ETV Bharat / bharat

'కొవిడ్​ విముక్తికి సమైక్యంగా పోరాడదాం' - Om Birla's direction on the role to be played by public representatives in corona situation

కరోనా నుంచి విముక్తి ఐక్యంగా పోరాడదామని లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా పిలుపునిచ్చారు. 'కొవిడ్​-19 వ్యాప్తి-ప్రజా ప్రతినిధుల పాత్ర, బాధ్యత' అనే అంశంపై శాసనసభల స్పీకర్లు, శాసనమండలి ఛైర్మన్లు, సభా వ్యవహారాల మంత్రులు, చీఫ్​ విప్​లు , ఉభయసభల్లోని ప్రతిపక్ష నాయకులతో సోమవారం ఆయన ఆన్​లైన్​ ద్వారా సమావేశమయ్యారు. కొవిడ్​ నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు నిర్వహించాల్సిన పాత్రపై దిశానిర్దేశం చేశారు.

ఓం బిర్లా
Om Birla
author img

By

Published : Apr 20, 2021, 7:27 AM IST

కొవిడ్​ కోరల నుంచి విముక్తికి సమైక్యంగా పోరాడదామని లోక్​సభ సభాపతి ఓం బిర్లా పిలుపునిచ్చారు. 'కొవిడ్​-19 వ్యాప్తి-ప్రజా ప్రతినిధుల పాత్ర, బాధ్యత' అనే అంశంపై శాసనసభల స్పీకర్లు, శాసనమండలి ఛైర్మన్లు, సభా వ్యవహారాల మంత్రులు, చీఫ్​ విప్​లు , ఉభయసభల్లోని ప్రతిపక్ష నాయకులతో సోమవారం ఆయన ఆన్​లైన్​ ద్వారా సమావేశమయ్యారు. కొవిడ్​ నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు నిర్వహించాల్సిన పాత్రపై ఓం బిర్లా దిశానిర్దేశం చేశారు.

" గతేడాదితో పోలిస్తే రెండో దశ ఉద్ధృతి ఎక్కువగా ఉండడం తీవ్ర ఆందోళనను కలుగజేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్థాయిలో చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాయి. ఈ మహమ్మారి నుంచి సమాజం, దేశం విముక్తి పొందేందుకు ప్రజా ప్రతినిధులు తమ విధులను మరింత సమర్థంగా నిర్వహించాలి. మహమ్మారి విషయంలో ప్రజలను జాగృతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకునేలా స్పీకర్లు, ఛైర్మన్లు చొరవచూపాలి. కొవిడ్​పై పోరులో వ్యక్తిగత జాగ్రత్తలే బలమైన ఆయుధం. ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా అది తీవ్ర ప్రమాదకరంగా మారుతుందని ప్రజా ప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలి. కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన సమస్యలేమైనా ఉంటే వాటిని లోక్​సభ కంట్రోల్​ రూంకు పంపించాలి. ఈ విపత్కర సమయంలో లోక్​సభ, రాష్ట్రాల శాసన వ్యవస్థలు కలిసికట్టుగా పని చేయాలి. టీకా కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. టీకాల విషయంలో ప్రజా ప్రతినిధులు స్థానిక సంస్థలతో మమేకమై పని చేయాలి."

ఓం బిర్లా, లోక్​సభ స్పీకర్​

టీకాలు, ఆక్సిజన్​ కొరత, రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ బకాయిల గురించి కొన్ని రాష్ట్రాలు ఈ సమావేశంలో లేవనెత్తాయి.

ఇదీ చదవండి: ముందు జాగ్రత్తే శ్రీరామరక్ష!

ఇదీ చదవండి: 'ప్రాణవాయువు'ను తోడేస్తున్న సెకండ్‌ వేవ్‌!

కొవిడ్​ కోరల నుంచి విముక్తికి సమైక్యంగా పోరాడదామని లోక్​సభ సభాపతి ఓం బిర్లా పిలుపునిచ్చారు. 'కొవిడ్​-19 వ్యాప్తి-ప్రజా ప్రతినిధుల పాత్ర, బాధ్యత' అనే అంశంపై శాసనసభల స్పీకర్లు, శాసనమండలి ఛైర్మన్లు, సభా వ్యవహారాల మంత్రులు, చీఫ్​ విప్​లు , ఉభయసభల్లోని ప్రతిపక్ష నాయకులతో సోమవారం ఆయన ఆన్​లైన్​ ద్వారా సమావేశమయ్యారు. కొవిడ్​ నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు నిర్వహించాల్సిన పాత్రపై ఓం బిర్లా దిశానిర్దేశం చేశారు.

" గతేడాదితో పోలిస్తే రెండో దశ ఉద్ధృతి ఎక్కువగా ఉండడం తీవ్ర ఆందోళనను కలుగజేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్థాయిలో చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాయి. ఈ మహమ్మారి నుంచి సమాజం, దేశం విముక్తి పొందేందుకు ప్రజా ప్రతినిధులు తమ విధులను మరింత సమర్థంగా నిర్వహించాలి. మహమ్మారి విషయంలో ప్రజలను జాగృతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకునేలా స్పీకర్లు, ఛైర్మన్లు చొరవచూపాలి. కొవిడ్​పై పోరులో వ్యక్తిగత జాగ్రత్తలే బలమైన ఆయుధం. ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా అది తీవ్ర ప్రమాదకరంగా మారుతుందని ప్రజా ప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలి. కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన సమస్యలేమైనా ఉంటే వాటిని లోక్​సభ కంట్రోల్​ రూంకు పంపించాలి. ఈ విపత్కర సమయంలో లోక్​సభ, రాష్ట్రాల శాసన వ్యవస్థలు కలిసికట్టుగా పని చేయాలి. టీకా కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. టీకాల విషయంలో ప్రజా ప్రతినిధులు స్థానిక సంస్థలతో మమేకమై పని చేయాలి."

ఓం బిర్లా, లోక్​సభ స్పీకర్​

టీకాలు, ఆక్సిజన్​ కొరత, రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ బకాయిల గురించి కొన్ని రాష్ట్రాలు ఈ సమావేశంలో లేవనెత్తాయి.

ఇదీ చదవండి: ముందు జాగ్రత్తే శ్రీరామరక్ష!

ఇదీ చదవండి: 'ప్రాణవాయువు'ను తోడేస్తున్న సెకండ్‌ వేవ్‌!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.