ETV Bharat / bharat

భారత్​లో ఉండేందుకు జపనీయుడి 'కుర్చీ' ప్లాన్

author img

By

Published : Mar 5, 2021, 2:57 PM IST

కర్ణాటకలో ఉండే జపాన్​కు చెందిన ఓ వ్యక్తి.. తన వీసా గడువు ముగిసినా భారత్​లో ఉండేందుకు మాస్టర్ ప్లాన్ వేశాడు. ఏదైనా దొంగతనం చేస్తే ఇక్కడే ఉండొచ్చని భావించాడు. ఏకంగా ఏసీపీ కార్యాలయంలోనే ఓ కుర్చీని దొంగిలించి 'నాపై కేసు నమోదు చేసి, అరెస్ట్​ చేయండి' అంటూ పోలీసులకు సవాల్ విసిరాడు.

Japanese man steals chair from ACP's office in Bengaluru: refused to go back Japan
భారత్​లో ఉండేందుకు జపనీయుడి మాస్టర్ ప్లాన్..

బెంగళూరులో ఉండే జపనీయుడు హిరోటోషి తనాఖా వీసా గడువు ముగిసింది. ఎలాగైనా భారత్​లో ఉండేందుకు మాస్టర్​ ప్లానే వేశాడు. ఏదైనా కేసులో అరెస్టయితే భారత్​లో ఉండొచ్చని భావించాడు. దీనికోసం ఏకంగా ఏసీపీ కార్యాలయంలో కుర్చీ దొంగిలించాడు. తనపై కేసు నమోదు చేసి.. త్వరగా అరెస్ట్​ చేయమని పోలీసులకు సవాల్ చేస్తున్నాడు.

కారణం ఇదే..

జపాన్​కు చెందిన హిరోటోషి తనాఖా.. ఇంగ్లీష్​ నేర్చుకోవటం కోసం విద్యార్థి​ వీసాపై 2019లో బెంగళూరు వచ్చాడు. కొన్ని నెలల క్రితం కోచింగ్​ సెంటర్​ ప్రిన్సిపల్​పై దాడి చేశాడు. ఈ ఘటనపై ఆర్​టీ నగర్​ స్టేషన్​లో తనాఖాపై కేసు నమోదైంది. అయితే ఇరువర్గాల మధ్య రాజీ కుదిరినందు వల్ల కర్ణాటక హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది. అయితే... ఈ కేసు దర్యాప్తు సమయంలో పోలీసులు తన వద్ద లంచం తీసుకున్నారన్నది తనాఖా ఆరోపణ.

తనాఖా వీసా గడువు ఫిబ్రవరి 28తో ముగిసింది. అయితే... తన దగ్గర లంచం తీసుకున్న పోలీసులపై చర్యలు తీసుకునేంత వరకు, తనకు న్యాయం జరిగేంత వరకు భారత్​లోనే ఉండాలని భావించాడు తనాఖా. ఏసీపీ కార్యాలయంలో కుర్చీ​ దొంగిలిస్తే తనపై కేసు నమోదు అవుతుందని, తాను ఇక్కడే ఉండొచ్చన్నది అతడి ఆలోచన.

ఇదీ చదవండి : సోదరితో ఫోన్​ మాట్లాడినందుకు దారుణ హత్య

బెంగళూరులో ఉండే జపనీయుడు హిరోటోషి తనాఖా వీసా గడువు ముగిసింది. ఎలాగైనా భారత్​లో ఉండేందుకు మాస్టర్​ ప్లానే వేశాడు. ఏదైనా కేసులో అరెస్టయితే భారత్​లో ఉండొచ్చని భావించాడు. దీనికోసం ఏకంగా ఏసీపీ కార్యాలయంలో కుర్చీ దొంగిలించాడు. తనపై కేసు నమోదు చేసి.. త్వరగా అరెస్ట్​ చేయమని పోలీసులకు సవాల్ చేస్తున్నాడు.

కారణం ఇదే..

జపాన్​కు చెందిన హిరోటోషి తనాఖా.. ఇంగ్లీష్​ నేర్చుకోవటం కోసం విద్యార్థి​ వీసాపై 2019లో బెంగళూరు వచ్చాడు. కొన్ని నెలల క్రితం కోచింగ్​ సెంటర్​ ప్రిన్సిపల్​పై దాడి చేశాడు. ఈ ఘటనపై ఆర్​టీ నగర్​ స్టేషన్​లో తనాఖాపై కేసు నమోదైంది. అయితే ఇరువర్గాల మధ్య రాజీ కుదిరినందు వల్ల కర్ణాటక హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది. అయితే... ఈ కేసు దర్యాప్తు సమయంలో పోలీసులు తన వద్ద లంచం తీసుకున్నారన్నది తనాఖా ఆరోపణ.

తనాఖా వీసా గడువు ఫిబ్రవరి 28తో ముగిసింది. అయితే... తన దగ్గర లంచం తీసుకున్న పోలీసులపై చర్యలు తీసుకునేంత వరకు, తనకు న్యాయం జరిగేంత వరకు భారత్​లోనే ఉండాలని భావించాడు తనాఖా. ఏసీపీ కార్యాలయంలో కుర్చీ​ దొంగిలిస్తే తనపై కేసు నమోదు అవుతుందని, తాను ఇక్కడే ఉండొచ్చన్నది అతడి ఆలోచన.

ఇదీ చదవండి : సోదరితో ఫోన్​ మాట్లాడినందుకు దారుణ హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.