ETV Bharat / bharat

అక్కాచెల్లెళ్లను గదిలో బంధించి.. ముగ్గురు కలిసి నెలపాటు...

author img

By

Published : Oct 5, 2021, 10:58 AM IST

మైనర్​ అక్కాచెల్లెళ్లపై నెలరోజులుగా అత్యాచారానికి పాల్పడ్డిన ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్​ చేశారు. మహారాష్ట్ర జాల్నాలో జరిగిందీ ఘటన.

rape on two minor girls
అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం-

నెలరోజులుగా అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురిని మహారాష్ట్ర జాల్నా పోలీసులు అరెస్ట్​ చేశారు.

ఇదీ జరిగింది.

జాల్నా జిల్లాలోని నిధోనాకు చెందిన అవినాశ్​ కాకాసాహెబ్​ జోగదంఢ్​(18)​.. సెప్టెంబరు 3న నవీ ముంబయిలోని దిఘా ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్​ అక్కాచెల్లెళ్లకు మాయమాటలు చెప్పి జాల్నా తీసుకెళ్లాడు. వారిని అక్కడే అద్దె ఇంట్లో ఉంచి.. అవినాశ్​ సహా అతని సోదరుడు శుభం జోగదంఢ్​, దీపక్​ రానా, గణేశ్​ కాకాడే కలిసి నెలరోజులుగా అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే అక్టోబరు 1న ఆ బాలికలిద్దరూ.. అక్కడ నుంచి తప్పించుకుని ఔరంగబాద్​ చేరుకుని.. పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసి.. కాడిం జాల్నా పోలీసులకు అప్పగించారు ఔరంగబాద్​ పోలీసులు.

డీఎస్​పీ నీరజ్​రాజ్‌గురుతో కలిసి కాడిం జాల్నా పోలీసులు.. రాత్రికి రాత్రే సెర్చ్​ ఆపరేషన్ నిర్వహించారు. ప్రధాన నిందితుడు అవినాశ్​ జోగదంఢ్​.. రైలులో నాందేడ్​ నుంచి జాల్నా వెళ్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు.. తెల్లవారుజామున 2 గంటలకు అరెస్ట్ చేశారు. శుభం జోగదంఢ్​, గణేశ్​ కాకాడేను వేర్వేరు చోట్ల గాలించి అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి: లఖింపుర్‌ఖేరి ఘటనకు 9 రోజుల ముందే కేంద్రమంత్రి వార్నింగ్​!

నెలరోజులుగా అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురిని మహారాష్ట్ర జాల్నా పోలీసులు అరెస్ట్​ చేశారు.

ఇదీ జరిగింది.

జాల్నా జిల్లాలోని నిధోనాకు చెందిన అవినాశ్​ కాకాసాహెబ్​ జోగదంఢ్​(18)​.. సెప్టెంబరు 3న నవీ ముంబయిలోని దిఘా ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్​ అక్కాచెల్లెళ్లకు మాయమాటలు చెప్పి జాల్నా తీసుకెళ్లాడు. వారిని అక్కడే అద్దె ఇంట్లో ఉంచి.. అవినాశ్​ సహా అతని సోదరుడు శుభం జోగదంఢ్​, దీపక్​ రానా, గణేశ్​ కాకాడే కలిసి నెలరోజులుగా అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే అక్టోబరు 1న ఆ బాలికలిద్దరూ.. అక్కడ నుంచి తప్పించుకుని ఔరంగబాద్​ చేరుకుని.. పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసి.. కాడిం జాల్నా పోలీసులకు అప్పగించారు ఔరంగబాద్​ పోలీసులు.

డీఎస్​పీ నీరజ్​రాజ్‌గురుతో కలిసి కాడిం జాల్నా పోలీసులు.. రాత్రికి రాత్రే సెర్చ్​ ఆపరేషన్ నిర్వహించారు. ప్రధాన నిందితుడు అవినాశ్​ జోగదంఢ్​.. రైలులో నాందేడ్​ నుంచి జాల్నా వెళ్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు.. తెల్లవారుజామున 2 గంటలకు అరెస్ట్ చేశారు. శుభం జోగదంఢ్​, గణేశ్​ కాకాడేను వేర్వేరు చోట్ల గాలించి అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి: లఖింపుర్‌ఖేరి ఘటనకు 9 రోజుల ముందే కేంద్రమంత్రి వార్నింగ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.