కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) దూసుకుపోతోంది. 'ఎల్డీఎఫ్దే మళ్లీ అధికారం' నినాదంతో ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. తిరువనంతపురంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్కు రాష్ట్ర సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏ విజయరాఘవన్ ప్రచారానికి సబంధించిన ట్యాగ్లైన్ను అందజేశారు. కేరళవ్యాప్తంగా ఈ నినాదంతో కూడిన ఫ్లెక్సీలు, బ్యానర్లను పార్టీ శ్రేణులు ఏర్పాటు చేశాయి.
తమ అభివృద్ధి పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు విజయన్. ఎల్డీఎఫ్ ఎన్నికల నినాదం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.