ETV Bharat / bharat

హజ్​ యాత్రకు దరఖాస్తు గడువు పెంపు

author img

By

Published : Dec 10, 2020, 10:07 PM IST

2021 హజ్​ యాత్ర కోసం దరఖాస్తు ప్రక్రియను ఇప్పటికీ.. పూర్తి చేసుకోని వారికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. 2021, జనవరి 10 వరకు దరఖాస్తు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎంబార్కేషన్​ పాయింట్లను బట్టి ఛార్జీలను కూడా తగ్గించింది.

Last date for submitting Haj applications extended to Jan 10
హజ్​ యాత్రకు దరఖాస్తు గడువు పెంపు

హజ్​-2021 యాత్రకు సంబంధించిన ధరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. వచ్చే ఏడాది జనవరి 10 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్​ అబ్బాస్​ నఖ్వీ తెలిపారు. భక్తులు వచ్చే ప్రదేశాలను(ఎంబార్కేషన్​ పాయింట్లు) బట్టి ఖరీదు కూడా తగ్గించినట్లు చెప్పారు.

'హజ్​ యాత్రకు వెళ్లేందుకు దరఖాస్తు సమర్పించడానికి ఈరోజు, డిసెంబర్​ 10 ఆఖరి రోజు. కానీ, ఆ గడువును 2021, జనవరి 10 వరకు పొడిగించామ'ని హజ్​ కమిటీతో భేటీ అనంతరం నఖ్వీ తెలిపారు. వచ్చే ఏడాది జూన్​-జులై​ మధ్య ఈ హజ్​ 2021 యాత్ర జరగనుంది. సౌదీ అరేబియా, భారత ప్రభుత్వం నిర్దేశించిన కొవిడ్​ మార్గదర్శకాలనుసారం ఈ యాత్ర కొనసాగనుంది.

సౌదీ అరేబియాతో చర్చలు జరిపిన అనంతరం.. ఎంబార్కేషన్​ పాయింట్ల ఛార్జీలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నామని నఖ్వీ తెలిపారు. మహమ్మారి దృష్ట్యా కొవిడ్​ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.

"వయో పరిమితులు విధించే అవకాశం ఉంది. ప్రతి యాత్రికుడు 72 గంటల ముందే కచ్చితంగా కొవిడ్​ పరీక్ష చేయించుకోవాలి. పరీక్షల్లో నెగెటివ్​ వచ్చిన వారికే యాత్రకు అనుమతి ఉంటుంది."

-- ముక్తార్​ అబ్బాస్​ నఖ్వీ, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి.

హజ్​ 2021 యాత్ర కోసం ఈసారి 40,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. వారిలో 500కు పైగా దరఖాస్తులు ఒంటరి మహిళలవే. 2020 సంవత్సరంలో ఈ కేటగిరీలో 2,100 మంది స్త్రీలు దరఖాస్తు చేసుకున్నారు.

హజ్​ యాత్ర చేయాలనుకునే ఒంటరి మహిళల వద్ద నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని మైనారిటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. 2021 హజ్​ యాత్ర కోసం ఎంబార్కేషన్​ పాయింట్ల సంఖ్యను 10కి కుదించినట్లు చెప్పింది. అహ్మదాబాద్​, బెంగళూరు, కొచిన్​, దిల్లీ, గువాహటి, హైదరాబాద్​, కోల్​కతా, లఖ్​నవూ, ముంబయి, శ్రీనగర్​లలో ఈ పాయింట్లు ఉంటాయని వెల్లడించింది.

ఎంబార్కేషన్​ పాయింట్ల వారీగా ధరల అంచనాలు

  • అహ్మదాబాద్​, ముంబయి- రూ.3,30,000
  • బెంగళూరు, లఖ్​నవూ, దిల్లీ, హైదరాబాద్​- రూ.3,50,000
  • కొచిన్​, శ్రీనగర్​- రూ.3,60,000
  • కోల్​కతా- రూ.3,70,000, గువాహటి- రూ.4,00,000

ఇదీ చూడండి:'కరోనా భయాలతోనే హజ్​కు తగ్గిన దరఖాస్తులు'

హజ్​-2021 యాత్రకు సంబంధించిన ధరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. వచ్చే ఏడాది జనవరి 10 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్​ అబ్బాస్​ నఖ్వీ తెలిపారు. భక్తులు వచ్చే ప్రదేశాలను(ఎంబార్కేషన్​ పాయింట్లు) బట్టి ఖరీదు కూడా తగ్గించినట్లు చెప్పారు.

'హజ్​ యాత్రకు వెళ్లేందుకు దరఖాస్తు సమర్పించడానికి ఈరోజు, డిసెంబర్​ 10 ఆఖరి రోజు. కానీ, ఆ గడువును 2021, జనవరి 10 వరకు పొడిగించామ'ని హజ్​ కమిటీతో భేటీ అనంతరం నఖ్వీ తెలిపారు. వచ్చే ఏడాది జూన్​-జులై​ మధ్య ఈ హజ్​ 2021 యాత్ర జరగనుంది. సౌదీ అరేబియా, భారత ప్రభుత్వం నిర్దేశించిన కొవిడ్​ మార్గదర్శకాలనుసారం ఈ యాత్ర కొనసాగనుంది.

సౌదీ అరేబియాతో చర్చలు జరిపిన అనంతరం.. ఎంబార్కేషన్​ పాయింట్ల ఛార్జీలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నామని నఖ్వీ తెలిపారు. మహమ్మారి దృష్ట్యా కొవిడ్​ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.

"వయో పరిమితులు విధించే అవకాశం ఉంది. ప్రతి యాత్రికుడు 72 గంటల ముందే కచ్చితంగా కొవిడ్​ పరీక్ష చేయించుకోవాలి. పరీక్షల్లో నెగెటివ్​ వచ్చిన వారికే యాత్రకు అనుమతి ఉంటుంది."

-- ముక్తార్​ అబ్బాస్​ నఖ్వీ, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి.

హజ్​ 2021 యాత్ర కోసం ఈసారి 40,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. వారిలో 500కు పైగా దరఖాస్తులు ఒంటరి మహిళలవే. 2020 సంవత్సరంలో ఈ కేటగిరీలో 2,100 మంది స్త్రీలు దరఖాస్తు చేసుకున్నారు.

హజ్​ యాత్ర చేయాలనుకునే ఒంటరి మహిళల వద్ద నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని మైనారిటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. 2021 హజ్​ యాత్ర కోసం ఎంబార్కేషన్​ పాయింట్ల సంఖ్యను 10కి కుదించినట్లు చెప్పింది. అహ్మదాబాద్​, బెంగళూరు, కొచిన్​, దిల్లీ, గువాహటి, హైదరాబాద్​, కోల్​కతా, లఖ్​నవూ, ముంబయి, శ్రీనగర్​లలో ఈ పాయింట్లు ఉంటాయని వెల్లడించింది.

ఎంబార్కేషన్​ పాయింట్ల వారీగా ధరల అంచనాలు

  • అహ్మదాబాద్​, ముంబయి- రూ.3,30,000
  • బెంగళూరు, లఖ్​నవూ, దిల్లీ, హైదరాబాద్​- రూ.3,50,000
  • కొచిన్​, శ్రీనగర్​- రూ.3,60,000
  • కోల్​కతా- రూ.3,70,000, గువాహటి- రూ.4,00,000

ఇదీ చూడండి:'కరోనా భయాలతోనే హజ్​కు తగ్గిన దరఖాస్తులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.