ETV Bharat / bharat

కిడ్నాపైన ఓఎన్​జీసీ అధికారి విడుదల

author img

By

Published : May 22, 2021, 11:10 AM IST

Updated : May 22, 2021, 12:27 PM IST

ఏప్రిల్ 21న అపహరించిన ఓఎన్​జీసీ అధికారిని ఉల్ఫా ఉగ్రవాద సంస్థ విడుదల చేసింది. మయన్మార్​ సరిహద్దులో అతన్ని వదిలేసినట్లు అధికారులు తెలిపారు.

ONGC employee
ఓఎన్​జీసీ ఉద్యోగి

అసోంలోని శివసాగర్ జిల్లాలో ఏప్రిల్​ 21న అపహరణకు గురైన ఓఎన్​జీసీ అధికారి రితుల్​ సైక్యాను శనివారం ఉదయం విడుదల చేసింది ఉల్ఫా ఉగ్రవాద సంస్థ. ఏప్రిల్ 21న మొత్తం ముగ్గురు ఓఎన్​జీసీ అధికారులను ఉల్ఫా ఉగ్రవాదులు కిడ్నాప్​ చేశారు. అయితే ఇద్దరిని ఏప్రిల్​ 24న కాపాడారు పోలీసులు. సైక్యాను.. మయన్మార్ సరిహద్దు వద్ద వదిలిపెట్టగా.. 40 నిమిషాల పాటు నడిచి భారత సరిహద్దులోకి వచ్చాడు.

శనివారం ఉదయం 7 గంటలకు.. మయన్మార్​ సరిహద్దులో సైక్యాను విడిచిపెట్టారు ఉగ్రవాదులు. సైక్యా.. భారత భూభాగంలోకి వచ్చిన తర్వాత నాగాలాండ్ పోలీసులు అతన్ని మోన్​ పోలీస్ స్టేషన్​లో కొద్దిసేపు విచారించి ఇంటికి పంపించినట్లు అధికారులు తెలిపారు.

'షా'కు కృతజ్ఞతలు..

ఓఎన్​జీసీ అధికారిని విడుదల చేయటంపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ట్విట్టర్​ వేదికగా స్పందించారు. ప్రతిఒక్కరి సహకారంతో రాష్ట్రంలో శాంతి నెలకొందని, అభివృద్ధి జరిగిందన్నారు.

" ఓఎన్​జీసీ అధికారి రితుల్ సైక్యాకు హృదయపూర్వక స్వాగతం. ఈ సందర్భంగా అనుక్షణం దిశానిర్దేశం చేసిన గౌరవనీయులైన కేంద్ర హోం మంత్రి అమిత్​ షాకు కృతజ్ఞతలు. ప్రతిఒక్కరి సహకారంతోనే రాష్ట్రంలో శాంతి, అభివృద్ధి జరిగింది."

- హిమంత బిశ్వ శర్మ, అసోం ముఖ్యమంత్రి

ఏప్రిల్ 21న.. ఓఎన్​జీసీకి చెందిన ముగ్గురు అధికారులను.. అసోం-నాగాలాండ్​లోని శివసాగర్ జిల్లాలో ఉల్ఫా(ఐ) ఉగ్రవాద సంస్థ కిడ్నాప్ చేసింది.

ఇదీ చదవండి : ముగ్గురు ఓఎన్​జీసీ అధికారుల అపహరణ

అసోంలోని శివసాగర్ జిల్లాలో ఏప్రిల్​ 21న అపహరణకు గురైన ఓఎన్​జీసీ అధికారి రితుల్​ సైక్యాను శనివారం ఉదయం విడుదల చేసింది ఉల్ఫా ఉగ్రవాద సంస్థ. ఏప్రిల్ 21న మొత్తం ముగ్గురు ఓఎన్​జీసీ అధికారులను ఉల్ఫా ఉగ్రవాదులు కిడ్నాప్​ చేశారు. అయితే ఇద్దరిని ఏప్రిల్​ 24న కాపాడారు పోలీసులు. సైక్యాను.. మయన్మార్ సరిహద్దు వద్ద వదిలిపెట్టగా.. 40 నిమిషాల పాటు నడిచి భారత సరిహద్దులోకి వచ్చాడు.

శనివారం ఉదయం 7 గంటలకు.. మయన్మార్​ సరిహద్దులో సైక్యాను విడిచిపెట్టారు ఉగ్రవాదులు. సైక్యా.. భారత భూభాగంలోకి వచ్చిన తర్వాత నాగాలాండ్ పోలీసులు అతన్ని మోన్​ పోలీస్ స్టేషన్​లో కొద్దిసేపు విచారించి ఇంటికి పంపించినట్లు అధికారులు తెలిపారు.

'షా'కు కృతజ్ఞతలు..

ఓఎన్​జీసీ అధికారిని విడుదల చేయటంపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ట్విట్టర్​ వేదికగా స్పందించారు. ప్రతిఒక్కరి సహకారంతో రాష్ట్రంలో శాంతి నెలకొందని, అభివృద్ధి జరిగిందన్నారు.

" ఓఎన్​జీసీ అధికారి రితుల్ సైక్యాకు హృదయపూర్వక స్వాగతం. ఈ సందర్భంగా అనుక్షణం దిశానిర్దేశం చేసిన గౌరవనీయులైన కేంద్ర హోం మంత్రి అమిత్​ షాకు కృతజ్ఞతలు. ప్రతిఒక్కరి సహకారంతోనే రాష్ట్రంలో శాంతి, అభివృద్ధి జరిగింది."

- హిమంత బిశ్వ శర్మ, అసోం ముఖ్యమంత్రి

ఏప్రిల్ 21న.. ఓఎన్​జీసీకి చెందిన ముగ్గురు అధికారులను.. అసోం-నాగాలాండ్​లోని శివసాగర్ జిల్లాలో ఉల్ఫా(ఐ) ఉగ్రవాద సంస్థ కిడ్నాప్ చేసింది.

ఇదీ చదవండి : ముగ్గురు ఓఎన్​జీసీ అధికారుల అపహరణ

Last Updated : May 22, 2021, 12:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.