ETV Bharat / bharat

Lakhimpur Violence: ఆశిష్​ మిశ్రాకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘటన(Lakhimpur Violence) కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్​ మిశ్రాకు(Ashish Mishra News) న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. 12 గంటల విచారణ తర్వాత శనివారం రాత్రి ఆయనను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.

author img

By

Published : Oct 10, 2021, 11:36 AM IST

Lakhimpur Violence
లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘటన

లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘటన(Lakhimpur Violence) కేసులో అరెస్టైన కేంద్ర మంత్రి అజయ్​ మిశ్రా తనయుడు ఆశిష్​ మిశ్రాకు(Ashish Mishra News) న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్​ కస్టడీ విధించింది. శనివారం అర్ధరాత్రి ఆయనను పోలీసులు న్యాయస్థానం ముందు హాజరు పరచగా.. జ్యుడిషీయల్ మేజిస్ట్రేట్​ ఈ మేరకు ఆదేశించారు.

శనివారం ఈ కేసులో 12 గంటల పాటు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్​) ఆశిష్​ను ప్రశ్నించింది. వైద్య బృందం పరీక్షల అనంతరం.. ఆయనను అధికారులు న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. దాంతో జ్యుడిషీయల్ ​ మేజిస్ట్రేట్..​ ఆశిష్​కు జ్యుడిషీయల్ కస్డడీ విధించారని సీనియర్ ప్రాసిక్యూషన్ అధికారి ఎస్​పీ యాదవ్ మీడియాకు తెలిపారు. ఆశిష్​ మిశ్రాను పోలీసు రిమాండ్​కు తరలించాలని​ న్యాయస్థానానికి తాము దరఖాస్తు సమర్పించామని చెప్పారు. దీనిపై కోర్టు సోమవారం విచారణ జరపనుందని పేర్కొన్నారు.

అంతకుముందు.. విచారణలో ఆశిష్​ మిశ్రా సహకరించలేదని పోలీసులు తెలిపారు. తాము అడిగిన ప్రశ్నలకు ఆశిష్​ సరైన సమాధానాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. దీంతో అతణ్ని అరెస్ట్​ చేసినట్లు వివరించారు.

ఈ నెల 3వ తేదీన లఖింపుర్ ఖేరిలో(Lakhimpur Violence) సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన తెలుపుతుండగా ఆశిష్​ మిశ్రా కారు అక్కడున్న రైతులపైకి దూసుకెళ్లింది. దీంతో నలుగురు రైతులు సహా 8 మంది మృతి చెందారు.

లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘటన(Lakhimpur Violence) కేసులో అరెస్టైన కేంద్ర మంత్రి అజయ్​ మిశ్రా తనయుడు ఆశిష్​ మిశ్రాకు(Ashish Mishra News) న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్​ కస్టడీ విధించింది. శనివారం అర్ధరాత్రి ఆయనను పోలీసులు న్యాయస్థానం ముందు హాజరు పరచగా.. జ్యుడిషీయల్ మేజిస్ట్రేట్​ ఈ మేరకు ఆదేశించారు.

శనివారం ఈ కేసులో 12 గంటల పాటు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్​) ఆశిష్​ను ప్రశ్నించింది. వైద్య బృందం పరీక్షల అనంతరం.. ఆయనను అధికారులు న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. దాంతో జ్యుడిషీయల్ ​ మేజిస్ట్రేట్..​ ఆశిష్​కు జ్యుడిషీయల్ కస్డడీ విధించారని సీనియర్ ప్రాసిక్యూషన్ అధికారి ఎస్​పీ యాదవ్ మీడియాకు తెలిపారు. ఆశిష్​ మిశ్రాను పోలీసు రిమాండ్​కు తరలించాలని​ న్యాయస్థానానికి తాము దరఖాస్తు సమర్పించామని చెప్పారు. దీనిపై కోర్టు సోమవారం విచారణ జరపనుందని పేర్కొన్నారు.

అంతకుముందు.. విచారణలో ఆశిష్​ మిశ్రా సహకరించలేదని పోలీసులు తెలిపారు. తాము అడిగిన ప్రశ్నలకు ఆశిష్​ సరైన సమాధానాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. దీంతో అతణ్ని అరెస్ట్​ చేసినట్లు వివరించారు.

ఈ నెల 3వ తేదీన లఖింపుర్ ఖేరిలో(Lakhimpur Violence) సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన తెలుపుతుండగా ఆశిష్​ మిశ్రా కారు అక్కడున్న రైతులపైకి దూసుకెళ్లింది. దీంతో నలుగురు రైతులు సహా 8 మంది మృతి చెందారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.