ETV Bharat / bharat

'ఎల్​డీఎఫ్​దే అధికారం' నినాదంతో ప్రచారంలోకి విజయన్​

author img

By

Published : Feb 28, 2021, 5:30 PM IST

కేరళ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న క్రమంలో 'ఎల్​డీఎఫ్​దే మళ్లీ అధికారం' ప్రచార నినాదాన్ని ఆవిష్కరించింది అధికార లెఫ్ట్​ డెమొక్రటిక్​ ఫ్రంట్(ఎల్​డీఎఫ్). తిరువనంతపురం వేదికగా ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఈ మేరకు ప్రకటించింది.

Kerala polls: LDF releases its election campaign slogan
కేరళ సీపీఐ అధికార నినాదం.. 'ఎస్​ ఫర్​ ష్యూర్​ ఇట్స్ ఎల్డీఎఫ్'

కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధికార లెఫ్ట్​ డెమొక్రటిక్​ ఫ్రంట్(ఎల్​డీఎఫ్​)​ దూసుకుపోతోంది. 'ఎల్​డీఎఫ్​దే మళ్లీ అధికారం' నినాదంతో ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. తిరువనంతపురంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్​కు రాష్ట్ర సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏ విజయరాఘవన్ ప్రచారానికి సబంధించిన ట్యాగ్​లైన్​ను అందజేశారు.​ కేరళవ్యాప్తంగా ఈ నినాదంతో కూడిన ఫ్లెక్సీలు, బ్యానర్లను పార్టీ శ్రేణులు ఏర్పాటు చేశాయి.

తమ అభివృద్ధి పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు విజయన్​. ఎల్​డీఎఫ్​ ఎన్నికల నినాదం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమానికి హాజరైన క్రైస్తవ మతాధికారులు గత ఐదేళ్లలో కేరళ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ఫొటోలను విడుదల చేశారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్​ ఇస్సాక్​తో పాటు పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.

140స్థానాలున్న కేరళ అసెంబ్లీకి ఏప్రిల్​ 6న ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు విడుదలవుతాయి.

ఇదీ చదవండి: కేరళ ఫలితాలను శాసించే 'సామాజిక లెక్క'లు

కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధికార లెఫ్ట్​ డెమొక్రటిక్​ ఫ్రంట్(ఎల్​డీఎఫ్​)​ దూసుకుపోతోంది. 'ఎల్​డీఎఫ్​దే మళ్లీ అధికారం' నినాదంతో ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. తిరువనంతపురంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్​కు రాష్ట్ర సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏ విజయరాఘవన్ ప్రచారానికి సబంధించిన ట్యాగ్​లైన్​ను అందజేశారు.​ కేరళవ్యాప్తంగా ఈ నినాదంతో కూడిన ఫ్లెక్సీలు, బ్యానర్లను పార్టీ శ్రేణులు ఏర్పాటు చేశాయి.

తమ అభివృద్ధి పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు విజయన్​. ఎల్​డీఎఫ్​ ఎన్నికల నినాదం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమానికి హాజరైన క్రైస్తవ మతాధికారులు గత ఐదేళ్లలో కేరళ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ఫొటోలను విడుదల చేశారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్​ ఇస్సాక్​తో పాటు పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.

140స్థానాలున్న కేరళ అసెంబ్లీకి ఏప్రిల్​ 6న ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు విడుదలవుతాయి.

ఇదీ చదవండి: కేరళ ఫలితాలను శాసించే 'సామాజిక లెక్క'లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.