ETV Bharat / bharat

పోలీసులు లంచం అడిగారని వ్యక్తి ఆత్మహత్య!

author img

By

Published : Apr 13, 2021, 7:56 AM IST

అపహరణకు గురైన కుమార్తెను వెతకడానికి పోలీసులు రూ.లక్ష లంచం అడిగారని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

suicide
ఆత్మహత్య

పోలీసులు లంచం అడిగారని ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. అపహరణ​కు గురైన తన కుమార్తెను వెతకడానికి పోలీసులు డబ్బు డిమాండ్​ చేసినందుకే అతను ఉరి వేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఉత్తర్​ప్రదేశ్​ బరేలీ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

ఇదీ జరిగింది

బరేలి జిల్లాలో మవు చాంద్​పుర్​కి చెందిన శిశుపాల్​ కుమార్తె ఇటీవల అపహరణకు గురైంది. దీంతో పెళ్లి కావాల్సిన తన కుమార్తెను వెతకమని రామ్​నగర్​ పోలీసులను ఆశ్రయించాడు శిశుపాల్​. అయితే అందుకు రూ.లక్ష లంచం ఇవ్వాలని డిమాండ్​ చేశారు స్టేషన్​ ఇంచార్జ్​గా ఉన్న రామ్​ రతన్​ సింగ్​. దీంతో మనస్తాపానికి గురైన ​అతను ఉరి వేసుకున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న రతన్​ సింగ్​.. ఘటనా స్థలానికి చేరుకున్నాడు. అతను సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకుని.. దాన్ని చించి జేబులో పెట్టుకున్నాడు. అయితే గ్రామస్థులు రతన్​సింగ్​ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

కిడ్నాప్​ కేసు నమోదు

శిశుపాల్​ ఫిర్యాదు మేరకు ఏప్రిల్​ 9న అవలా పోలీస్ స్టేషన్​లో అపహరణ కేసు నమోదు చేశారు పోలీసులు. ఇందులో బంటి, ముకేశ్​, దినేశ్​ అనే ముగ్గరు వ్యక్తులు తన కుమార్తెను ద్విచక్ర వాహనంపై అపహరించి తీసుకెళ్లినట్లు ఎఫ్‌ఐఆర్‌లో శిశుపాల్ ఆరోపించారు.

ఇదీ చూడండి: లోయలో పడిన మినీ బస్సు- ఆరుగురు మృతి

పోలీసులు లంచం అడిగారని ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. అపహరణ​కు గురైన తన కుమార్తెను వెతకడానికి పోలీసులు డబ్బు డిమాండ్​ చేసినందుకే అతను ఉరి వేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఉత్తర్​ప్రదేశ్​ బరేలీ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

ఇదీ జరిగింది

బరేలి జిల్లాలో మవు చాంద్​పుర్​కి చెందిన శిశుపాల్​ కుమార్తె ఇటీవల అపహరణకు గురైంది. దీంతో పెళ్లి కావాల్సిన తన కుమార్తెను వెతకమని రామ్​నగర్​ పోలీసులను ఆశ్రయించాడు శిశుపాల్​. అయితే అందుకు రూ.లక్ష లంచం ఇవ్వాలని డిమాండ్​ చేశారు స్టేషన్​ ఇంచార్జ్​గా ఉన్న రామ్​ రతన్​ సింగ్​. దీంతో మనస్తాపానికి గురైన ​అతను ఉరి వేసుకున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న రతన్​ సింగ్​.. ఘటనా స్థలానికి చేరుకున్నాడు. అతను సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకుని.. దాన్ని చించి జేబులో పెట్టుకున్నాడు. అయితే గ్రామస్థులు రతన్​సింగ్​ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

కిడ్నాప్​ కేసు నమోదు

శిశుపాల్​ ఫిర్యాదు మేరకు ఏప్రిల్​ 9న అవలా పోలీస్ స్టేషన్​లో అపహరణ కేసు నమోదు చేశారు పోలీసులు. ఇందులో బంటి, ముకేశ్​, దినేశ్​ అనే ముగ్గరు వ్యక్తులు తన కుమార్తెను ద్విచక్ర వాహనంపై అపహరించి తీసుకెళ్లినట్లు ఎఫ్‌ఐఆర్‌లో శిశుపాల్ ఆరోపించారు.

ఇదీ చూడండి: లోయలో పడిన మినీ బస్సు- ఆరుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.