ETV Bharat / bharat

సెలవు ఇవ్వలేదని హత్య- 29 ఏళ్లకు అరెస్ట్

author img

By

Published : Aug 2, 2021, 7:57 PM IST

సెలవు ఇవ్వలేదని అధికారులపై ఆగ్రహం పెంచుకున్నాడు ఓ వ్యక్తి. విచక్షణా రహితంగా కాల్పులు జరిపి సహోద్యోగి మృతికి కారణమయ్యాడు. ఇదంతా జరిగిన 29 ఏళ్ల తర్వాత ఈ కేసులో సదరు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

CRPF jawan arrested
సీఆర్​పీఎఫ్​ మాజీ ఉద్యోగి అరెస్టు

29 ఏళ్ల క్రితం నాటి ఓ హత్య కేసులో నిందితుడ్ని మహారాష్ట్ర వార్ధా పోలీసులు పట్టుకున్నారు. సెలవు ఇవ్వలేదన్న కారణంతో.. సహోద్యోగిపై కాల్పులు జరిపి, హత్య చేసిన కేసులో సీఆర్​పీఎఫ్​ మాజీ ఉద్యోగిని అరెస్టు చేశారు.

అసలేం జరిగింది?

మహారాష్ట్ర ఆర్వీ ప్రాంతానికి చెందిన.. సుభాష్​ రామకృష్ణ నఖ్లే అనే వ్యక్తి.. త్రిపుర కాంచంపుర్​లోని సీఆర్​పీఎఫ్​ 45వ బెటాలియన్​లో విధులు నిర్వర్తించేవాడు. 1992 జూన్​ 3న అతడు తన కుటుంబ సభ్యుల్లో ఒకరు మరణించినందున.. సెలవు కావాలని తన పైఅధికారులకు విజ్ఞప్తి చేశాడు. అయితే.. వారు అతనికి సెలవు మంజూరు చేయలేదు. దాంతో ఆగ్రహానికి గురైన సుభాష్​ నఖ్లే.. తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు.

CRPF jawan arrested
నిందితుడ్ని పట్టుకున్న పోలీసులు

ఈ ఘటనలో ఓ సీఆర్​పీఎఫ్​ సిబ్బంది ప్రాణాలు కోల్పోగా.. మరికొంత మంది గాయపడ్డారు. కాల్పుల అనంతరం సుభాష్​ నఖ్లే.. అక్కడి నుంచి పరారయ్యాడు. 20 ఏళ్లుగా ఈ కేసులో పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. అయితే.. 2012లో నఖ్లే తన సొంతూరికి రాగా.. పోలీసులు అతని గురించి వివరాలు తెలుసుకోగలిగారు. ఓ ఆస్తి వివాదంలో నఖ్లే ఇటీవల మరోసారి తమ గ్రామానికి రావడం వల్ల పోలీసులు అతన్ని పట్టుకుని, కస్టడీకి తరలించారు.

ఇదీ చూడండి: 'రేప్​ చేసిన వ్యక్తితోనే పెళ్లి'కి సుప్రీం నో!

ఇదీ చూడండి: వ్యాపారంలో చిన్నోళ్లు- భాషా జ్ఞానంలో ఘనులు!

29 ఏళ్ల క్రితం నాటి ఓ హత్య కేసులో నిందితుడ్ని మహారాష్ట్ర వార్ధా పోలీసులు పట్టుకున్నారు. సెలవు ఇవ్వలేదన్న కారణంతో.. సహోద్యోగిపై కాల్పులు జరిపి, హత్య చేసిన కేసులో సీఆర్​పీఎఫ్​ మాజీ ఉద్యోగిని అరెస్టు చేశారు.

అసలేం జరిగింది?

మహారాష్ట్ర ఆర్వీ ప్రాంతానికి చెందిన.. సుభాష్​ రామకృష్ణ నఖ్లే అనే వ్యక్తి.. త్రిపుర కాంచంపుర్​లోని సీఆర్​పీఎఫ్​ 45వ బెటాలియన్​లో విధులు నిర్వర్తించేవాడు. 1992 జూన్​ 3న అతడు తన కుటుంబ సభ్యుల్లో ఒకరు మరణించినందున.. సెలవు కావాలని తన పైఅధికారులకు విజ్ఞప్తి చేశాడు. అయితే.. వారు అతనికి సెలవు మంజూరు చేయలేదు. దాంతో ఆగ్రహానికి గురైన సుభాష్​ నఖ్లే.. తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు.

CRPF jawan arrested
నిందితుడ్ని పట్టుకున్న పోలీసులు

ఈ ఘటనలో ఓ సీఆర్​పీఎఫ్​ సిబ్బంది ప్రాణాలు కోల్పోగా.. మరికొంత మంది గాయపడ్డారు. కాల్పుల అనంతరం సుభాష్​ నఖ్లే.. అక్కడి నుంచి పరారయ్యాడు. 20 ఏళ్లుగా ఈ కేసులో పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. అయితే.. 2012లో నఖ్లే తన సొంతూరికి రాగా.. పోలీసులు అతని గురించి వివరాలు తెలుసుకోగలిగారు. ఓ ఆస్తి వివాదంలో నఖ్లే ఇటీవల మరోసారి తమ గ్రామానికి రావడం వల్ల పోలీసులు అతన్ని పట్టుకుని, కస్టడీకి తరలించారు.

ఇదీ చూడండి: 'రేప్​ చేసిన వ్యక్తితోనే పెళ్లి'కి సుప్రీం నో!

ఇదీ చూడండి: వ్యాపారంలో చిన్నోళ్లు- భాషా జ్ఞానంలో ఘనులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.