ETV Bharat / bharat

ఒకే కారుతో మూడు రాష్ట్రాల్లో బీభత్సం- చివరకు... - baricades break by car

ఓ వ్యక్తి కారులో అతివేగంగా దూసుకొచ్చి.. 3 రాష్ట్రాల్లోని 9 ప్రాంతాల్లో బారికేడ్లను ధ్వంసం చేశాడు. అడ్డొచ్చిన పోలీసు సిబ్బందినీ ఢీకొట్టేందుకు యత్నించాడు. చివరకు పోలీసులు అతడిపై కాల్పులు జరిపి, అదుపులోకి తీసుకున్నారు.

breaking the barricades
కారులో దూసుకొచ్చి.. బారికేడ్లను ధ్వంసం చేసి..
author img

By

Published : May 12, 2021, 7:08 PM IST

Updated : May 12, 2021, 7:40 PM IST

బీభత్సం సృష్టించిన కారు

మూడు రాష్ట్రాల్లోని 9 ప్రాంతాల్లో బారికేడ్లను కారుతో వేగంగా ఢీకొట్టి ధ్వంసం చేసిన ఓ వ్యక్తిపై ​ పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​ సుక్మా జిల్లాలో జరిగింది.

ఆంధ్రప్రదేశ్​ నుంచి..

"తొలుత ఆంధ్రప్రదేశ్​ చింటూరులో ఆ వ్యక్తి బారికేడ్​ను ధ్వంసం చేశాడు. పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్​గఢ్​ వైపు వెళ్లాడని సరిహద్దుల్లోని పోలీస్​ స్టేషన్లకు సమాచారం​ అందింది. ఆ వివరాల ఆధారంగా సుక్మా జిల్లాలో నిందితుడిని అరెస్టు చేశాము" అని వివరించారు సుక్మా ఏఎస్​పీ సచీంద్ర చౌబే.

breaking the barricades
బారికేడ్లను ధ్వంసం చేసి వెళ్తున్న కారు

9 ప్రాంతాల్లో..

నిందితుడిని మహారాష్ట్ర అమరావతి జిల్లాకు చెందిన హనుమాన్​ మోహిత్​గా పోలీసులు గుర్తించారు. ఛత్తీస్​గఢ్​, ఒడిశా, ఆంధ్రప్రదేశ్​లోని 9 ప్రాంతాల్లో అతడు బారికేడ్లను ధ్వంసం చేశాడని చెప్పారు. చింటూరు(ఆంధ్రప్రదేశ్), మోటు(ఒడిశా) సరిహద్దుల్లో బారికేడ్లను ఢీకొట్టి.. ఛత్తీస్​ఢ్​లోని దోర్నపల్​ చెక్​పోస్టును అతడు దాటి వెళ్లాడని పేర్కొన్నారు. అనంతరం.. ఎర్రబోరమ్​, ఇంజ్రామ్ చెక్​పోస్టులనూ ధ్వంసం చేశాడని చెప్పారు.

breaking the barricades
కారు ఢీకొనగా.. గాయపడ్డ పోలీసు సిబ్బంది

సుక్మాలో నిందితుడు తన కారుతో పోలీసు సిబ్బందిని ఢీ కొట్టేందు యత్నించాడు. ఈ క్రమంలో ఓ జవాను గాయపడగా.. నిందితుడిపైకి కాల్పులు జరిపాడు. తూటా తగిలి గాయపడిన అతడిని అదుపులోకి తీసుకుని, కోంటాలోని కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి: వరుసగా రెండోరోజు తగ్గిన యాక్టివ్ కేసులు

ఇదీ చూడండి: మెడికల్​ ప్రాక్టీస్​ చేసేందుకు వారికి కేంద్రం అనుమతి

బీభత్సం సృష్టించిన కారు

మూడు రాష్ట్రాల్లోని 9 ప్రాంతాల్లో బారికేడ్లను కారుతో వేగంగా ఢీకొట్టి ధ్వంసం చేసిన ఓ వ్యక్తిపై ​ పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​ సుక్మా జిల్లాలో జరిగింది.

ఆంధ్రప్రదేశ్​ నుంచి..

"తొలుత ఆంధ్రప్రదేశ్​ చింటూరులో ఆ వ్యక్తి బారికేడ్​ను ధ్వంసం చేశాడు. పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్​గఢ్​ వైపు వెళ్లాడని సరిహద్దుల్లోని పోలీస్​ స్టేషన్లకు సమాచారం​ అందింది. ఆ వివరాల ఆధారంగా సుక్మా జిల్లాలో నిందితుడిని అరెస్టు చేశాము" అని వివరించారు సుక్మా ఏఎస్​పీ సచీంద్ర చౌబే.

breaking the barricades
బారికేడ్లను ధ్వంసం చేసి వెళ్తున్న కారు

9 ప్రాంతాల్లో..

నిందితుడిని మహారాష్ట్ర అమరావతి జిల్లాకు చెందిన హనుమాన్​ మోహిత్​గా పోలీసులు గుర్తించారు. ఛత్తీస్​గఢ్​, ఒడిశా, ఆంధ్రప్రదేశ్​లోని 9 ప్రాంతాల్లో అతడు బారికేడ్లను ధ్వంసం చేశాడని చెప్పారు. చింటూరు(ఆంధ్రప్రదేశ్), మోటు(ఒడిశా) సరిహద్దుల్లో బారికేడ్లను ఢీకొట్టి.. ఛత్తీస్​ఢ్​లోని దోర్నపల్​ చెక్​పోస్టును అతడు దాటి వెళ్లాడని పేర్కొన్నారు. అనంతరం.. ఎర్రబోరమ్​, ఇంజ్రామ్ చెక్​పోస్టులనూ ధ్వంసం చేశాడని చెప్పారు.

breaking the barricades
కారు ఢీకొనగా.. గాయపడ్డ పోలీసు సిబ్బంది

సుక్మాలో నిందితుడు తన కారుతో పోలీసు సిబ్బందిని ఢీ కొట్టేందు యత్నించాడు. ఈ క్రమంలో ఓ జవాను గాయపడగా.. నిందితుడిపైకి కాల్పులు జరిపాడు. తూటా తగిలి గాయపడిన అతడిని అదుపులోకి తీసుకుని, కోంటాలోని కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి: వరుసగా రెండోరోజు తగ్గిన యాక్టివ్ కేసులు

ఇదీ చూడండి: మెడికల్​ ప్రాక్టీస్​ చేసేందుకు వారికి కేంద్రం అనుమతి

Last Updated : May 12, 2021, 7:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.