దేశవ్యాప్తంగా కరోనా ఆంక్షలు కొనసాగుతున్న వేళ.. వివాహాది శుభకార్యాలకు ఆటంకం ఏర్పడింది. పెళ్లిలో బరాత్కు ఉన్న క్రేజ్ వేరే. బందువుల మధ్య కారు, గుర్రపు బండి వంటి వాటిలో వరుడు ఊరేగుతాడు. కానీ, ఛత్తీస్గఢ్లో విధించిన ఆంక్షలు ఓ యువకుడి బరాత్కు అడ్డువచ్చాయి. కానీ, ఆ యువకుడు కొవిడ్ ఆంక్షలు పాటిస్తూ బైక్తో బరాత్ నిర్వహించాడు.
ఈ సంఘటన ఝార్ఖండ్-ఛత్తీస్గఢ్ సరిహద్దులోని బలరాంపుర్ వద్ద జరిగింది. అయితే.. ఈ బైక్ బరాత్ విషయం తెలుసుకున్న పోలీసులు వరుడ్ని ఆపి ప్రశ్నించారు. తన పెళ్లి జరుగుతుందనడానికి... ఐదుగురు సాక్ష్యులను చూపెట్టాలని కోరారు.
అయితే.. సదరు వ్యక్తి పోలీసుల మాటలు వినకుండా.. తన బైక్పై ఒంటరిగా వెళ్లిపోయాడు. ఆ యువకుడి స్వస్థలం ఝార్ఖండ్ కాగా.. ఛత్తీస్గఢ్లో అతని వివాహం జరగనుంది. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్గా మారింది.
ఇదీ చూడండి: కొవిడ్ వేళ గుర్రపు పందెం- భారీగా జనం!
ఇదీ చూడండి: బొమ్మ జీపు అడిగితే.. నిజమైనదే చేసి ఇచ్చిన తండ్రి