ETV Bharat / bharat

కశ్మీర్​లో 60 మంది యువత మిస్సింగ్.. తాలిబన్లతో కలిశారా?

author img

By

Published : Sep 1, 2021, 10:11 PM IST

అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు(Afghna Taliban) ఆక్రమించుకున్న నేపథ్యంలో కశ్మీర్​ లోయలో(Kashimr vally) నుంచి 60 మంది యువకులు కనిపించకుండా పోయినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడతున్నాయని కశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు. ఈ విషయంపై స్పష్టతనిచ్చారు.

KASHMIR NEWS
కశ్మీర్ యూత్ మిస్సింగ్

జమ్ముకశ్మీర్​కు చెందిన 60 మంది యువకులు(kashmir youth) కనిపించకుండా పోయినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న వార్తల్లో నిజం లేదని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు(taliban afghanistan) ఆక్రమించుకున్న నేపథ్యంలో.. లోయలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువకులు కనిపించట్లేదని పలు సోషల్ మీడియాలలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయని పేర్కొన్నారు. తాలిబన్లతో వీరు కలిశారా? అన్న ప్రశ్నకు బలం చేకూర్చేలా ప్రచారం జరిగిందని తెలిపారు. అయితే ఇవన్నీ.. పుకార్లేనని స్పష్టం చేశారు. స్థానికంగా ఎలాంటి మిస్సింగ్ కేసులు నమోదు కాలేదని వివరించారు.

"కశ్మీర్​ లోయలోని కొన్ని ప్రాంతాల నుంచి 60 మంది యువకులు కనిపించకుండా వెళ్లిపోయారని కొన్ని సామాజిక మాధ్యమ వేదికల్లో ప్రచారమవుతోంది. అఫ్గాన్​ను తాలిబన్లు ఆక్రమించుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలా జరిగిందని పోస్టుల్లో పేర్కొన్నారు. ఇది పూర్తిగా అవాస్తవం."

-కశ్మీర్ జోన్​ డీజీపీ

ఆగస్టు 15న తాలిబన్లు అఫ్గానిస్థాన్​ను పూర్తిగా ఆక్రమించుకున్నారు. అప్పటి నుంచి దేశంలో తాలిబన్ల అరాచకాలు మొదలయ్యాయి. ప్రజలు దేశాన్ని విడిచి పారిపోయేందుకు యత్నిస్తున్నారు.

మరోవైపు, జమ్ము కశ్మీర్​లో ఉగ్రవాద నిర్మూలనకు అవిరామ కృషి చేస్తున్నాయి భద్రతా బలగాలు. ఈ ఏడాది 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టారు. సరిహద్దు అవతలి నుంచి దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు చేస్తున్న ప్రయత్నాలను భగ్నం చేస్తున్నారు.

ఇదీ చదవండి: 'హెలికాప్టర్​కు శవాన్ని వేలాడదీసిన తాలిబన్లు'- నిజమెంత?

జమ్ముకశ్మీర్​కు చెందిన 60 మంది యువకులు(kashmir youth) కనిపించకుండా పోయినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న వార్తల్లో నిజం లేదని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు(taliban afghanistan) ఆక్రమించుకున్న నేపథ్యంలో.. లోయలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువకులు కనిపించట్లేదని పలు సోషల్ మీడియాలలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయని పేర్కొన్నారు. తాలిబన్లతో వీరు కలిశారా? అన్న ప్రశ్నకు బలం చేకూర్చేలా ప్రచారం జరిగిందని తెలిపారు. అయితే ఇవన్నీ.. పుకార్లేనని స్పష్టం చేశారు. స్థానికంగా ఎలాంటి మిస్సింగ్ కేసులు నమోదు కాలేదని వివరించారు.

"కశ్మీర్​ లోయలోని కొన్ని ప్రాంతాల నుంచి 60 మంది యువకులు కనిపించకుండా వెళ్లిపోయారని కొన్ని సామాజిక మాధ్యమ వేదికల్లో ప్రచారమవుతోంది. అఫ్గాన్​ను తాలిబన్లు ఆక్రమించుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలా జరిగిందని పోస్టుల్లో పేర్కొన్నారు. ఇది పూర్తిగా అవాస్తవం."

-కశ్మీర్ జోన్​ డీజీపీ

ఆగస్టు 15న తాలిబన్లు అఫ్గానిస్థాన్​ను పూర్తిగా ఆక్రమించుకున్నారు. అప్పటి నుంచి దేశంలో తాలిబన్ల అరాచకాలు మొదలయ్యాయి. ప్రజలు దేశాన్ని విడిచి పారిపోయేందుకు యత్నిస్తున్నారు.

మరోవైపు, జమ్ము కశ్మీర్​లో ఉగ్రవాద నిర్మూలనకు అవిరామ కృషి చేస్తున్నాయి భద్రతా బలగాలు. ఈ ఏడాది 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టారు. సరిహద్దు అవతలి నుంచి దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు చేస్తున్న ప్రయత్నాలను భగ్నం చేస్తున్నారు.

ఇదీ చదవండి: 'హెలికాప్టర్​కు శవాన్ని వేలాడదీసిన తాలిబన్లు'- నిజమెంత?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.