ETV Bharat / bharat

జూన్ 1 వరకు మహారాష్ట్రలో 'కరోనా ఆంక్షలు' - కరోనా కట్టడి లాక్​డౌన్ తరహా ఆంక్షలు మహారాష్ట్ర

కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్​డౌన్​ తరహా ఆంక్షలను జూన్​ 1 ఉదయం 7 గంటల వరకు పొడిగించింది మహారాష్ట్ర. రాష్ట్రంలోకి వచ్చే వారికి ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షలో నెగెటివ్​ రిపోర్టు కచ్చితంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

Lockdown-like restrictions extended in Maharashtra till June 1
జూన్ 1 వరకు మహారాష్ట్రలో 'కరోనా ఆంక్షలు'
author img

By

Published : May 13, 2021, 1:01 PM IST

రాష్ట్రంలో విధించిన లాక్​డౌన్​ తరహా ఆంక్షలను వచ్చే నెల 1 ఉదయం 7 గంటల వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది మహారాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటివరకు అమలులో ఉన్న ఆంక్షలతో పాటు అదనపు నిబంధనలు తీసుకొచ్చింది. ఈ మేరకు ముఖ్య కార్యదర్శి సీతారామ్​ కుంతే ఆదేశాలు జారీ చేశారు.

అదనపు ఆంక్షలు...

  • ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షలో నెగెటివ్​ రిపోర్టు ఉంటేనే ప్రజలకు రాష్ట్రంలోకి అనుమతి
  • రాష్ట్రంలోకి వచ్చే 48 గంటల ముందు పరీక్షకు సంబంధించిన రిపోర్టు ఉండాలి
  • సరకు రవాణాకు.. ఒక వాహనంలో ఇద్దరికి మాత్రమే అనుమతి
  • ఇతర రాష్ట్రాల నుంచి సరకు రవాణా కోసం వచ్చిన వారికి ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షలో నెగెటివ్​ రిపోర్టు కచ్చితంగా ఉండాలి. ఇది ఏడు రోజుల పాటు చెల్లుతుంది.

కరోనాతో దేశంలో అత్యధికంగా ప్రభావితమైన రాష్ట్రం మహారాష్ట్ర. కరోనా రెండో దశతో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. ఈ నేపథ్యంల కరోనా కట్టడికి ఏప్రిల్​ 5 లాక్​డౌన్​ తరహా ఆంక్షలను విధించింది ప్రభుత్వం. ఇప్పటివరకు ఆంక్షలను పొడిగిస్తూ వస్తోంది.

ఇదీ చదవండి: 'వ్యాక్సిన్లతో పాటు ప్రధాని కూడా కనపడట్లేదు'

రాష్ట్రంలో విధించిన లాక్​డౌన్​ తరహా ఆంక్షలను వచ్చే నెల 1 ఉదయం 7 గంటల వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది మహారాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటివరకు అమలులో ఉన్న ఆంక్షలతో పాటు అదనపు నిబంధనలు తీసుకొచ్చింది. ఈ మేరకు ముఖ్య కార్యదర్శి సీతారామ్​ కుంతే ఆదేశాలు జారీ చేశారు.

అదనపు ఆంక్షలు...

  • ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షలో నెగెటివ్​ రిపోర్టు ఉంటేనే ప్రజలకు రాష్ట్రంలోకి అనుమతి
  • రాష్ట్రంలోకి వచ్చే 48 గంటల ముందు పరీక్షకు సంబంధించిన రిపోర్టు ఉండాలి
  • సరకు రవాణాకు.. ఒక వాహనంలో ఇద్దరికి మాత్రమే అనుమతి
  • ఇతర రాష్ట్రాల నుంచి సరకు రవాణా కోసం వచ్చిన వారికి ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షలో నెగెటివ్​ రిపోర్టు కచ్చితంగా ఉండాలి. ఇది ఏడు రోజుల పాటు చెల్లుతుంది.

కరోనాతో దేశంలో అత్యధికంగా ప్రభావితమైన రాష్ట్రం మహారాష్ట్ర. కరోనా రెండో దశతో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. ఈ నేపథ్యంల కరోనా కట్టడికి ఏప్రిల్​ 5 లాక్​డౌన్​ తరహా ఆంక్షలను విధించింది ప్రభుత్వం. ఇప్పటివరకు ఆంక్షలను పొడిగిస్తూ వస్తోంది.

ఇదీ చదవండి: 'వ్యాక్సిన్లతో పాటు ప్రధాని కూడా కనపడట్లేదు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.