ETV Bharat / bharat

రూ. 879కోట్లు విలువ చేసే హెరాయిన్ సీజ్

author img

By

Published : Jul 4, 2021, 12:31 PM IST

మత్తుపదార్థాలు సరఫరా చేస్తున్న ఓ స్మగ్లర్​ను అరెస్టు చేశారు మహారాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్​ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు. రూ. 879కోట్లు విలువచేసే 300 కేజీల హెరాయిన్​ను సీజ్​ చేసినట్లు తెలిపారు.

drugs, maharashtra
డ్రగ్స్, హెరాయిన్

అఫ్గానిస్తాన్​ నుంచి అక్రమంగా హెరాయిన్ తరలిస్తున్న ఓ స్మగ్లర్​ను అరెస్టు చేశారు మహారాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్(డీఆర్​ఐ) అధికారులు. నిందితుడి దగ్గర నుంచి దాదాపు 300 కేజీల హెరాయిన్​ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీని విలువ రూ. 879 కోట్ల వరకు ఉంటుందని స్పష్టం చేశారు.

ఇరాన్​, అఫ్గానిస్తాన్​ నుంచి అక్రమంగా తరలించిన సరుకును.. జిప్సమ్​ స్టోన్​, తాల్కమ్​ పౌడర్​గా గుర్తించారు అధికారులు. ఈ సరుకును సరఫరా చేస్తున్న ప్రబ్​జోత్​ సింగ్ అనే నిందితుడిని రాయ్​గఢ్ సమీపంలోని జవహర్​లాల్​ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్(జేఎన్​పీటీ) సమీపంలో అరెస్టు చేసినట్లు తెలిపారు. ఏడాది నుంచి నిందితుడు మత్తు పదార్థాల దందా కొనసాగిస్తున్నట్లు తెలిసిందని అధికారులు పేర్కొన్నారు.

గతేడాది ఆగస్టులోనూ ఆయుర్వేదిక్ మందుల పేరిట హెరాయిన్ సరఫరా చేస్తున్న కంటైనర్​ను డీఆర్​ఐ బృందాలు గుర్తించాయి. రూ. 1,000 కోట్ల విలువ చేసే హెరాయిన్​ను సీజ్​ చేశాయి. అప్పుడు కూడా ఆ మత్తుపదార్థాలు అఫ్గాన్​ నుంచే సరఫరా అయినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:రూ.300 కోట్ల విలువైన డ్రగ్స్​ స్వాధీనం

అఫ్గానిస్తాన్​ నుంచి అక్రమంగా హెరాయిన్ తరలిస్తున్న ఓ స్మగ్లర్​ను అరెస్టు చేశారు మహారాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్(డీఆర్​ఐ) అధికారులు. నిందితుడి దగ్గర నుంచి దాదాపు 300 కేజీల హెరాయిన్​ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీని విలువ రూ. 879 కోట్ల వరకు ఉంటుందని స్పష్టం చేశారు.

ఇరాన్​, అఫ్గానిస్తాన్​ నుంచి అక్రమంగా తరలించిన సరుకును.. జిప్సమ్​ స్టోన్​, తాల్కమ్​ పౌడర్​గా గుర్తించారు అధికారులు. ఈ సరుకును సరఫరా చేస్తున్న ప్రబ్​జోత్​ సింగ్ అనే నిందితుడిని రాయ్​గఢ్ సమీపంలోని జవహర్​లాల్​ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్(జేఎన్​పీటీ) సమీపంలో అరెస్టు చేసినట్లు తెలిపారు. ఏడాది నుంచి నిందితుడు మత్తు పదార్థాల దందా కొనసాగిస్తున్నట్లు తెలిసిందని అధికారులు పేర్కొన్నారు.

గతేడాది ఆగస్టులోనూ ఆయుర్వేదిక్ మందుల పేరిట హెరాయిన్ సరఫరా చేస్తున్న కంటైనర్​ను డీఆర్​ఐ బృందాలు గుర్తించాయి. రూ. 1,000 కోట్ల విలువ చేసే హెరాయిన్​ను సీజ్​ చేశాయి. అప్పుడు కూడా ఆ మత్తుపదార్థాలు అఫ్గాన్​ నుంచే సరఫరా అయినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:రూ.300 కోట్ల విలువైన డ్రగ్స్​ స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.