వాత వారి మధ్య గొడవలు తథ్యమని చెప్పుకొచ్చారు.

PM Modi rally in Kanpur Dehat
ఉత్తర్​ప్రదేశ్ సభలో మోదీ

ఇదీ చదవండి: 'ఆపరేషన్ దిల్లీ' వేగవంతం.. త్వరలో ఆ సీఎంల సమావేశం!

Modi Punjab tour: పంజాబ్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. గత నెలలో ఫిరోజ్​పుర్ పర్యటనలో భద్రతా లోపం తీవ్ర దుమారం రేపగా.. తాజాగా అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ప్రార్థనాస్థలాన్ని దర్శించుకోకుండానే వెనుదిరిగారు.

PM Modi in Jalandhar:

పంజాబ్ పర్యటనకు వచ్చిన మోదీ.. జలంధర్​లోని దేవీ తలాబ్ మందిరాన్ని దర్శించుకునేందుకు వెళ్లారు. అయితే అధికారులు తగిన ఏర్పాట్లు చేయలేదని, ఫలితంగా మందిరాన్ని దర్శించుకోలేకపోయానని మోదీ చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ పరిస్థితి ఈ రకంగా ఉందని ధ్వజమెత్తారు. జలంధర్​కు మరోసారి వస్తానని, దేవిని తప్పక దర్శించుకుంటానని బహిరంగ సభలో మోదీ స్పష్టం చేశారు.

"దేవి తలాబ్ మందిరాన్ని దర్శించుకోవాలనేది నా కోరిక. కానీ, ఇక్కడి పోలీసులు, యంత్రాంగం అందుకు తగిన ఏర్పాట్లు చేయలేమని చెప్పాయి. హెలికాప్టర్​లో వెళ్లిపోవాలని సూచించాయి. ఇలా ఉంది ఇక్కడి ప్రభుత్వ పరిస్థితి. కానీ, నేను మళ్లీ వచ్చి మందిరాన్ని దర్శించుకుంటాను."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

అంతకుముందు, జనవరి 5న మోదీ పంజాబ్​లో పర్యటించారు. ఫిరోజ్​పుర్​లో నిరసనకారులు అడ్డగించడం వల్ల కాన్వాయ్​లో చిక్కుకుపోయిన మోదీ.. ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండానే దిల్లీకి తిరుగుపయనమయ్యారు.

Modi Punjab Campaign

రాష్ట్రంలో భాజపా నేతృత్వంలోని కూటమి విజయం సాధిస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఆ తర్వాత పంజాబ్​లో అభివృద్ధి నూతన శకం మొదలవుతుందని చెప్పారు. నవభారత్ ప్రతిజ్ఞతో దేశం ముందుకెళ్తోందని, నవ బంజాబ్ సాకారమైనప్పుడే దేశ ప్రజల ప్రతిజ్ఞ నెరవేరుతుందని అన్నారు. నూతన పంజాబ్​లో ప్రతి దళితుడికీ గౌరవం లభిస్తుందని, అందరికీ సమాన అవకాశాలు ఉంటాయని వివరించారు. అవినీతికి ఆస్కారం లేదని అన్నారు.

ఈ సందర్భంగా విపక్షాలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు ఉందని, అలాంటి వారు రాష్ట్రానికేం చేస్తారని అన్నారు. పంజాబ్​కు వచ్చి కొందరు పచ్చి అబద్దాలు చెబుతున్నారని దిల్లీ సీఎం కేజ్రీవాల్ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. పంజాబ్​ను మాదకద్రవ్యాలు లేని రాష్ట్రంగా మార్చుతామని చెబుతున్న వారు.. సొంత రాష్ట్రంలో మాత్రం భారీగా మద్యం దుకాణాలను తెరుస్తున్నారని ఆక్షేపించారు.

'నన్ను అడ్డుకున్నారు!'

మరోవైపు, మోదీ పర్యటన వల్ల తాను రాహుల్ గాంధీ సభకు హాజరు కాలేకపోయానని పంజాబ్ సీఎం చరణ్​జిత్ సింగ్ చన్నీ ఆరోపించారు. 'ఉదయం 11 గంటలకు నేను ఉనాకు చేరుకున్నా. హోషియార్​పుర్​ వెళ్లేందుకు నా హెలికాప్టర్​కు అనుమతి నిరాకరించారు. మోదీ వెళ్తున్నారని ఆ ప్రాంతాన్ని నో ఫ్లై జోన్​గా ప్రకటించారు. అందుకే రాహుల్ గాంధీ సభకు హాజరుకాలేకపోయాను' అని చన్నీ వివరించారు.

యూపీ సభలో మోదీ..

Modi UP news: అటు, ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్ దేహత్​లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోదీ.. ముమ్మారు తలాక్​కు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టం ద్వారా ముస్లిం మహిళలకు ప్రయోజనం కలిగిందని అన్నారు. ఈ చట్టం వేలాది కుటుంబాలను కాపాడిందని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులను మెరుగుపర్చడం ద్వారా ముస్లిం బాలికలు.. ప్రశాంతంగా స్కూల్​కు వెళ్లగలుగుతున్నారని తెలిపారు. హిందూ ఓట్లను చీల్చేందుకే గోవాలో పోటీ చేస్తున్నామన్న టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా వ్యాఖ్యలపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం అంటే ఇదేనా అంటూ నిలదీశారు. ప్రతి ఎన్నికలకు కొత్త కూటమిని ఏర్పాటు చేస్తున్నారని సమాజ్​వాదీ లక్ష్యంగా ధ్వజమెత్తారు మోదీ. ఫలితాలు వెలువడిన తర్వాత వారి మధ్య గొడవలు తథ్యమని చెప్పుకొచ్చారు.

PM Modi rally in Kanpur Dehat
ఉత్తర్​ప్రదేశ్ సభలో మోదీ

ఇదీ చదవండి: 'ఆపరేషన్ దిల్లీ' వేగవంతం.. త్వరలో ఆ సీఎంల సమావేశం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.